The Kerala Story: “ది కేరళ స్టోరీ” సినిమా ఆపడానికి సుప్రీం నిరాకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Kerala Story: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ‘ది కేరళ స్టోరీ’ సినిమా సంచలనంగా మారుతోంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంకా చేస్తున్నారు. శుక్రవారం రోజున హిందీ, తెలుగు, తమిళ్, మళయాళం భాషల్లో సినిమా విడుదల కాబోతోంది. కేరళలో హిందూ, క్రిస్టియన్ మతాలకు చెందిన 32 వేల మంది అమ్మాయిలు ఇస్లాంలోకి పథకం ప్రకారం మార్చబడ్డారని, ఇందులో కొందరు ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో పనిచేయడానికి వెళ్లారనే ఇతివృత్తం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమాను కేరళ సీఎం పినరయి విజయన్ తో పాటు అక్కడి కాంగ్రెస్ పార్టీ కూడా ఆక్షేపిస్తోంది. సినిమా విడుదల నిలిపివేయాలని, సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Dog Attack: వీధి కుక్కల దాడిలో 12 ఏళ్ల బాలుడు మృతి
Also Read
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
అయితే ఈ సినిమాపై స్టే విధించాలని కోరతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ను 1.60 కోట్ల మంది వీక్షించినట్లు కపిల్ సిబల్, మరో న్యాయవాది నిజాం పాషా మంగళవారం జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సినిమా హిందూ, ముస్లింల మధ్య విభజన తెచ్చే విధంగా ఉందని, విద్వేషాలను వ్యాపిస్తుందని ధర్మాసనం ముందు తమ వాదనలు వినిపించారు. ఈ సినిమా ఘోరమైన ద్వేషపూరిత ప్రసంగాల ప్రచారమని న్యాయవాది నిజాం పాషా పేర్కొన్నారు. అయితే ద్వేషపూరిత ప్రసంగాల్లో పలు రకాలు ఉంటాయి, ఈ సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిందని, కాబట్టి దీన్ని వ్యతిగత ప్రసంగం కింద పరిగణించలేని, ఒక వేళ మీరు సినిమా విడుదలను సవాల్ చేయాలనుకుంటే తగిని వేదికి మీద సెన్సార్ సర్టిఫికేట్ ను సవాల్ చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాదులకు సూచించింది.
పిటిషన్లు ముందుగా హైకోర్టున ఆశ్రయించాలని జస్టిస్ నాగరత్న అన్నారు. శుక్రవారం సినిమా విడుదల కానుండటంతో సమయం లేదని నిజాంపాషా ధర్మాసనం ముందు పేర్కొన్నారు. ఇది మైదానం కాదని, లేకపోతే అందరూ సుప్రీంకోర్టుకు రావడం ప్రారంభిస్తారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మత మార్పుడి నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. దీనిపై కేరళ సీఎం విజయన్ దీన్ని బీజేపీ ప్రాపగండా ఎజెండాగా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
-
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!