Kishan Reddy: హుజురాబాద్ రిజల్ట్స్.. మునుగోడులో రిపీట్ కాబోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ రేపు సభ పెట్టుకున్న, సభలో కూర్చీవేసుకుని కూర్చున్న భయపడేది లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. TRS సభ పెట్టుకోవడంలో అర్థం లేదని మండిపడ్డారు. వాళ్ల మీద, వాళ్ళ నేతల పైన విశ్వాసం లేకనే సభ పెట్టుకున్నారని ఎద్దేవ చేశారు. ఎన్నికల ముందు బీజేపీనీ బద్నాం చేయడం టీఆర్ఎస్ పార్టీ కి అలవాటే అని విమర్శించారు. 8 యేళ్ళుగా గారడీ మాటలతో తెలంగాణ ప్రజలను మభ్య పెట్టారని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ లాగా కుటుంబ పార్టీ కాదని, అవినీతి పార్టీ కాదని స్పష్టం చేశారు. కుర్చీ వేసుకుని కూర్చుంటానని చెప్పడం కేసీఆర్ కి అలవాటే అని విమర్శించారు. కేసీఆర్ కుర్చీ చెప్పిన దగ్గర కాకుండా ఫార్మ్ హౌస్ లో వేసుకుంటారని తెలిపారు.
రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామాతో ఇక్కడ అనేక అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్ కు మూడు అసెంబ్లీ లే కనిపిస్తాయని ఎద్దేవ చేశారు. గజ్వేల్ లో సీఎం కొడుకు, సిరిసిల్లలో ఆయన అల్లుడి హరీష్ రావు నియోజక వర్గాలే అని తీవ్రంగా విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నడిబొడ్డున అభివృద్ధి ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ అమరుల శవాల మీద కుర్చీలు వేసుకుని తెలంగాణను పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను బానిసలుగా చూస్తున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం మాత్రమే హీరోల మని వ్యవహరిస్తున్నారని ఎద్దేవ చేశారు. ఎమ్మేల్యే లను జీరో లు చేశారని మండిపడ్డారు. హుజూరబాద్.. మునుగోడులో రిపీట్ కాబోతుందని కిషన్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు చరమ గీతం పాడుతారని తీవ్ర విమర్శలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం పీడ, దరిద్రం పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
రేపు సాయంత్రం 3 గంటలకు మునుగోడులో సమర భేరి పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నామన్నా అన్నారు. కాంగ్రెస్ పార్టీ లో ఉన్న కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మునుగోడు అబివృద్ధికై రాజీనామా చేసి బీజేపీ లో చేరుతున్నాడని, కేంద్ర మంత్రి అభిత్ షా ఈ సభకు హాజరుకానున్నారని తెలిపారు. రేపు బీజేపీ బహిరంగ సభను ఆంక్షల పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. రేవు రాజగోపాల్ రెడ్డి అమిత షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ లాగా కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి తరలిచ్చే అలోచన లేదు, అలా చేయం ఒక్క ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బహిరంగ సభకు తరలి వచ్చి విజయం వంతం చేయాలని పిలుపు నిచ్చారు. మునుగోడు లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరు స్వచ్ఛందగా బహిరంగ సభకు తరలి రావాలని పిలుపు నిచ్చారు.
India Vs Zimbabwe: రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా.. మళ్లీ ఫీల్డింగ్కే కేఎల్ రాహుల్ మొగ్గు
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!