Home
Kerala
Kerala News
-
Kerala: కేరళలో దృశ్యం సీన్ రిపీట్.. బీజేపీ కార్యకర్త శవాన్ని గోడలో పెట్టి ప్లాస్టరింగ్
BJP Worker Assassination In Kerala: కేరళ రాష్ట్రంలో సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’ మూవీ సీన్ రిపీట్ అయింది. దృశ్యం సినిమాలో ఓ శవాన్ని పోలీస్ స్టేషన్ లో ఫ్లోర్ కింద సమాధి చేయడం అందరికి గుర్తుండే ఉంటుంది. అయితే కేరళలో ఇలాంటి ఘటనే రిపీట్ అయింది. దృశ్యం మూవీని తలపించే విధంగా బీజేపీ కార్యకర్త మర్డర్ జరిగింది. ఇప్పుడు ఈ కేసు కేరళలో సంచలనంగా మారింది. బీజేపీ కార్యకర్తను దారుణంగా హత్య చేసి గోడలోపెట్టి… -
Pocso Court: మైనర్పై అత్యాచారం.. నిందితుడికి 142 ఏళ్ల జైలు శిక్ష
Kerala man sentenced to 142 years in jail for POCSO Case: మైనర్పై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తి కేరళలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కేరళలోని పత్తినాంతిట్టకు చెందిన 41 ఏళ్ల వ్యక్తికి ఈ శిక్షను విధించింది. పదేళ్ల మైనర్ పిల్లవాడిపై రెండేళ్ల పాటు లైంగిక వేధింపులకు పాల్పడినందుకు కోర్టు ఈ శిక్ష విధించింది. దీంతో పాటు రూ. 5 లక్షల జరిమానాను విధించింది.… -
Kerala: పీఎఫ్ఐ నుంచి ప్రమాదం..ఆర్ఎస్ఎస్ నేతలకు వై కేటగిరి భద్రత.
Y-category security for RSS leaders: రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్పైఐ) దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో దాడులు జరిగాయి. ఎన్ఐఏ, ఈడీలు సంయుక్తంగా దాడులు చేసి పీఎఫ్ఐ కీలక నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేసింది. వారివద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. దేశంలో మతపరమైన ఉద్రిక్తతలను పెంచడంతో పాటు ముస్లిం యువతను లష్కరే తోయిబా, ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రేరేపిస్తోందనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్, టర్కీ నుంచి… -
Kerala: అయ్యో ఇట్లయిపాయె.. పిల్లి కరిచిందని ఆస్పత్రికి పోతే.. కుక్క కరిచింది..
మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు అయింది ఓ మహిళ పరిస్థితి. పిల్లి కరిచిందని ఇంజెక్షను తీసుకునేందుకు ఓ మహిళ తండ్రితో కలిసి సామాజిక ఆరోగ్యకేంద్రానికి వెళితే.. తీరా అక్కడ వ్యాక్సిన్ తీసుకోలేదు సరికదా.. వీధికుక్క కరించింది. ఈ విచిత్ర ఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం సమీప విళింజమ్లో చోటుచేసుకుంది. -
Kerala High Court: ప్రసవ వేదన భరించేది స్త్రీనే.. గర్భం దాల్చడం ఆమె ఇష్టం…
Wife can terminate pregnancy without husband’s approval says kerala high court: కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాహిత మహిళలు గర్భం దాల్చడం ఆమె ఇష్టం అని హైకోర్టు పేర్కొంది. దీనికి భర్త అనుమతి అవసరం లేదని చెప్పింది. ప్రసవ సమయంలో ఒత్తడిని, ఆ బాధను అనుభవించేది స్త్రీనే అని కీలక వ్యాఖ్యలు చేసింది. గత గర్భాన్ని తొలగించాలని 21 ఏళ్ల మహిళ కేరళ హైకోర్టును అభ్యర్థించింది. దీనిపై కేరళ హైకోర్టులో సోమవారం… -
JP Nadda: కేరళ ఉగ్రవాదానికి హాట్ స్పాట్ గా మారింది.. మత ఘర్షణలు పెరిగాయి.
