kerala Hijab Protest: కేరళను తాకిన హిజాబ్ వివాదం..ముస్లిం సంఘాల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
kerala Hijab Protest: ఇప్పటికే కర్ణాటక వ్యాప్తంగా హిజాబ్ వివాదం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. విద్యాసంస్థల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని కర్ణాటక హైకోర్టు వ్యతిరేకించింది. ఇది ఇస్లాంతో తప్పని సరి సంప్రదాయం కాదని తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టులో ఉంది. ఇదిలా ఉంటే కేరళలో కూడా హిజాబ్ వివాదం చెలరేగింది. కేరళలోని కోజికోడ్ లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని హిజాబ్ ధరించినందుకు పాఠశాలలోకి ప్రవేశాన్ని నిరాకరించడంతో వివాదం చెలరేగింది.
కోజికోడ్ లోని ప్రావిడెన్స్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని హిజాబ్ ధరించినందుకు తరగతులకు హాజరు నిరాకరించారని చెబుతూ ముస్లిం సంస్థలు, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ నిరసన కార్యక్రమాలను నిర్వహించింది. హిజాబ్ ధరించి రావద్దని చెప్పారని బాలిక తన తల్లిదండ్రులకు తెలియజేసిందని పాఠశాల అధికారులు తెలియజేశారు. కుటుంబ సభ్యులు జోక్యం చేసుకున్న యాజమాన్యం తీరు మార్చుకోకపోవడంతో విద్యార్థిని తన చదువును నిలిపివేసింది. రాజ్యంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న విద్యాలయ అనుమతులను విద్యాశాఖ తొలగించాలని ముస్లిం విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఈ విషయంలో భారీగా నిరసనలు తెలుపుతున్నారు. పాఠశాల ముందు కూర్చున్న జనాలను పోలీసులు చెదరగొట్టారు.
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
Read Also: Rajastan Political Crisis: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో నామినేషన్ దాఖలుకు గెహ్లాట్ దూరం
ఓ వైపు ఇరాన్ దేశంలో మహిళలు హిజాబ్ వద్దంటూ నిరసనలు తెలుపుతున్న క్రమంలో కేరళలొో హిజాబ్ అంశం వెలుగులోకి వచ్చింది. ఇరాన్ లో మహ్సా అమిని అనే 22 ఏళ్ల అమ్మాయిని హిజాబ్ ధరించలేదని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత మహ్సా అమిని చనిపోయింది. దీంతో ఇరాన్ లోని యువత, మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. మహిళలు హిజాబ్ తీసేసి, జుట్టు కత్తిరించుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఇప్పటి వరకు ఇరాన్ ఘర్షణల్లో 50 మందికి పైగా ఆందోళనకారులు మరణించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!