ఢిల్లీ పర్యటన కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిన్న సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్ళిన విషయం తెలిసిందే. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక పరిణామంలో కేసీఆర్ సోమవారం సాయంత్రం న్యూఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. భారత రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలుసుకోవడమే కాకుండా, ఆయన కొందరు ప్రతిపక్ష నేతలను కలిసే అవకాశం ఉంది. ఆయన టిఆర్ఎస్ ఎంపీలతో సమావేశమై పాలు, పాల ఉత్పత్తులు,…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరోసారి హస్తినబాట పట్టారు.. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయల్దేరిన ఆయన.. రెండు మూడు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు.. గత కొన్ని రోజుల పాటు రాష్ట్రంలోని సమస్యలు, వర్షాలు, వరదలు, సంక్షేమ పథకాలపై దృష్టిసారించిన కేసీఆర్.. మరోసారి జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.. అందులో భాగంగా రెండు మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్న గులాబీ పార్టీ బాస్.. జాతీయ స్థాయిలో వివిధ కీలక నేతలతో భేటీ…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సైతం ఇప్పటికే ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇటీవలె వరద బాధితుల్ని పరామర్శించారు ఆమె. ఆదివాసీ మహిళ అత్యున్నత పీఠం అధిరోహించడం చారిత్రాత్మకం అంటూ ప్రసంశించారు. నామినేషన్ రోజు వరదల కారణంగా ఢిల్లీ వెళ్లలేకపోయా అంటూ తెలిపారు. వరదలు వచ్చాయి కాబట్టే ప్రభావిత ప్రాంతాల్లో తిరగానని అన్నారు. రాష్ట్రానికి ప్రథమ పౌరురాలిని కాబట్టే ప్రజల దగ్గరికి వెళ్లానని అన్నారు. అందుకే ఆదివాసీలు ఉన్న భద్రాచలం ఏరియాకు వెళ్లా అంటూ గవర్నర్ తెలిపారు. వర్షాలపై కేంద్ర హోంశాఖకు…
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వారు చాలామంది టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు ఈటెల రాజేందర్. మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ జెండా ఎగురవేసి జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేతలు ఈటల కు ఖడ్గం బహూకరించారు. పలువురికి ఈటల రాజేందర్ కాషాయ జెండా కప్పి బీజేపీ లోకి స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ ప్రజనికానికి శుభదినమన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఒక…
తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు, పింఛనుదారులకు పింఛన్లు ప్రతి నెల 1వ తేదీన చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 300(ఏ) చట్టం.. సకాలంలో ఉద్యోగులు, పింఛనుదారులు వేతనం పొందే ప్రాథమిక హక్కుని కల్పించిందని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులకు తెలంగాణప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం…
కేసీఆర్ ట్రాప్ లో పడను.. టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేసారు. రాజీనామా తోనే నియోజక వర్గ అభివృద్ధి జరుగుతుంది అంటే… దళిత బందు ఇచ్చినప్పుడే.. రాజీనామా చేస్తా అని ప్రకటించారు. నన్ను గెలిపించిన ప్రజల కోసం అసెంబ్లీ లో ఎన్నో సార్లు మాట్లాడిన అంటూ గుర్తు చేసారు. కెసిఆర్ అప్పాయింట్ మెంట్ ఇవ్వకపోయినా, అసెంబ్లీ లో కలిశా అంటూ పేర్కొన్నారు. శివన్న గూడెం ప్రాజెక్టు ముంపు రైతులకు…
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్ చేసారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్ట్ లు, చెరువులు, కుంటల్లో పరిస్థితిపై సీయం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా…
బీజేపీ జెండాను చూస్తేనే టీఆర్ఎస్ నేతలు గజగజ వణికిపోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతారను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కామారెడ్డి జిల్లాలో బీజేపీ శ్రేణులపై టీఆర్ఎస్ మూకలు బరి తెగించి దాడికి పాల్పడటం హేయనీయమని మండిపడ్డారు. జనం గోస- బీజేపీ భరోసా పేరుతో బైక్ ర్యాలీలతో గ్రామాల్లోకి వెళుతూ ప్రజాస్వామ్య బద్దంగా కార్యక్రమాలు…
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. వరద పరిస్థితులను పరిశీలించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. ఈనేపథ్యంలో.. నిన్న రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రైలులో కొత్తగూడెంకు బయల్దేరి వెళ్లారు గవర్నర్. అయితే.. అక్కడి నుంచి భద్రాచలంలో గోదావరి వరద కారణంగా జిల్లాలో ఉత్పన్నమైన పరిస్థితులను పరిశీలించడంతో పాటు వరద బాధితులతో గవర్నర్ మాట్లాడనున్నారు. అయితే.. భద్రాచలం టౌన్ తో పాటు చుట్ట పక్కల ముంపు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. గోదావరి…
ఆ నాయకుడు బీజేపీలో కొత్త సంప్రదాయానికి తెర లేపారా? వచ్చే ఎన్నికల్లో పలానా చోటు నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంలో ఆంతర్యం ఏంటి? అధిష్ఠానం చెప్పిందా.. లేక ఆయనే అడ్వాన్స్ అయ్యారా? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? బీజేపీలో ఎంతటి పెద్దవాళ్లయినా సరే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయిస్తుంది. ఆ అధికారం రాష్ట్ర పార్టీ చేతిలో కూడా ఉండదు. అందుకే ఈ విషయంలో బీజేపీ నేతలు ఎవరూ…