KTR: మున్సిపల్ అధికారి అత్యుత్సాహం.. కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూలై 24న మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని అనుకున్న విషయం తెలిసిందే.. అయితే.. భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. దీంతో మంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దని.. వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు సాయం చేయాలని పార్టీ శ్రేణులు, అభిమానులకు ‘గిఫ్ట్ ఏ స్మైల్ (Gift A Smile)’ కార్యక్రమం కింద సహాయం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబురాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేస్తూ మానవత్వం చాటుకున్నారు. కానీ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జి.గంగాధర్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించడం చర్చనీయాశం అయింది.
read also: Astrology: జులై 30, శనివారం దినఫలాలు
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జి.గంగాధర్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఈ నెల 24వ తేదీన బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈనేపథ్యంలో.. వాట్సాప్ గ్రూపులో మున్సిపల్ కమిషనర్ జి.గంగాధర్ ప్రభుత్వాసుపత్రిలో మంత్రి పుట్టినరోజు వేడకలకు హజరుకావాలని మున్సిపల్ సిబ్బందికి సందేశం పంపించారు. అయితే.. ఈ కార్యక్రమంకు సీనియర్ అసిస్టెంట్ టి.రాజేశ్వరి, జూనియర్ అసిస్టెంట్ పున్నంచందర్, మోహన్, బిల్ కలెక్టర్ శ్రవణ్లు గైర్హాజరయ్యారు. దీంతో.. మున్సిపల్ కమిషనర్ జి.గంగాధర్ గైర్హాజరైన నలుగురు సిబ్బందికి మెమో జారీ చేశారు. అంతేకాదు.. వారిని 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాల నాయకులు కమిషనర్ కు కేటీఆర్ అంటే ఇంత అభిమానమా అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ఈ విషయం కాస్త.. మంత్రి కేటీఆర్ చెవిన పడింది. దీంతో సీరియస్ అయిన కేటీఆర్ మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహంపై తీవ్రంగా మండిపడ్డారు. ఆ అధికారిని సస్పెండ్ చేయాలని ట్విటర్ వేదికగా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో కమిషనర్ జి.గంగాధర్ తను చేసిన తప్పు దిద్దుకోవడానికి మరో ప్రకటన విడుదల చేసారు. అయినప్పటికీ.. మంత్రి ఆగ్రహానికి గురికాక తప్పలేదు. ఈయితే.. ఈ మెమోల జారీ విషయంలో సదరు అధికారిని కొంతమంది ప్రజాప్రతినిధులు తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తోంది. దీంతో.. మెమోలు జారీ చేస్తే ఏమికాదనే భరోసాను వారు ఇవ్వడంతో కమిషనర్ జారీకి సమ్మతించినట్లు సమాచారం. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆరే స్వయంగా కమిషనర్ను సస్పెండ్ చేయాలని పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేయడంతో స్థానిక ప్రజాప్రతినిధులు నోరు మెదపడం లేదు.
Read also: Monkeypox: యూరప్ రకానికి భిన్నంగా ఇండియా మంకీపాక్స్ వైరస్
I am the last person to encourage sycophancy in politics or administration
Read about an over enthusiastic Municipal commissioner issuing a memo to subordinates for not attending my birthday celebrations!🤦♂️
Have asked @cdmatelangana to suspend the MC for his absurd behaviour
— KTR (@KTRTRS) July 29, 2022
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..