బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్పై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం తొలిసారి స్పందించారు. కవిత అరెస్ట్ ముమ్మాటికి అక్రమమేనన్నారు. లిక్కర్ స్కామ్ పాలసీ కుంభకోణంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని విమర్శలు గుప్పించారు.
104 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మన ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు.. అలాంటిది 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కాంగ్రెస్ సర్కార్ ను బీజేపీ వాళ్లు బతకానిస్తారా అని కేసీఆర్ ప్రశ్నించారు.
BRS Meeting: నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫారాలు అందజేయనున్నారు.
సంగారెడ్డిలో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాధ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదులను కూల్చేస్తామన్నారు.
ప్రస్తుతం భారతదేశంలో జరగబోయే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ నియమావళి నడుస్తోంది. ఇందులో భాగంగా అనేక ఆంక్షలు నడుమ రాజకీయ నాయకులు వారి ఎలక్షన్ క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నారు. ఓవైపు అధికారులు ఎన్నికల నియమాలను గుర్తుచేస్తున్న గాని మరోవైపు రాజకీయ నాయకులు ఒక్కోసారి వాటిని అతిక్రమించి ఎలక్షన్ కమిటీ చేత నోటీసులను ఇప్పించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు…
రేవంత్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేటట్టు లేదు అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ భయంతో నారాయణాపేట సభలో భయంతో మాట్లాడుతున్నారు.. ఎప్పుడు ఆయన బీజేపీతో కలుస్తాడో తెలియదు అని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. మహబూబాబాద్లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్లమెంట్ ఇంచార్జ్ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది. ఇక నాల్గో విడత జరిగే ఎన్నికలకు ఈనెల 19న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
అధికార పార్టీ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ఎత్తుగడలు చేస్తోంది అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారు.. ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు.. కేసీఆర్, కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.