Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రకు నేడు విరామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్గాంధీ పాదయాత్ర చేపట్టారు. వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ యాత్రలో రాహుల్గాంధీ స్వల్ప విరామం తీసుకున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన ఒకరోజు విరామం తర్వాత శుక్రవారం కేరళలోని కొల్లాం నుండి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.బుధవారం నాడు ట్విట్టర్లో కాంగ్రెస్ నేత జైరాం పాదయాత్ర శుక్రవారం నుంచి పున:ప్రారంభమవుతుందని తెలిపారు.కేరళలోని తిరువనంతపురంలోని నవైక్కుళం నుంచి ప్రారంభమైన యాత్ర బుధవారంతో ఏడో రోజు పూర్తి చేసుకుంది.
ఏడో రోజు రాహుల్ గాంధీ కొల్లాం జిల్లా చత్తన్నూరులో విద్యార్థులతో ముచ్చటించారు.
Supreme Court: హిజాబ్పై నిషేధంతో కర్ణాటకలో ఎంత మంది చదువు మానేశారు?
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
నవైక్కుళం నుంచి పాదయాత్ర ప్రారంభించే ముందు రాహుల్ గాంధీ కేరళలోని శివగిరి మఠంలో సంఘ సంస్కర్త శ్రీనారాయణ గురువుకు నివాళులర్పించారు. యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. తదుపరి 17 రోజుల పాటు రాష్ట్రం గుండా ప్రయాణిస్తుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల పాదయాత్ర 150 రోజుల్లో పూర్తవుతుంది. 12 రాష్ట్రాలను కవర్ చేస్తుంది. కేరళ నుంచి యాత్ర తదుపరి 18 రోజుల పాటు రాష్ట్రం గుండా ప్రయాణించి, సెప్టెంబర్ 30న కర్ణాటకకు చేరుకుంటుంది. ఇది ఉత్తరాన కదలడానికి ముందు 21 రోజుల పాటు కర్ణాటకలో ఉంటుంది. ఈ పాదయాత్రలో ప్రతిరోజు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు. మతం, వర్గాలకు అతీతంగా భారతీయులను ఏకతాటిపైకి తీసుకురావడమే భారత్ జోడో యాత్ర స్ఫూర్తి అని, ఇది ఒకటే దేశమని, మనం కలిసికట్టుగా ఉండి పరస్పరం గౌరవంగా ఉంటేనే విజయవంతమవుతుందని రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!