Kerala Bandh: కేరళ బంద్కు పిలుపునిచ్చిన పీఎఫ్ఐ.. పలు జిల్లాల్లో రాళ్లదాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PFI called for Kerala bandh: గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై దాడులు చేసింది. ఉగ్రవాద, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాటు మనీలాండరింగ్ కు పాల్పడుతున్నారనే అభియోగాలపై ఎన్ఐఏ, ఈడీ అధికారులు దాడులు చేశారు. దాదాపుగా 100 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రాలకు సమాచారం లేకుండా పకడ్భందీగా కేంద్ర సంస్థలు ఆపరేషన్ చేశాయి.
ఈ అరెస్టులపై పీఎఫ్ఐ పాటు కొంతమంది ముస్లింలు ఈ దాడులను ఖండించారు. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో అరెస్టులకు వ్యతిరేకంగా గురువారం ఆందోళనలు నిర్వహించారు. అరెస్టులకు వ్యతిరేకంగా పీఎఫ్ఐ శుక్రవారం కేరళ బంద్ కు పిలుపునిచ్చింది. ఆ సంస్థకు చెందిన అగ్రనేతలను అరెస్ట్ చేయడం పట్ల ఆందోళన కార్యక్రమాలు, హర్తాళ్ చేపట్టారు. గురువారం ఎన్ఐఏ జరిపిన దాడుల్లో కేరళ రాష్ట్రానికి చెందిన 22 మంది ఫీఎఫ్ఐ నేతలను అరెస్ట్ చేశారు. కొన్ని చోట్ల హర్తాళ్ ఉద్రిక్తతలను పెంచింది. తిరువనంతపురం, కొల్లం, కోజికోడ్, వాయనాడ్, అలప్పుజా జిల్లాల్లో ప్రభుత్వ బస్సులపై రాళ్లతో దాడులు చేశారు. ఇద్దరు సివిల్ పోలీసు అధికారులను పిఎఫ్ఐ ఆందోళనకారులు కిందకు నెట్టారు.
Also Read
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
REad ALSO: Bus Accident in Nepal: నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు బోల్తా.. 12మంది మృతి
పీఎఫ్ఐ బంద్ నేపథ్యంలో అప్రమత్తం అయిన కేరళ రాష్ట్రపోలీసులు అన్ని జిల్లాల్లో కూడా భారీగా భద్రతను పెంచారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేఎస్ఆర్టీసీ యథావిధిగా నడుస్తుందని కేరళ ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పీఎఫ్ఐ నిరసనలకు పిలునిచ్చిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లో భద్రతను పెంచారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో ఎన్ఐఏ పని చేస్తుందని పీఎఫ్ఐ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నిన్న అరెస్ట్ అయిన వారిలో పీఎఫ్ఐ జాతీయ చైర్మన్ ఓఎంఏ సలాం, జాతీయ కార్యదర్శి నసరుద్దీన ఎలమరం, కేరళ అధ్యక్షుడు సీపీ మహ్మద్ బషీర్ ఉన్నారు.
Kochi, Kerala | A KSRTC bus was vandalised allegedly by people supporting the one-day bandh called by PFI today, in Companypadi near Aluva pic.twitter.com/XZqhiAxTDL
— ANI (@ANI) September 23, 2022
తాజావార్తలు
-
Earthquake Threat: భారత్కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
-
Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
-
Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
-
Dhurandhar 2: ఓటీటీలోకి వచ్చినా తగ్గని జోరు.. 100 రోజుల థియేటర్ రన్తో మరో రికార్డు?
-
Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!