Kerala A Hot Spot of Terrorism says jp nadda: కేరళలో తీవ్రవాదం ఎక్కువ అయిందని.. ఉగ్రవాదానికి హాట్ స్పాట్ గా మారిందని.. ఇక్కడ జీవితం సురక్షితంగా లేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కేరళలో పర్యటిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబం కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని ఆరోపించారు. వామపక్షాలు కుటుంబ, రాజరిక పాలనలో పడిపోయాయని ఆరోపించారు. పినరయి విజయన్ కూతురు, అల్లుడు ప్రభుత్వ… -
kerala Hijab Protest: కేరళను తాకిన హిజాబ్ వివాదం..ముస్లిం సంఘాల ఆందోళన
kerala Hijab Protest: ఇప్పటికే కర్ణాటక వ్యాప్తంగా హిజాబ్ వివాదం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. విద్యాసంస్థల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని కర్ణాటక హైకోర్టు వ్యతిరేకించింది. ఇది ఇస్లాంతో తప్పని సరి సంప్రదాయం కాదని తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టులో ఉంది. ఇదిలా ఉంటే కేరళలో కూడా హిజాబ్ వివాదం చెలరేగింది. కేరళలోని కోజికోడ్ లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని హిజాబ్ ధరించినందుకు పాఠశాలలోకి ప్రవేశాన్ని నిరాకరించడంతో వివాదం చెలరేగింది. -
Kerala Lottery winner is in Trouble: కేరళ లాటరీ విజేతకు కొత్త కష్టాలు
Kerala Lottery winner is in Trouble: కేరళలో ప్రభుత్వం మెగా ఓనం లాటరీలో రూ. 25 కోట్లు గెలిచారు ఓ ఆటో డ్రైవర్. ఈ విషయం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఓ సాధారణ ఆటో డ్రైవర్ లాటరీలో ఇన్ని కోట్లు గెలవడం ప్రజల్ని ఆకర్షించింది. అయితే ఇప్పుడు లాటరీ విన్నర్ అనూప్ బాధపడుతున్నారు. నేను ఎందుకు లాటరీని గెలిచానని.. గెలవకుంటే బాగుండేదని భావిస్తున్నారు. నేను మనశ్శాంతిని కోల్పోయాను..ప్రస్తుతం నేను నా సొంత ఇంటిలో కూడా నివసించలేకపోతున్నానని… -
Kerala Bandh: కేరళ బంద్కు పిలుపునిచ్చిన పీఎఫ్ఐ.. పలు జిల్లాల్లో రాళ్లదాడులు
PFI called for Kerala bandh: గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై దాడులు చేసింది. ఉగ్రవాద, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాటు మనీలాండరింగ్ కు పాల్పడుతున్నారనే అభియోగాలపై ఎన్ఐఏ, ఈడీ అధికారులు దాడులు చేశారు. దాదాపుగా 100 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రాలకు సమాచారం లేకుండా పకడ్భందీగా కేంద్ర సంస్థలు ఆపరేషన్ చేశాయి. -
Lottery Tickets: లాటరీ టిక్కెట్ల కోసం రూ.3.5 కోట్లు ఖర్చు.. చివరకు ఎంత గెలిచాడో తెలిస్తే షాకవుతారు
Lottery Tickets: కేరళలో లాటరీలు కొంతమందికి కోట్ల రూపాయలు సంపాదించి పెడుతున్నాయి. ఇటీవల కేరళలో ఓ ఆటోడ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. అతడికి రూ.25 కోట్ల లాటరీ తగిలింది. అయితే అందరినీ అలాంటి అదృష్టం వరించదు. నాణేనికి బొమ్మ ఉన్నట్లే బొరుసు కూడా ఉంటుంది. నాణేనికి మరోవైపు పరిశీలిస్తే లాటరీ టిక్కెట్ల కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి కష్టాలు పడే వాళ్లు కూడా ఉన్నారు. కేరళలోనే మరో వ్యక్తి 52 ఏళ్లుగా లాటరీ టిక్కెట్లు…
తాజావార్తలు
-
MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
Indigo: టేకాఫ్ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
-
TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!