Pawan Kalyan: కేరళ బోటు ప్రమాదం విచారకరం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: కేరళలో జరిగిన బోటు ప్రమాదం విచారం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా తువల్ తీరం బీచ్ సమీపంలో హౌస్ బోట్ బోల్తా పడ్డ దుర్ఘటనలో 22 మంది దుర్మరణం పాలవడం విచారం కలిగించిందంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.. విహార యాత్రకు వచ్చి ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా చనిపోవడం దిగ్భ్రాంతికరమని పేర్కొన్నారు.. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉండటం అత్యంత విషాదకరమన్న ఆయన.. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చెందిన కేరళలో ఇటువంటి ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరం.. ఈ ప్రమాదాన్ని ప్రతి రాష్ట్ర పర్యాటక శాఖ ఒక పాఠంగా తీసుకోవాలన్నారు.. ఇక, పాపికొండలు పర్యాటక బోటు ప్రమాద ఘటనను ఎవరం మరచిపోలేమన్నారు.. ప్రధానంగా జల విహారానికి సంబంధించిన ప్రాంతాల్లో నిబంధనలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని సూచించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
కాగా, కేరళలోని మలప్పురం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఘోర పడవ ప్రమాద దుర్ఘటనలో 22 మంది మృతిచెందారు.. వీరిలో 11 మంది ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు.. తనూర్ ప్రాంతంలోని తువల్తీరం బీచ్ సమీపంలో ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఓ హౌస్బోట్ బోల్తాపడిన విషయం తెలిసిందే. టికెట్ల పరంగా చూసుకుంటే.. ప్రమాద సమయంలో 30 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే చాలా మంది టికెట్ లేకుండానే పడవ ఎక్కినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో మొత్తం ఎంతమంది ప్రమాదం బారిన పడ్డారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటివరకు 22 మంది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మరోవైపు ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించిన విషయం విదితమే.
Also Read
- Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
- Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
తాజావార్తలు
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్బుక్ CX15 భారత్లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!