Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Trs Mps Slams Bjp Leaders On Munugode Victory

TRS Mps On Munugode Bypoll: మునుగోడు ఓటర్లు కేసీఆర్ కు అండగా నిలిచారు

Published Date :November 7, 2022 , 3:16 pm
By NTV WebDesk
TRS Mps On Munugode Bypoll: మునుగోడు ఓటర్లు కేసీఆర్ కు అండగా నిలిచారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. మునుగోడు ఓటర్లు టీ ఆర్ ఎస్ కు సీఎం కేసీఆర్ కు తెలంగాణ కు అండగా నిలిచారన్నారు టీఆర్ఎస్ ఎంపీలు వెంకటేష్ నేత, మాలోత్ కవిత, మన్నె శ్రీనివాసరెడ్డి. మునుగోడులో బీజేపీ ఓడిపోయినా బండి సంజయ్ చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారన్నారు. ఈ ఉప ఎన్నికలో టీ ఆర్ ఎస్ న్యాయం కోసం యుద్ధం చేసింది. మోడీ కార్పొరేట్ ఎత్తుగడలను మునుగోడు ఓటర్లు చిత్తు చేశారు. బండి సంజయ్ బుర్ర లేని అజ్ఞాని. డబ్బు పంచి టీఆర్ఎస్ ఎన్నికల్లో గెలిచిందని బండి సంజయ్ అనడం సిగ్గు చేటు. ఎన్నికల సంఘం కేంద్రం చేతిలో ఉంటుందని బండి సంజయ్‌కి తెలియదా? బీ ఆర్ ఎస్ ను అడ్డుకునేందుకు మోడీ,అమిత్ షా లు మునుగోడు ఉపఎన్నిక తెచ్చారని వెంకటేష్ నేత మండిపడ్డారు.

బీజేపీ ఓ డ్రామా కంపెనీలా మారింది. మోడీ అమిత్ షా లు రాజ్యాంగ వ్యవస్థలు దుర్వినియోగం చేసి మునుగోడు లో గెలవాలని చూశారు.. ఓటర్లు ఆ ప్రయత్నాన్ని వమ్ము చేశారు. 18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే ఉప ఎన్నిక వచ్చింది. .రాజీనామా చేస్తేనే కాంట్రాక్టు ఇస్తామని మోడీ అమిత్ షా లు రాజగోపాల్ ను బెదిరించారు. రాజ్యాంగ బద్ధంగానే ఇతర పార్టీ ఎమ్మెల్యేలు టీ ఆర్ ఎస్ లో చేరారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యే లను తీసుకోలేదు. బీజేపీ పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను మార్చింది. ఇక్కడ ఎమ్మెల్యేలను తీసుకోవడంతో ప్రభుత్వం మారలేదు. బీజేపీ బట్టేబాజ్ పార్టీ, ప్రభుత్వాలను మార్చేందుకు బీజేపీ వేల కోట్ల రూపాయలు వెచ్చించిoదని ఆరోపించారు.

Read Also:Dead Body On Bike: దారుణం.. బైక్‌పై కుమార్తె మృతదేహంతో తల్లిదండ్రులు

అరుణాచల్ ప్రదేశ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్,మణిపూర్,గోవా ,సిక్కిం ల లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు నీతి జాతి లేని రాజకీయాలు చేయలేదా? బండి సంజయ్ ఇప్పటికైనా జ్ఞానం పెంచుకోవాలి. బీజేపీ నేత వివేక్ అవివేకి. .సిగ్గు లేని దద్దమ్మ నేత వివేక్. కేటీఆర్ ను విమర్శించే స్థాయి వివేక్ కు లేదు. కార్పొరేట్ రాజకీయాలకు వివేక్ తెర లేపారు. వివేక్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయిన దొంగల పార్టీ బీజేపీ. దొంగల పార్టీ బీజేపీకి తెలంగాణలో స్థానం లేదన్నారు. బీ ఆర్ ఎస్ కు దేశమంతటా ఆదరణ లభిస్తోంది. మునుగోడు తీర్పు బి ఆర్ ఎస్ బలోపేతానికి బాటలు వేసిందన్నారు.

ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. మునుగోడులో తెలంగాణ ధర్మాన్ని నిలబెట్టారు. .పరీక్షా సమయంలో తెలంగాణ వైపు నిలబడ్డ మునుగోడు ఓటర్లకు పాదభివందనాలు. వేరే రాష్ట్రాల్లో బీజేపీ కూడా గెలిచింది.. అక్కడ కూడా అధికార దుర్వినియోగం చేసి గెలిచారా? రాజకీయాల్లో అట్టర్ ప్లాప్ నేత వివేక్.కేటీఆర్ కాదన్నారు. హుజురాబాద్ కు వివేక్ డబ్బులే వెళ్లాయి.. మునుగోడు కు వివేక్ డబ్బులే వెళ్లాయి. వివేక్ డబ్బు రాజకీయాలను మునుగోడు ప్రజలు తిరస్కరించారు. మునుగోడులో బీజేపీ ఆత్మహత్య చేసింది. తెలంగాణలో బీజేపీ కి ఆదరణ ఉండదని మునుగోడు ప్రజలు తేల్చారు. కేసీఆర్ కు ఏ పరీక్షా సమయంలో నైనా తెలంగాణ అండగా నిలుస్తుంది. మతోన్మాద శక్తులకు మునుగోడు గట్టి గుణపాఠం చెప్పారు. బీజేపీ నేతల తీరు మారకపోతే ప్రజలు తరిమి కొడతారన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి బీజేపీ నేతలపై విమర్శలు చేశారు. తెలంగాణ మోడల్ దేశానికి కావాలని మునుగోడు ప్రజలు బీ ఆర్ ఎస్ ను ఆశీర్వదించారన్నారు. బీజేపీ అబద్దాలను మునుగోడు ప్రజలు నమ్మలేదు. ఉపఎన్నిక తెచ్చిన బీజేపీ కి ప్రజలు బుద్ది చెప్పారన్నారు.

Read Also: YSR Statue : మంగళగిరిలో వైఎస్సార్‌ విగ్రహాన్ని తొలగించిన అధికారులు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp leaders
  • cm kcr
  • ktr
  • MP Maloth Kavitha
  • munugode

తాజావార్తలు

  • Telangana Rajya Sabha Candidates: తెలంగాణ నుంచి రాజ్యసభకు వేం నరేందర్‌రెడ్డి, సింఘ్వి..

  • SA vs NZ: ఫిన్ అలెన్ అజేయ సెంచరీ.. న్యూజిలాండ్ 9 వికెట్ల భారీ విజయంతో ఫైనల్‌కు

  • CM Revanth Reddy: అమిత్ షా తో ముగిసిన సీఎం రేవంత్ సమావేశం

  • Off The Record: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏంటి? నేతల అసంతృప్తి పార్టీకి నష్టమేనా?

  • Tecno Pop X: టెక్నో పాప్ X భారత్‌లో లాంచ్.. బడ్జెట్‌లో బెస్ట్ డిస్‌ప్లే, ఆఫ్‌లైన్ వాకీ-టాకీ ఫీచర్!

ట్రెండింగ్‌

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating.? తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions