KTR: మున్సిపల్ అధికారి అత్యుత్సాహం.. కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూలై 24న మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని అనుకున్న విషయం తెలిసిందే.. అయితే.. భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. దీంతో మంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దని.. వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు సాయం చేయాలని పార్టీ శ్రేణులు, అభిమానులకు ‘గిఫ్ట్ ఏ స్మైల్ (Gift A Smile)’ కార్యక్రమం కింద సహాయం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబురాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేస్తూ మానవత్వం చాటుకున్నారు. కానీ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జి.గంగాధర్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించడం చర్చనీయాశం అయింది.
read also: Astrology: జులై 30, శనివారం దినఫలాలు
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జి.గంగాధర్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఈ నెల 24వ తేదీన బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈనేపథ్యంలో.. వాట్సాప్ గ్రూపులో మున్సిపల్ కమిషనర్ జి.గంగాధర్ ప్రభుత్వాసుపత్రిలో మంత్రి పుట్టినరోజు వేడకలకు హజరుకావాలని మున్సిపల్ సిబ్బందికి సందేశం పంపించారు. అయితే.. ఈ కార్యక్రమంకు సీనియర్ అసిస్టెంట్ టి.రాజేశ్వరి, జూనియర్ అసిస్టెంట్ పున్నంచందర్, మోహన్, బిల్ కలెక్టర్ శ్రవణ్లు గైర్హాజరయ్యారు. దీంతో.. మున్సిపల్ కమిషనర్ జి.గంగాధర్ గైర్హాజరైన నలుగురు సిబ్బందికి మెమో జారీ చేశారు. అంతేకాదు.. వారిని 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాల నాయకులు కమిషనర్ కు కేటీఆర్ అంటే ఇంత అభిమానమా అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ఈ విషయం కాస్త.. మంత్రి కేటీఆర్ చెవిన పడింది. దీంతో సీరియస్ అయిన కేటీఆర్ మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహంపై తీవ్రంగా మండిపడ్డారు. ఆ అధికారిని సస్పెండ్ చేయాలని ట్విటర్ వేదికగా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో కమిషనర్ జి.గంగాధర్ తను చేసిన తప్పు దిద్దుకోవడానికి మరో ప్రకటన విడుదల చేసారు. అయినప్పటికీ.. మంత్రి ఆగ్రహానికి గురికాక తప్పలేదు. ఈయితే.. ఈ మెమోల జారీ విషయంలో సదరు అధికారిని కొంతమంది ప్రజాప్రతినిధులు తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తోంది. దీంతో.. మెమోలు జారీ చేస్తే ఏమికాదనే భరోసాను వారు ఇవ్వడంతో కమిషనర్ జారీకి సమ్మతించినట్లు సమాచారం. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆరే స్వయంగా కమిషనర్ను సస్పెండ్ చేయాలని పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేయడంతో స్థానిక ప్రజాప్రతినిధులు నోరు మెదపడం లేదు.
Read also: Monkeypox: యూరప్ రకానికి భిన్నంగా ఇండియా మంకీపాక్స్ వైరస్
I am the last person to encourage sycophancy in politics or administration
Read about an over enthusiastic Municipal commissioner issuing a memo to subordinates for not attending my birthday celebrations!🤦♂️
Have asked @cdmatelangana to suspend the MC for his absurd behaviour
— KTR (@KTRTRS) July 29, 2022
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!