రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దుబ్బాక ఎమ్యెల్యే రఘునందన్ రావు సతీసమేతంగా దర్శించుకున్నారు. రఘునందన్ రావు దంపతులకు ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదాన్నిఆలయ అర్చకులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. సిరిసిల్ల జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటిఆర్ నువ్వు సిరిసిల్ల, వేములవాడ రెండు కళ్ళు అన్నావ్, సిరిసిల్ల కి ఎన్ని నిధులు పోయాయి..వేములవాడ కి ఎన్ని నిధులు ఇచ్చారని ఆయన అన్నారు. అంతేకాకుండా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పై వచ్చే బడ్జెట్ లో యువరాజు కేటిఆర్ ను, సీఎం కేసీఆర్ ను నిలదిస్తానని ఆయన వెల్లడించారు. శివరాత్రి పేరిట హంగామాలో భక్తుల కోసం ఎన్ని ఖర్చు చేస్తున్నారు.. వీఐపీల కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు అని ఆయన అన్నారు.
శివరాత్రి జాతరలో ఉన్న 550 వసతి గదులు ఉండగా విఐపి కోసం 400 వరకు ఇస్తున్నారని, యాదాద్రి కి ఒక న్యాయం..వేములవాడ రాజన్న ఆలయం పట్ల ఒక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. వేములవాడ ఎమ్యెల్యే గుడికి ఏం చేయడు పట్టించుకోడు.. ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పటికైనా అభివృద్ధి చేయండని ఆయన అన్నారు. వేములవాడ రాజన్న అంటే చాల శక్తిమంతమైన దేవుడు, కానీ సీఎం కేసీఆర్ మాత్రం దేవుడికే శఠ గోపం పట్టాలనుకోవడం ముర్కత్వం అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ గారు మీరే స్వయంగా వేములవాడ కి వచ్చి చెప్పారు.. రూ.400 కోట్లతో డెవలప్ చేస్తామని, ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలి అని ఆయన మండిపడ్డారు. లక్షల మంది భక్తులు వస్తున్న కనీసం భక్తులకు సౌకర్యాలు కల్పించడం లేదని, ఏటా 100 కోట్ల ఆదాయం దాటుతున్న భక్తుల సమస్యలు మాత్రం తీరడం లేదని ఆయన అన్నారు. రంగుల రంగుల బ్రోచర్ల తో కాలం వెళ్లదీస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.