Power Bill Hike: విద్యుత్ ఛార్జీల పెంపు.. వివరాలు వెల్లడించిన ఈఆర్సీ
- విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ఈఆర్సీ స్పష్టీకరణ
- ₹9,583 కోట్ల రెవెన్యూ లోటు.. ప్రభుత్వ మద్దతు ఆశలు
- రాష్ట్రంలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్
- గృహజ్యోతి పథకం – వినియోగదారులకు పెద్ద ఊరట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Power Bill Hike: తెలంగాణ విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్లు వస్తున్న వార్తలపై ఈఆర్సీ స్పందించింది. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపును ప్రతిపాదించలేదని ఈఆర్సీ తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎలాంటి టారిఫ్ పెంపు కానీ, ‘టైమ్ ఆఫ్ ద డే’ ఛార్జీల పెంపు కానీ ఉండబోదని ఈఆర్సీ అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాదికి సుమారు ₹50,242 కోట్ల ఆదాయ అవశ్యకత ఉంటుందని అంచనా వేసిన సంస్థ, ప్రస్తుత ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయం ₹40,659 కోట్లు మాత్రమేనని వివరించింది. ఈ క్రమంలో ఏర్పడే సుమారు ₹9,583 కోట్ల రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక మద్దతును ఆశిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన వ్యయం పెరిగినప్పటికీ, వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం ఈ గ్యాప్ను భరించనుందని స్పష్టమవుతోంది.
Nepal Elections: నేపాల్ ఎన్నికల్లో బాలెన్ షా చేతిలో “భారత వ్యతిరేకి” ఘోర ఓటమి..
Also Read
- TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
- Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
- Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
- YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం , వినియోగదారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా ఎస్పీడీసీఎల్ (SPDCL) పరిధిలో గత ఏడాదితో పోలిస్తే కొత్తగా సుమారు 12 లక్షల మంది వినియోగదారులు చేరడం గమనార్హం. ప్రస్తుతం మొత్తం కనెక్టెడ్ లోడ్ 35,175 MVAలకు చేరుకోగా, గరిష్ట విద్యుత్ డిమాండ్ 20,975 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వినియోగం పరంగా చూస్తే పారిశ్రామిక రంగం 31 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, గృహ రంగం 23 శాతం, వ్యవసాయ రంగం 21 శాతం వాటాను కలిగి ఉన్నాయి. డిమాండ్ ఎంత పెరిగినప్పటికీ నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు భరోసా ఇచ్చారు.
డిస్కంల పనితీరులో కూడా గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. పంపిణీ , సరఫరా నష్టాలను 9.60 శాతం నుండి 8.04 శాతానికి తగ్గించడంలో సంస్థ విజయం సాధించింది. అలాగే, విద్యుత్ కొనుగోలు వ్యయం కూడా యూనిట్కు ₹6.35 నుండి ₹5.54కు తగ్గడం గమనార్హం. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గృహజ్యోతి’ పథకం వినియోగదారులకు గొప్ప వరంగా మారింది. ఎస్పీడీసీఎల్ పరిధిలో 30 శాతం గృహ వినియోగదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 5.44 కోట్ల జీరో బిల్లులు జారీ చేయగా, ఇందుకు సంబంధించి ప్రభుత్వం ₹1930.66 కోట్ల సబ్సిడీని విడుదల చేసింది. ఈ పథకం వల్ల విద్యుత్ చౌర్యం కూడా గణనీయంగా తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
-
CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
-
India vs Sri Lanka Test: 10 వికెట్ల సుతార్, సారాంశ్ జైన్ రాక.. కొలంబో టెస్ట్ తుది 11పై ఉత్కంఠ
-
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!