ఇజ్రాయిల్ లెబనాన్పై విరుచుకుపడుతోంది. హిజ్బుల్లా మిలింటెట్లు , వారి స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. గత వారం నుంచి వైమానిక దాడులతో హిజ్బుల్లాపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే దక్షిణ లెబనాన్లోని 2000కు పైగా హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. కాగా.. గురువారం లెబనాన్ రాజధాని బీరుట్ శివార్లలోని అపార్ట్మెంట్పై వైమానిక దాడిలో హిజ్బుల్లా డ్రోన్ కమాండర్ మొహమ్మద్ హుస్సేన్ సురూర్ ను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
ఆదివారం ఇరాన్లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 51 మంది మృతి చెందారు. అంతేకాకుండా.. 20 మంది గాయపడ్డారు. గత కొన్నేళ్లుగా దేశంలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఇదొకటి అని ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఇరాన్లోని దక్షిణ ఖొరాసన్ ప్రావిన్స్లో ఈ పేలుడు సంభవించింది.
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుగురు పాక్ సైనికులు మరణించారు. రాత్రి అకస్మాత్తుగా జరిగిన ఈ ఉగ్రదాడిలో దాదాపు 11 మంది సైనికులు గాయపడినట్లు సమాచారం. ఈ దాడుల్లో 12 మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఈ దాడికి పాల్పడింది.
అనుమానం పిచ్చితో భార్యను హత్య చేసిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. భర్త నర్సింహులు గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో గ్యాస్ డెలివరి బాయ్ గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం చిట్కుల్ గ్రామనికి చెందిన ఇందిరతో నర్సింహులుకి వివాహం అయింది. అయితే.. 13 ఏళ్లుగా సాఫీగా సాగుతున్న జీవితంలో అనుమానం అనే ఓ దెయ్యం వచ్చి ఓ నిండు జీవితాన్ని బలి తీసుకుంది. హైదరాబాద్లో భార్యను హత్య చేసి మృతదేహాన్ని స్వస్థలం ఆందోల్ కి తీసుకువచ్చాడు నిందితుడు.…
కోవర్టు అనే అనుమానంతో నక్సలైట్లు తమ సహచరురాలిని హత్య చేశారు. మావోయిస్టులు మెడికల్ స్టూడెంట్ రాధను హతమార్చారు. రాధా అలియాస్ నీల్సో ఆరేళ్ల క్రితం మావోయిస్టు పార్టీలో చేరింది. పోలీసులకు కోవర్టు మారిందని సమాచారంతో మరణశిక్ష మావోయిస్టు పార్టీ విధించింది.
రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో ఆదివారం అర్థరాత్రి డజను జింకలను వేటగాళ్లు చంపేశారు. ఈ ఘటనపై సోమవారం సీనియర్ అటవీ అధికారులు, పోలీసులకు సమాచారం అందించామని చోహ్తాన్ సర్కిల్ ఆఫీసర్ కృతికా యాదవ్ తెలిపారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. యువకుడు, యువతి మధ్య ప్రేమ వద్దని చెప్పినందుకు బాలిక తల్లిని హత్య చేశారు. ఈ ఘటనలో హత్యకు పాల్పడ్డ మైనర్ బాలిక.. మైనర్ అబ్బాయిని పోలీసులు అరెస్టు చేశారు.
Road Accident : దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గౌటెంగ్ ప్రావిన్స్లోని మెరాఫాంగ్ స్థానిక మునిసిపాలిటీలో బుధవారం ఉదయం మినీబస్సు, ట్రక్కు ఢీకొనడంతో 12 మంది విద్యార్థులతో సహా 13 మంది మరణించారు.
Kurnool: కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన బాలిక మృతదేహం కోసం గాలింపు కొనసాగుతుంది. వాసంతి అనే బాలిక 7వ తేదీ నుంచి అదృశ్యం అయింది. అన్ని ప్రాంతాల్లో వెతికినా దొరకని బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు.