Rogue elephant Arikomban captured: కేరళలోని ఇడుక్కి జిల్లా ప్రజలను నానాకష్టాలు పెడుతున్న ఏనుగు ‘అరికొంబన్’ ఎట్టకేలకు చిక్కింది. అధికారులు ఎనుగును పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ విజయవంతం అయింది. ఏనుగును పెరియార్ టైగర్ రిజర్వ్ కు తరలించారు. నిన్న తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభం అయిన మిషన్ ఏనుగును గుర్తించలేకపోయింది. అయితే ఆదివారం మళ్లీ ఆపరేషన్ ప్రారంభించిన అధికారులు ఏనుగును గుర్తించారు.
The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్రమ మతమార్పిడులు, లవ్ జీహాద్, ఉగ్రవాదం కోణంగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమాపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ సీపీఎం పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీలు ఈ సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఇలాంటి సినిమాను నిర్మించారని దుయ్యబడుతున్నారు.
భారతదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు వారీ కేసులు వేలల్లోనే నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 7,171 కరనా ఇన్ఫెక్షన్లు నమోదు కాగా, క్రియాశీల కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, యాక్టివ్ కేసుల సంఖ్య 51,314కి తగ్గింది.
కేరళ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కలిశారు. కొచ్చిలో సోమవారం రాత్రి మోడీతో వ్యక్తిగతంగా 45 నిమిషాల పాటు చర్చించారు. చిన్నప్పటి నుంచి మోడీని చూస్తూ పెరిగానని తాజాగా ప్రధానిని కలిసినందుకు తన ఆనందానికి అవధులు లేవని ఉన్ని ముకుందన్ పేర్కొన్నాడు.
కేరళ తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు తిరువనంతపురం నుండి కాసరగోడ్ వరకు నడుస్తుంది. మంగళవారం ఉదయం తిరువనంతపురం చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం లభించింది. అనంతరం సెంట్రల్ రైల్వే స్టేషన్కు బయలుదేరారు. రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫారమ్ 1 నుండి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు.
కేరళలో తొలి వందే భారత్ రైలు ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు త్రివేండ్రం నుండి కాసరగోడ్ వరకు నడుస్తుంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళలోని కొచ్చిలో నిన్న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్షో నిర్వహించారు.
ప్రధాని నరేంద్రమోడీని హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందా? కేరళ బీజేపీకి వచ్చిన ఓ లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీపై దాడి జరుగుతుందని హెచ్చరిస్తూ కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్కు బెదిరింపు లేఖ వచ్చింది.
కేరళ వందేభారత్ ఎక్స్ప్రెస్ను ఇప్పుడు కాసరగోడ్ వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రకటించారు. తొలుత ఈ సర్వీసు కన్నూర్లో ముగియాల్సి ఉంది. కేంద్ర మంత్రి వి మురళీధరన్ అభ్యర్థన మేరకు సర్వీసు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
శబరిమల విమానాశ్రయానికి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ‘సైట్ క్లియరెన్స్’ మంజూరైంది. ఏప్రిల్ 3న జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Girl kidnapped Ex Boyfriend: ప్రేమకు కులం, గోత్రం, ప్రాంతం, ఆస్తులు.. ఇలా ఏవీ అడ్డుకాదంటారు.. అయితే, ప్రస్తుతం ప్రేమలు ఎన్నిరోజులు కొనసాగుతాయో కూడా చెప్పడం కష్టంగా మారిపోయింది.. ఒకరికి బ్రేకప్ చెప్పి.. మరొకరితో చెట్టాపట్టాల్ వేసుకుతిరుగుతున్నారు.. అంతే కాదు.. విడిపోయిన తర్వాత కూడా కిడ్నాప్లు, చిత్రహింసలకు గురిచేయడం లాంటి ఘటనలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.. కేరళలో తాజాగా ఓ సంచనల కేసు వెలుగు చూసింది.. మొదటి లవర్ బ్రేకప్ కు ఒప్పుకొలేదని రెండో లవర్తో కలిసి…