చేనేతను ప్రొత్సహించడానికి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ప్రతి ఏడాది చీరలను అందజేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ప్రగతి భవన్లో చేనేత, జౌళి శాఖ మంత్రి కె.టీ. రామారావు, మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు చీరలను పంపిణీ చేశారు. ట్రాన్స్ జెండర్లు తయారు చేసిన జ్యూట్ బ్యాగులను కూడా కేటీఆర్ విడుదల చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు సవరించి 30 శాతం…
పాపులర్ స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫారూఖీకి మరో షాక్ తప్పలేదు. జనవరి 9న హైదరాబాద్ లో జరగాల్సిన ఆయన షో రద్దు అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల కారణంగా మరో రెండు మూడు రోజుల్లో జరగాల్సిన స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో రద్దు అయ్యింది. కొత్త కోవిడ్ మార్గదర్శకాలలో, 250 మందికి పైగా ఒకే దగ్గర గుమిగూడడం నిషేధం కాబట్టి ‘ధంధో’ షో రద్దు అయ్యిందనే విషయాన్నీ సోషల్ మీడియాలో మునావర్…
జీవో 317 పై అలుపెరుగని పోరాటం చేస్తామంటోంది బీజేపీ. ఉద్యోగ,ఉపాధ్యాయుల కోసం బీజేపీ చేపట్టిన ఉద్యమం ముగియలేదని, బండి సంజయ్ ని రాజకీయంగా అణిచివేయాలని కేసీఆర్ కుట్రతో అరెస్ట్ చేశారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, అరెస్ట్ చేయడం తప్పు అని హైకోర్టు చెప్పింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు అంతా సిద్ధంగా ఉంటాం అన్నారాయన. రేపు ఛత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి రమన్ సింగ్, తరుణ్ చుగ్, లక్ష్మణ్,డీకే అరుణ…
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణు అగ్ర స్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషి చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు పిలునిచ్చారు. బుధవారం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్, వివిధ విభాగాలకు చెందిన శాఖదిపతులతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని సాధించేందుకు వివిధ…
కేంద్ర మంత్రులు నిర్మలాసీతారమన్, మహేంద్రనాథ్లకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లేక రాశారు. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను కేంద్రం పునఃప్రారంభించాలని కోరుతూ కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. సీసీఐ యూనిట్ తెరిచేందుకు సానుకూల అంశాలున్నాయని ఆయన అన్నారు. దేశీయంగా సిమెంట్కు భారీ డిమాండ్ ఉందని, ప్రైవేట్ సిమెంట్ కంపెనీలు లాభాలు అర్జిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే సీసీఐ తెరిచేందుకు రాష్ట్రప్రభుత్వం సహకరిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కంపెనీ ప్రారంభిస్తామంటే కొత్త కంపెనీలకు ఇచ్చే ప్రోత్సహకాలు,…
హైదరాబాద్ వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాదులో మరో భారీ ఫ్లై ఓవర్ ను… ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. షేక్ పేట్ ఫ్లైఓవర్ను వాహనాదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ మహానగరంలో కొత్తగా నిర్మించిన షేక్ పేట ఫ్లై ఓవర్ ను తెలంగాణా రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నూతన సంవత్సర బహుమతిగా ఈ ఫ్లైఓవర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు మంత్రి కేటీఆర్. Read Also: హామీలన్ని…
చీప్ లిక్కర్పై తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చగా మారాయి.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే రూ.70కే చీప్ లిక్కర్ అందిస్తాం.. ఆర్థిక పరిస్థితి మెరుగైతే రూ.50కే అమ్ముతామంటూ ప్రకటించారు.. అయితే, దీనిపై పెద్ద రచ్చే జరిగింది.. ఇదేనా బీజేపీ విధానం అంటూ సోషల్ మీడియా వేదికగా పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీపై దుమ్మెత్తిపోశారు.. ఆయన సోమువీర్రాజు కాదు.. సారాయి వీర్రాజు అంటూ సెటైర్లు వేశారు.. అయితే, మరోసారి…
నేడు నల్గొండ జిల్లాలో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి లు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోజు ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10:30 గంటలకు నల్లగొండకు చేరుకుంటారు. వారికి బైక్ ర్యాలీలతో టీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలుకనున్నారు. ఉదయం 10:45 నిమిషాలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎస్సీ,ఎస్టీ హాస్టల్ ప్రారంభం. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఐటీ…
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు పురపాలికలు మేయర్లు,చైర్పర్సన్, కమిషనర్లతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణాలు, పల్లెల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణాన్ని ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో…
రాష్ర్టానికి అమూల్ సంస్థ రావడం గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే రాష్ర్టంలో ఎన్నో సంస్థలు వచ్చాయని, ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయని మంత్రి అన్నారు. ఇప్పుడు అమూల్ సంస్థ రాష్ర్టానికి రావడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుందని కేటీఆర్ అన్నారు.రాష్ర్ట ప్రభుత్వం, అమూల్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరినట్టు కేటీఆర్ తెలిపారు. Read Also: వైసీపీ పతనం ప్రారంభమైంది: జీవీఎల్ నరసింహరావు ఒప్పందంలో భాగంగా బేకరీ తయారు ప్లాంట్ను…