నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నారు. ఐదురోజుల విరామం తర్వాత ఇవాళ తిరిగి ప్రారంభం కానున్నాయి. నేడు ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల ప్రారంభంలో దివంగత మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతి రావు మృతికి సంతాప తీర్మానం చేయనున్నారు. అనంతరం కేంద్ర విద్యుత్ , తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు ను సభలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టనున్నారు. మంత్రి కేటీఆర్ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, నిజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా లీజ్…
రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరనే వార్త అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్లోని ఏఐజీ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కృష్ణం రాజు కన్నుమూశారు. తీవ్రవిషాదంలో ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్న హీరో ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబసభ్యులు. కృష్ణం రాజు మృతి పట్ల ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. రెబల్ స్టార్, ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు…
నూకల ఎగుమతిపై నిషేధం విధించింది కేంద్రం.. ఎగుమతి పాలసీ సవరించిన కారణంగా నూకల ఎగుమతిపై నిషేధం విధించినట్లు పేర్కొంది.. వెంటనే నిషేధం అమల్లోకి వచ్చినా.. ఉత్తర్వులు రాకముందు నౌకల్లోకి ఎక్కించిన నూకలను సెప్టెంబర్ 15 వరకు అనుమతించబడతాయని స్పష్టం చేసింది.. గత ఏడాదితో పోలిస్తే ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడి తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో.. ధరలు పెరగకుండా నియంత్రించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే, కేంద్రం తాజాగా నిర్ణయంపై సీరియస్గా స్పందించారు…
భాగ్యనగరానికి సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ మరో మణిహారం అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక, ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ హితమైన, పర్యావరణానికి అనుకూలంగా ఉండే ప్రజా ఉపయోగకరమైన నాన్ మోటరైజ్ట్ ట్రాన్స్ పోర్టు సొల్యూషన్ను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అయితే.. దేశంలోనే ఇది మొట్టమొదటి సోలార్ రూఫ్ సైకిలింగ్ ట్రాక్ అని చెప్పారు. ఈసందర్భంగా.. స్థానికంగా ఉండే వ్యక్తులు ఆఫీస్ కు సైకిల్ పై…
ముందుగా నిర్ణించిన ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ఈ నెల 23వ తేదీనే ప్రారంభం కావాల్సింది ఉంది.. అయితే, వివాదాస్పద వ్యాఖ్యలు చేసి భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే రాజాసింగ్ ఎఫెక్ట్తో అవి చివరి నిమిషంలో వాయిదా వేశారు అధికారులు.. రాజాసింగ్ ఓ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో.. దీంతో.. పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వాయిదా పడిన కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. ఈరోజు ఉదయం 11…
ఎంతో కాలంగా.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న హైదరాబాద్ జర్నలిస్టులకు గుడ్న్యూస్ అందించింది. పదవి విరమణకు ఒక రోజు ముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీపి కబురు చెప్పారు.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి పచ్చజెండా ఊపారు.. అయితే, సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నారు హైదరాబాద్ జర్నలిస్టులు… జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసులో విచారణ జరుగుతుండగా.. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడదన్నారు చీఫ్ జస్టిస్ ఎన్వీ…
చౌటుప్పల్ వరదలతో మునిగిపోతుంటే సిద్దిపేట సిరిసిల్లలో అభివృద్ధి చేస్తున్నారు దీనిని సమానత్వం అంటారా అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో వీఆర్ఏల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపారు. కొన్ని నెలలుగా తమ సమస్యలను పరిష్కరించాలని 23 వేల మంది వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తుంటే కేసీఆర్ కు కళ్ళు మూసుకుపోయాయా? అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల…
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపి బండి సంజయ్ కు అమిత్ షా ఫోన్, పాదయాత్రలో అరెస్ట్ చేయడంపై అమిత్ సా ఆరాతీసారు. ఇవాళ బండి సంజయ్ను జనగాంలో అరెస్ట్ చేసి కరీంనగర్ లో ఆయన ఇంటికి తరలించిన పోలీసులు. ఈనేపథ్యంలో.. బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. కేసీఆర్కు నిజాయితీ ఉంటే ఆయన కూతుర్ని సస్పెండ్ చేయాలని డామాండ్ చేశారు. ఎక్కడ పాదయాత్ర ఆపారో, అక్కడి నుంచి మళ్లీ యాత్ర ప్రారంభిస్తా అని పేర్కొన్నారు. కూతురుకి…
Chandrayanagutta Flyover Launch Postponed: ఓల్డ్ సిటీ లో మంత్రి KTR పర్యటన రద్దు చేశారు అధికారులు. చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ప్రారంభం వాయిదా వేసుకున్న KTR స్వయంగా వాయిదా వేశారు. బీజేపీ నేతల అరెస్ట్ , ఆందోళనల నేపథ్యంలో చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ఓపెనింగ్ ను అధికారులు వాయిదా వేసారు. బీజేపీ నేతలు అడ్డుకుంట్టారన్న సమాచారంతో చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ప్రారంభం ఆగస్టు 27న ప్రారంభించనున్నట్లు సమాచారం. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద నిర్మించిన…
కేసీఆర్ రైతు వ్యతిరేకి అనడం పైన అమిత్ షా పై కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి అమిత్ షా కెసిఆర్ గారిని రైతు వ్యతిరేకి అనడం ఈ శతాబ్దపు జోక్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఒకవైపు కేసీఆర్ ఆలోచన విధానాల నుంచి రూపొందిన రైతుబంధు వంటి కార్యక్రమాలను మక్కీకి మక్కీగా కాపీ కొట్టి పీఎం కిసాన్ గా పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం ఎవరిది అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ…