Kishan Reddy: సీబీఐ, సీఐడీ లను అడ్డుకునేందుకు పాత తేదీలతో జీవోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: ఎమ్మెల్యేల కొనుగులో విషయం తెలంగాణ రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది. సీఎం కేసీఆర్ దీనిపై నిన్న మాట్లాడిన మీడియా సమావేశంలో బీజేపీ శ్రేణులు ఒక్కొక్కరు ఘాటుగా స్పందిస్తున్నారు. సీఎం మాటలకు కౌంటర్ ఇస్తున్నారు. ఈనేపథ్యంలో ఢిల్లీలో వున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సీబీఐ, సీఐడీ లను అడ్డుకునేందుకు పాత తేదీలతో జీవోలు ఇచ్చారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలలో ఒక్కరితో నైనా రాజీనామా చేయించారా? అంటూ ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ ప్రెస్ మీట్ లో చాలా బాధ పడుతూ మాట్లాడారు..అసలు సినిమా ముందుంది అని 15 రోజుల కింద చెప్పారు. కేసీఆర్ సినిమా చూశాక కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని ఎద్దేవ చేశారు. ఎక్కడా బీజేపీ ప్రస్తావన లేదని అన్నారు. స్వామిజీలతో ప్రభుత్వాలు కూలిపోతాయా? రోహిత్ రెడ్డితో కూలిపోతుందా? కేసీఆర్ సర్కార్ అంత బలహీనంగా ఉందా? రోహిత్ రెడ్డి అంత నీతి వంతుడా? ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎలా రత్నాలు అయ్యారు? అంటూ ప్రశ్నలు గుప్పించారు.
Read also: Kishan Reddy: మీ ఎమ్మెల్యేలను కొనే ఖర్మ మాకు లేదు
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
డిక్షనరీలో ఎన్ని రకాల తిట్లున్నాయో అన్నింటినీ కేసీఆర్ వాడారని ఎద్దేవ చేశారు. ఆక్రోశాన్ని, అబద్రతాభావాన్ని ప్రజల ముందు పెట్టారు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. చర్చించాల్సింది ఏమి లేదని,
బీజేపీలో చేర్చుకోవాలంటే, ఆశక్తి మాకు లేదా? బ్రోకర్లు మాకు అవసరమా? అంటూ సంచళన వ్యాఖ్యలు చేశారు. మేం బాజాప్తా, బరావర్, బరిగిసి చేర్చుకుంటామని స్పష్టం చేశారు. ఇలా చేసి చేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలన చేస్తున్నాడని మండిపడ్డారు. టీఆర్ఎస్ రాకముందు సెక్రటేరియట్ పని ఎలా ఉండేది? అని ప్రశ్నించారు. నెలలో 15 రోజులు ఫామ్ హౌస్ లో ఉండే మీరు మాకు చెప్తారా? అన్నారు. కేసీఆర్ కంటే ముందున్న ముఖ్యమంత్రులు ఎంత మందిని కలిసే వాళ్ళో వైట్ పేపర్ రిలీస్ చెయ్యాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి.
తాజావార్తలు
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!