Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రకు నేడు విరామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్గాంధీ పాదయాత్ర చేపట్టారు. వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ యాత్రలో రాహుల్గాంధీ స్వల్ప విరామం తీసుకున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన ఒకరోజు విరామం తర్వాత శుక్రవారం కేరళలోని కొల్లాం నుండి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.బుధవారం నాడు ట్విట్టర్లో కాంగ్రెస్ నేత జైరాం పాదయాత్ర శుక్రవారం నుంచి పున:ప్రారంభమవుతుందని తెలిపారు.కేరళలోని తిరువనంతపురంలోని నవైక్కుళం నుంచి ప్రారంభమైన యాత్ర బుధవారంతో ఏడో రోజు పూర్తి చేసుకుంది.
ఏడో రోజు రాహుల్ గాంధీ కొల్లాం జిల్లా చత్తన్నూరులో విద్యార్థులతో ముచ్చటించారు.
Supreme Court: హిజాబ్పై నిషేధంతో కర్ణాటకలో ఎంత మంది చదువు మానేశారు?
Also Read
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
నవైక్కుళం నుంచి పాదయాత్ర ప్రారంభించే ముందు రాహుల్ గాంధీ కేరళలోని శివగిరి మఠంలో సంఘ సంస్కర్త శ్రీనారాయణ గురువుకు నివాళులర్పించారు. యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. తదుపరి 17 రోజుల పాటు రాష్ట్రం గుండా ప్రయాణిస్తుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల పాదయాత్ర 150 రోజుల్లో పూర్తవుతుంది. 12 రాష్ట్రాలను కవర్ చేస్తుంది. కేరళ నుంచి యాత్ర తదుపరి 18 రోజుల పాటు రాష్ట్రం గుండా ప్రయాణించి, సెప్టెంబర్ 30న కర్ణాటకకు చేరుకుంటుంది. ఇది ఉత్తరాన కదలడానికి ముందు 21 రోజుల పాటు కర్ణాటకలో ఉంటుంది. ఈ పాదయాత్రలో ప్రతిరోజు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు. మతం, వర్గాలకు అతీతంగా భారతీయులను ఏకతాటిపైకి తీసుకురావడమే భారత్ జోడో యాత్ర స్ఫూర్తి అని, ఇది ఒకటే దేశమని, మనం కలిసికట్టుగా ఉండి పరస్పరం గౌరవంగా ఉంటేనే విజయవంతమవుతుందని రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు.
తాజావార్తలు
-
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
-
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
-
AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
-
The Paradise: సెకండ్ సింగిల్.. “యేష నాగుల” లైవ్గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్తో అదరగొట్టిన నాని.!
-
Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్రౌండర్కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!