Boat Accident: విషాదం.. బీచ్ వద్ద పడవ బోల్తా.. 21 మంది దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boat Accident: పర్యాటకుల బృందంతో వెళ్తున్న పడవ మునిగిపోవడం వల్ల 21 మంది మరణించారు. ఈ విషాద ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళలోని మలప్పురం జిల్లా తానూర్ ప్రాంతంలోని తువల్తిరం బీచ్ సమీపంలో ఆదివారం సాయంత్రం 30 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న హౌస్బోట్ బోల్తా పడి మునిగిపోవడంతో మహిళలు, పిల్లలతో సహా కనీసం 21 మంది మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. వివిధ ఆసుపత్రుల నుంచి వచ్చిన సమాచారం మేరకు నీటిలో నుంచి బయటకు తీసిన వారిని, పడవలోపల చేర్చిన వారి సమాచారం మేరకు 21 మంది మరణించినట్లు నిర్ధారించినట్లు క్రీడా మంత్రి వి.అబ్దురహిమాన్ తెలిపారు.
పాఠశాలలకు సెలవులు కొనసాగుతుండగా.. చాలా మంది మహిళలు, పిల్లలు జాలీ ట్రిప్ కోసం వచ్చారని అబ్దురహిమాన్ తెలిపారు. “మరింత మంది బాధితులు పడవ కింద చిక్కుకున్నారని, వారిని బయటకు తీసుకురావాలని భావిస్తున్నారు. పడవ బోల్తా పడింది. దానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు దీనిపై విచారణ జరుపుతారు” అని ఆయన విలేకరులతో అన్నారు. పడవ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి తగిన ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్.. ఆరోగ్య శాఖ డైరెక్టర్ను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.
Also Read
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
Pained by the loss of lives due to the boat mishap in Malappuram, Kerala. Condolences to the bereaved families. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be provided to the next of kin of each deceased: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 7, 2023
Read Also: Chhattisgarh Blast : మందుపాతర పేలుళ్లకు కారణమైన నలుగురు అరెస్ట్.. అందులో ముగ్గురు మైనర్లే
ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రాణనష్టానికి సంతాపం తెలిపారు. మలప్పురం జిల్లా కలెక్టర్ను సమన్వయంతో అత్యవసర రెస్క్యూ ఆపరేషన్ను నిర్వహించాలని ఆదేశించారు. అగ్నిమాపక, పోలీసు విభాగాలు, రెవెన్యూ, ఆరోగ్య శాఖల అధికారులు, జిల్లాలోని తానూర్, తిరూర్ ప్రాంతాలకు చెందిన స్థానికులు సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారని ప్రకటనలో తెలిపారు. సహాయక చర్యలను మంత్రులు అబ్దురహిమాన్, రియాస్ సమన్వయం చేస్తారని కూడా పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.నీటిలో నుంచి బయటకు తీసిన వారిని సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ప్రస్తుతం తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
Deeply saddened by the tragic loss of lives in the Tanur boat accident in Malappuram. Have directed the District administration to effectively coordinate rescue operations, which are being overseen by Cabinet Ministers. Heartfelt condolences to the grieving families & friends.
— Pinarayi Vijayan (@pinarayivijayan) May 7, 2023
తాజావార్తలు
-
Ram Charan: నీకో దండం బుచ్చి.. నన్ను బాగా టార్చర్ చేశావ్!
-
Apple: ఆపిల్ వాచ్ & ఎయిర్పాడ్స్ ప్రోలో.. కొత్త ఆరోగ్య ఫీచర్లు వచ్చేశాయ్!
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!