The Kerala Story: “ది కేరళ స్టోరీ” సినిమా ఆపడానికి సుప్రీం నిరాకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Kerala Story: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ‘ది కేరళ స్టోరీ’ సినిమా సంచలనంగా మారుతోంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంకా చేస్తున్నారు. శుక్రవారం రోజున హిందీ, తెలుగు, తమిళ్, మళయాళం భాషల్లో సినిమా విడుదల కాబోతోంది. కేరళలో హిందూ, క్రిస్టియన్ మతాలకు చెందిన 32 వేల మంది అమ్మాయిలు ఇస్లాంలోకి పథకం ప్రకారం మార్చబడ్డారని, ఇందులో కొందరు ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో పనిచేయడానికి వెళ్లారనే ఇతివృత్తం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమాను కేరళ సీఎం పినరయి విజయన్ తో పాటు అక్కడి కాంగ్రెస్ పార్టీ కూడా ఆక్షేపిస్తోంది. సినిమా విడుదల నిలిపివేయాలని, సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Dog Attack: వీధి కుక్కల దాడిలో 12 ఏళ్ల బాలుడు మృతి
Also Read
- Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
- Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
- PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
అయితే ఈ సినిమాపై స్టే విధించాలని కోరతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ను 1.60 కోట్ల మంది వీక్షించినట్లు కపిల్ సిబల్, మరో న్యాయవాది నిజాం పాషా మంగళవారం జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సినిమా హిందూ, ముస్లింల మధ్య విభజన తెచ్చే విధంగా ఉందని, విద్వేషాలను వ్యాపిస్తుందని ధర్మాసనం ముందు తమ వాదనలు వినిపించారు. ఈ సినిమా ఘోరమైన ద్వేషపూరిత ప్రసంగాల ప్రచారమని న్యాయవాది నిజాం పాషా పేర్కొన్నారు. అయితే ద్వేషపూరిత ప్రసంగాల్లో పలు రకాలు ఉంటాయి, ఈ సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిందని, కాబట్టి దీన్ని వ్యతిగత ప్రసంగం కింద పరిగణించలేని, ఒక వేళ మీరు సినిమా విడుదలను సవాల్ చేయాలనుకుంటే తగిని వేదికి మీద సెన్సార్ సర్టిఫికేట్ ను సవాల్ చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాదులకు సూచించింది.
పిటిషన్లు ముందుగా హైకోర్టున ఆశ్రయించాలని జస్టిస్ నాగరత్న అన్నారు. శుక్రవారం సినిమా విడుదల కానుండటంతో సమయం లేదని నిజాంపాషా ధర్మాసనం ముందు పేర్కొన్నారు. ఇది మైదానం కాదని, లేకపోతే అందరూ సుప్రీంకోర్టుకు రావడం ప్రారంభిస్తారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మత మార్పుడి నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. దీనిపై కేరళ సీఎం విజయన్ దీన్ని బీజేపీ ప్రాపగండా ఎజెండాగా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
-
ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
-
Kris Srikanth: తిలక్ వర్మది పెద్ద స్వార్థం.. అతడి కోసం మాత్రమే మ్యాచ్ ఆడాడు.. సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!