ఇండియా మోటార్ స్పోర్ట్స్ రేసింగ్ హిస్టరీలో సరికొత్త అధ్యాయానికి హైదరాబాద్ వేదిక అయింది. నిన్న మెరుపు వేగంలో దూసుకెళ్తున్న కార్లు.. సరికొత్త సందడితో రేసింగ్ పోటీలు హైదరాబాద్ వాసుల్ని ఉర్రూతలూగించాయి. ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది.
మునుగోడు ఉపఎన్నికలో గెలిచిన TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేడు MLAగా ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. ఉదయం అసెంబ్లీలో ఈ కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావ్, జగదీష్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
నిజాం కాలేజీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల హాస్టల్ కేటాయింపు సమస్యపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల పక్షాన నిలబడి ఈ విషయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జోక్యం చేసుకుని తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
ఉత్కంఠరేపిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది.. గతంలో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని ఉప ఎన్నిక ఎమ్మెల్యేను చేసింది.. అయితే, నైతిక విజయం మాదే అంటున్నారు బీజేపీ నేతలు.. ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అని మునుగోడు ఫలితం చెబుతోంది అంటున్నారు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి… వందల కోట్ల ఖర్చు చేసి, ఓటర్ నీ భయ పెట్టినా బీజేపీకి 86 వేల ఓట్లు వచ్చాయన్న ఆయన.. నైతికంగా కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి విజయం సాధించారన్నారు..…
29Years Back KTR Bike: ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ ఒక్కసారిగా తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. తనకు కలిగిన అనుభూతిని తన అభిమానులతో సోషల్ మీడియాతో పంచుకున్నారు.