KTR: వార్నింగ్.. చిల్లరమల్లరగా మాట్లాడితే ఊరుకోనే ప్రసక్తి లేదు.. మా వాణి కూడా వినిపిస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిల్లరమల్లరగా మాట్లాడితే ఊరుకోనే ప్రసక్తి లేదు.. మా వాణి కూడా వినిపిస్తామని మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో రూ.2.50 కోట్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక పిల్లల సంరక్ష ణ విభాగంతోపాటు పలు విభాగాలను శుక్రవారం కేటీఆర్ ప్రారంభించారు. బీసీ స్టడీ సర్కిల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘కేంద్రానికి పన్నుల రూపం లో తెలంగాణ ఇచ్చిందే ఎక్కువ. తెలంగాణకు కేంద్రం నుంచి వ చ్చింది తక్కువ. దేశంలోని వెనకబడిన రాష్ట్రాలకు తెలంగాణ చెమట, రక్తం ఉపయోగపడుతున్నందుకు సంతోషపడుతున్నామని తెలిపిన కేటీఆర్.. కొందరు ఇక్కడికొచ్చి చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఇవ్వనివి ఇచ్చినట్లు చెబుతున్నారు. విమర్శలు చేస్తే పర్లేదు కానీ.. రాజకీయ భావదారిద్య్రంతో మాట్లాడితే ఊరుకోం. వారందరికి మావాణి వినిపించాల్సి వుంటుందని మండిపడ్డారు. తాజాగా నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ విభాగంలో దేశంలోనే మొదటి ర్యాంకు.. జనరల్లో రెండో ర్యాంకు సాధించడం గర్వకారణమని తెలిపారు.
కాగా.. స్వచ్ఛ సర్వేక్షణ్లో 12 మున్సిపాలిటీలతోపాటు 10గ్రామాలు.. 19 పంచాయతీలు అవార్డులు అందుకోవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. అయితే.. ఆర్థికాభివృద్ధిలోనూ తెలంగాణ 4వ స్థానంలో ఉందని వెల్లడించారు. అయితే.. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, కర్ణాటకసహా పలురాష్ట్రాలకు తెలంగాణ నుంచి నిధులు వెళ్తేనే పనులు జరిగే పరిస్థితి ఉందన్నారు. దీంతో.. భారత జాతి నిర్మాణానికి తెలంగాణ దోహదపడుతుంటే ఇక్కడ కొంతమంది మిడిమిడి జ్ఞానంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ చేపట్టిన పల్లె గోస- జనం గోస యాత్ర పై మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా పల్లె గోస పడడం లేదని, జనం గోస అసలే లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు చైతన్య వంతులని.. నోటితో నవ్వుతూ.. నొసటితో వెక్కిరించేవారిని నమ్మరని కేటీఆర్ ఎద్దేవ చేసారు. బీజేపీ మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించవచ్చని అనుకుంటున్న వారే అమాయకులుగా మిగిలిపోతారన్నారని విమర్శించారు కేటీఆర్.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
CJI Justice NV Ramana: మీడియా కంగారు కోర్టులను నడిపిస్తోంది.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఫైర్
తాజావార్తలు
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
-
APFDC: సినిమా షూటింగ్స్కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!