kerala Hijab Protest: కేరళను తాకిన హిజాబ్ వివాదం..ముస్లిం సంఘాల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
kerala Hijab Protest: ఇప్పటికే కర్ణాటక వ్యాప్తంగా హిజాబ్ వివాదం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. విద్యాసంస్థల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని కర్ణాటక హైకోర్టు వ్యతిరేకించింది. ఇది ఇస్లాంతో తప్పని సరి సంప్రదాయం కాదని తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టులో ఉంది. ఇదిలా ఉంటే కేరళలో కూడా హిజాబ్ వివాదం చెలరేగింది. కేరళలోని కోజికోడ్ లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని హిజాబ్ ధరించినందుకు పాఠశాలలోకి ప్రవేశాన్ని నిరాకరించడంతో వివాదం చెలరేగింది.
కోజికోడ్ లోని ప్రావిడెన్స్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని హిజాబ్ ధరించినందుకు తరగతులకు హాజరు నిరాకరించారని చెబుతూ ముస్లిం సంస్థలు, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ నిరసన కార్యక్రమాలను నిర్వహించింది. హిజాబ్ ధరించి రావద్దని చెప్పారని బాలిక తన తల్లిదండ్రులకు తెలియజేసిందని పాఠశాల అధికారులు తెలియజేశారు. కుటుంబ సభ్యులు జోక్యం చేసుకున్న యాజమాన్యం తీరు మార్చుకోకపోవడంతో విద్యార్థిని తన చదువును నిలిపివేసింది. రాజ్యంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న విద్యాలయ అనుమతులను విద్యాశాఖ తొలగించాలని ముస్లిం విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఈ విషయంలో భారీగా నిరసనలు తెలుపుతున్నారు. పాఠశాల ముందు కూర్చున్న జనాలను పోలీసులు చెదరగొట్టారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
Read Also: Rajastan Political Crisis: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో నామినేషన్ దాఖలుకు గెహ్లాట్ దూరం
ఓ వైపు ఇరాన్ దేశంలో మహిళలు హిజాబ్ వద్దంటూ నిరసనలు తెలుపుతున్న క్రమంలో కేరళలొో హిజాబ్ అంశం వెలుగులోకి వచ్చింది. ఇరాన్ లో మహ్సా అమిని అనే 22 ఏళ్ల అమ్మాయిని హిజాబ్ ధరించలేదని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత మహ్సా అమిని చనిపోయింది. దీంతో ఇరాన్ లోని యువత, మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. మహిళలు హిజాబ్ తీసేసి, జుట్టు కత్తిరించుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఇప్పటి వరకు ఇరాన్ ఘర్షణల్లో 50 మందికి పైగా ఆందోళనకారులు మరణించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..