Kishan Reddy: సీబీఐ, సీఐడీ లను అడ్డుకునేందుకు పాత తేదీలతో జీవోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: ఎమ్మెల్యేల కొనుగులో విషయం తెలంగాణ రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది. సీఎం కేసీఆర్ దీనిపై నిన్న మాట్లాడిన మీడియా సమావేశంలో బీజేపీ శ్రేణులు ఒక్కొక్కరు ఘాటుగా స్పందిస్తున్నారు. సీఎం మాటలకు కౌంటర్ ఇస్తున్నారు. ఈనేపథ్యంలో ఢిల్లీలో వున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సీబీఐ, సీఐడీ లను అడ్డుకునేందుకు పాత తేదీలతో జీవోలు ఇచ్చారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలలో ఒక్కరితో నైనా రాజీనామా చేయించారా? అంటూ ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ ప్రెస్ మీట్ లో చాలా బాధ పడుతూ మాట్లాడారు..అసలు సినిమా ముందుంది అని 15 రోజుల కింద చెప్పారు. కేసీఆర్ సినిమా చూశాక కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని ఎద్దేవ చేశారు. ఎక్కడా బీజేపీ ప్రస్తావన లేదని అన్నారు. స్వామిజీలతో ప్రభుత్వాలు కూలిపోతాయా? రోహిత్ రెడ్డితో కూలిపోతుందా? కేసీఆర్ సర్కార్ అంత బలహీనంగా ఉందా? రోహిత్ రెడ్డి అంత నీతి వంతుడా? ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎలా రత్నాలు అయ్యారు? అంటూ ప్రశ్నలు గుప్పించారు.
Read also: Kishan Reddy: మీ ఎమ్మెల్యేలను కొనే ఖర్మ మాకు లేదు
Also Read
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర...వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
డిక్షనరీలో ఎన్ని రకాల తిట్లున్నాయో అన్నింటినీ కేసీఆర్ వాడారని ఎద్దేవ చేశారు. ఆక్రోశాన్ని, అబద్రతాభావాన్ని ప్రజల ముందు పెట్టారు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. చర్చించాల్సింది ఏమి లేదని,
బీజేపీలో చేర్చుకోవాలంటే, ఆశక్తి మాకు లేదా? బ్రోకర్లు మాకు అవసరమా? అంటూ సంచళన వ్యాఖ్యలు చేశారు. మేం బాజాప్తా, బరావర్, బరిగిసి చేర్చుకుంటామని స్పష్టం చేశారు. ఇలా చేసి చేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలన చేస్తున్నాడని మండిపడ్డారు. టీఆర్ఎస్ రాకముందు సెక్రటేరియట్ పని ఎలా ఉండేది? అని ప్రశ్నించారు. నెలలో 15 రోజులు ఫామ్ హౌస్ లో ఉండే మీరు మాకు చెప్తారా? అన్నారు. కేసీఆర్ కంటే ముందున్న ముఖ్యమంత్రులు ఎంత మందిని కలిసే వాళ్ళో వైట్ పేపర్ రిలీస్ చెయ్యాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి.
తాజావార్తలు
-
Employee Fraud : క్రెడిట్ కార్డులతో కోటి మోసం.. మాజీ ఉద్యోగి బాగోతం..
-
Paddy Bonus Rules: సన్న వడ్ల రైతులకు అలర్ట్.. రూ.500 బోనస్ రావాలంటే సెప్టెంబర్ 10లోపు ఈ పని చేయాల్సిందే..
-
Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
-
Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర…వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
-
Hyper Adhi: ‘అక్కడ ఆ ఇంద్రుడిది.. ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’..!
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?