హైదరాబాద్ ప్రతిష్ట పెంచేలా.. నగరం సిగలో మరో కలికితురాయి చేరబోతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి ‘టీ హబ్’ ను ఈ నెల 28న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ భవిష్యత్తును అంచనా వేయడానికి ఉత్తమ మార్గం దానిని సృష్టించడం’’ అనే అబ్రహం లింకన్ వ్యాఖ్యలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కేటీఆర్. హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ కు పెద్ద పీట వేస్తూ టీహబ్ కొత్త…
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఎంజీ కంపెనీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ పార్కును మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించిన విషయం తెలిసిందే.. అయితే, జహీరాబాద్ లో నిమ్జ్ కోసం తమ భూములు తీసుకొని తగిన పరిహారం ఇవ్వలేదని అక్కడి రైతులు చాన్నాళ్ల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటారని నిమ్జ్ భూ నిర్వసితులను పోలీసులు వారి గ్రామాల్లోకి వెళ్లి ముందస్తు అరెస్టు చేశారు. కేటీఆర్ కార్యక్రమానికి వెళ్తున్న కొందరిపై లాఠీచార్జ్…
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ టిఆర్ఎస్లో వర్గపోరు 2018 నుంచి అనేక మలుపులు తిరుగుతోంది. గడిచిన ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధి.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారారావు ఓడిపోగా.. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్రెడ్డి గెలిచారు. మారిన పొలిటికల్ ఈక్వేషన్స్తో ఎమ్మెల్యే బీరం కాంగ్రెస్కు హ్యాండిచ్చి.. గులాబీ కండువా కప్పేసుకున్నారు. అప్పటినుంచి కొల్లాపూర్లో టీఆర్ఎస్ రెండు గ్రూపులుగా చీలి, వర్గపోరు రకరకాలుగా బుసలు కొడుతోంది. ఈ సమస్యపై మొదట్లోనే పార్టీ పెద్దలు దృష్టి పెట్టి ఉంటే పరిస్థితి…
బీజేపీ సర్కార్ తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్ పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. అగ్నిపథ్కు నిరసనగా రాజకీయ పార్టీలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్నివీర్ ల అంశంలో బీజేపీ నేతల వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అగ్నిపథ్తో యువత డ్రైవర్లు, ఎలక్ట్రిషన్లు, బార్బర్లుగా ఉపాధి పొందవచ్చని కేంద్రమంత్రి అన్నారని ఆయన పేర్కొన్నారు. అగ్నివీర్లను సెక్యూరిటీ…
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసంపై కేటీఆర్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. దీనిని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. నాడు రైతులతో పెట్టుకున్నారని.. నేడు జవాన్లతో పెట్టుకున్నారని పేర్కొన్నారు. ‘అగ్నివీర్ స్కీమ్కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మక నిరసనలు దేశంలోని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనం. తొలుత దేశంలో రైతులతో పెట్టుకున్నారు. ఇప్పుడు దేశంలోని జవాన్ అభ్యర్థులతో పెట్టుకుంటున్నారు. వన్ ర్యాంక్ – వన్ పెన్షన్ నుంచి ప్రతిపాదిత నో ర్యాంక్ – నో…
గత మూడురోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ (నాలుగోరోజు)కూడా ఆందోళనకు సిద్దమవుతున్న నేపథ్యంలో బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. విద్యార్థుల సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి బాసర ట్రిపుల్ ఐటీ వద్దకు వెళ్లనున్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులను కలిసి వారి సమస్యలను, డిమాండ్లను బండి సంజయ్ తెలుసుకోనున్నారు. కాగా.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన నాలుగోరోజుకు చేరింది. నిన్న బాసర ట్రిపుల్…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం టీఆర్ఎస్లో రాజకీయాలు వినూత్నంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్బాబు మరోసారి పోటీ చేస్తారా లేక.. ఆయనకు బదులుగా కొత్తగా పార్టీలో చేరిన చల్మెడ లక్ష్మీ నరసింహరావుకు టికెట్ ఇస్తారా అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇద్దరు నాయకులు వేములవాడలో పోటాపోటీగా సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. అదే స్పీడ్తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అది కేడర్ను మరింత గందరగోళంలోకి నెడుతోందట. కొంతకాలంగా ఎమ్మెల్యే రమేష్ పౌరసత్వంపై వివాదం చెలరేగుతోంది. సమస్య కోర్టు…
టీఆర్ఎస్ పార్టీ నేతలు బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగడుతున్నారు. ఇటీవల 10 లక్షల ఉద్యోగాలపై టీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. ఇది ఎన్నికల స్టంట్ గా అభివర్ణించింది. దీనిపై ప్రధాని మోదీని విమర్శిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే 10 లక్షల ఉద్యోగాలను స్వాగతిస్తున్నాం అంటూనే గతంలో బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించిందని.. ప్రస్తుతం ఉద్యోగాల భర్తీని నమ్మలేమని వ్యాఖ్యానించారు. దీంతో పాటు దేశంలో ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్భనం,…