Redeveloping Colonies: సొంత నిధులతో కొత్త భవనాలు.. ఢిల్లీలో 7 ప్రభుత్వ కాలనీలకు కొత్త కళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని పాతబడిన ఏడు ప్రభుత్వ నివాస కాలనీలను సరికొత్తగా తీర్చిదిద్దేందుకు భారత ప్రభుత్వం ఒక వినూత్న ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ప్రజలకు సంబంధించి పన్నుల రూపంలో వచ్చిన డబ్బును ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. సరోజినీ నగర్, నేతాజీ నగర్, నౌరోజీ నగర్, కస్తూరిబా నగర్, త్యాగరాజ్ నగర్, శ్రీనివాసపురి, మహమ్మద్పూర్ వంటి సుమారు 537 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాల్లో ఈ పనులు జరుగుతున్నాయి.

Also Read
- Aaron Finch: వరల్డ్ క్రికెట్లో కోహ్లీనే తోపు.. రెండో స్థానంలో సచిన్.. ఫించ్ సంచలన ర్యాంకింగ్స్
- Bhogapuram International Airport: నేడే భోగాపురం ఎయిర్పోర్ట్ జాతికి అంకితం.. మోదీ పర్యటనకు సర్వం సిద్ధం.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Astrology: ఆగస్టు 01 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
ఈ కాలనీల్లోని చాలా ఇళ్లు పాతబడిపోయి, నివాసానికి ప్రమాదకరంగా మారాయి. దాదాపు 40 శాతం ఇళ్లు ఉండటానికి వీలు లేని స్థితికి చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మరో 20 వేలకు పైగా ఇళ్ల కొరత ఏర్పడింది. అందుకే పాతబడిన చిన్న బిల్డింగుల స్థానంలో.. అన్ని సౌకర్యాలతో కూడిన ఆధునిక అపార్ట్మెంట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల 21,000 కొత్త ఇళ్లు అందుబాటులోకి వస్తాయి. మార్చి 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 2,722 కొత్త ఫ్లాట్లను ప్రారంభించనున్నారు.

అలాగే సరోజినీ నగర్, నేతాజీ నగర్ వంటి ప్రాంతాల్లో మరో 6,632 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 537 ఎకరాల్లో కేవలం 13 శాతం భూమిని (అంటే సుమారు 69 ఎకరాలు) వ్యాపార సంస్థలకు లేదా ప్రైవేట్ నివాసాలకు కేటాయించి నగదుగా మారుస్తారు.

దీని ద్వారా సుమారు రూ.35,100 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు దాదాపు రూ.32,800 కోట్లు. అంటే.. నిర్మాణ ఖర్చులు పోను ప్రభుత్వానికి అదనంగా మరో రూ.2,300 కోట్ల మిగులు ఆదాయం కూడా వస్తుంది. ప్రభుత్వ ఖజానాపై పైసా భారం పడకుండా.. వేలాది మంది ఉద్యోగులకు కొత్త ఇళ్లను అందించేలా ఈ పనులు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Commonwealth Games 2026: భారత్కు డబుల్ మెడల్.. నీరజ్ చోప్రాకు రజతం, యశ్వీర్ సింగ్కు కాంస్యం
-
Aaron Finch: వరల్డ్ క్రికెట్లో కోహ్లీనే తోపు.. రెండో స్థానంలో సచిన్.. ఫించ్ సంచలన ర్యాంకింగ్స్
-
Jagapathi Babu: ఎవరూ నన్ను కొట్టలేదు.. అసలు నిజం చెప్పి ఊరట ఇచ్చిన జగ్గూభాయ్!
-
PM Modi: ‘తిట్లతో ఏ సమస్యా పరిష్కారం కాదు’.. తప్పుదారి పట్టిన యువతకు సరైన మార్గం చూపాలి.. ప్రధాని మోడీ కొత్త వీడియో..
-
Bhogapuram International Airport: నేడే భోగాపురం ఎయిర్పోర్ట్ జాతికి అంకితం.. మోదీ పర్యటనకు సర్వం సిద్ధం.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!