బాసర ట్రిపుల్ ఐటీలో గత మూడురోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేస్తుండటంపై గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్ స్పందించారు. ఆమె ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టీఎస్ సీఎంవో కు తమిళి సై ట్యాగ్ చేశారు. తల్లిదండ్రుల కలలు, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. వర్షంలోనూ తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులను చూసి తమిళిసై ఆవేదన చెందారు. తాను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.…
సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచినందుకు బీజేపీ నేతలు రాణి రుద్రమ్మ, దరువు ఎల్లన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగుడలో ఏర్పాటు చేసిన ‘అమరుల యాది’లో అనే సభలో కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా చేసిన స్కిట్ విషయంలో రాణి రుద్రమ్మ, ఎల్లన్నని హయత్ నగర్ పోలీస్లు ఈ రోజు అరెస్ట్ చేశారు. అలాగే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్కి బండి సంజయ్ కి…
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామంలోని గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరుతో అర్దరాత్రి పోలీసులు పేదల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. చిన్నా పెద్దా, మహిళలనే తేడా లేకుండా దౌర్జన్యం చేసి కాళ్లు చేతులు విరగ్గొట్టడం, తలలు పగలకొట్టడం దారుణమన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా నిర్వాసితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి సమస్యను నాన్చుతూ కాలయాపన చేయడం అన్యాయమని అన్నారు. ఉన్నట్లుండి…
తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలని తిరుపతి వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించానని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇవాళ (జూన్ 13న) ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి…
తెలంగాణ రాష్ట్ర సమితి పేరు త్వరలో భారత్ రాష్ట్రీయ సమితిగా మారనుంది. త్వరలో సీఎం కేసీఆర్ కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. దానికి భారత్ రాష్ట్రీయ సమితి అని పేరు పెట్టనున్నారు. దీనికి కారు గుర్తునే కొనసాగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ పేరు మార్పు, బైలాస్లో మార్పులపై విస్తృతస్థాయి సమావేశంలో చర్చించనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘంతో TRS ఇప్పటికే చర్చలు పూర్తి చేసింది. గులాబీ బాస్ ఆలోచనలు చూస్తుంటే TRS కాస్తా.. అతి త్వరలోనే BRSగా మారనుండటం…
సాధారణ కార్యకర్తగా, ఆర్ఎస్ఎస్ పిద్ధాంతాలను ఒంట బట్టించుకున్న డా.కె.లక్ష్మణ్ సుదీర్ఘకాలం బీజేపీ కోసం పనిచేశారు. గతంలో బీజేపీ తరఫున ముషీరాబాద్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేశారు. జాతీయ ఓబీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న లక్ష్మణ్ కు రాజ్యసభ పదవి దక్కింది. యూపీ నుంచి ఆయనకు బీజేపీ పెద్దల సభకు అవకాశం ఇచ్చింది. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. గతంలో జీవీఎల్ నరసింహారావుకి యూపీ నుంచి ఎంపీగా అవకాశం ఇచ్చింది బీజేపీ. తాజాగా…
రాష్ట్రంలో మహిళల పై ప్రతీరోజు ఎదో ఒక చోట అత్యాచారాలు, దాడులు జరుగుతూనేవున్నాయి. చిన్నపిల్లలు, వృద్దులు అని తేడా లేకుండా విచక్షణారహితంగా మహిళలపై నిత్యం దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని,ఇంతజరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తుందని .. BJP అధికార ప్రతినిధి పాల్వాయి రజిని కుమారి తెలిపారు. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసు నివేదిక ఇవ్వాలని గవర్నర్ ప్రభుత్వాన్ని, డీజీపీని కోరారు. కానీ ఇందుకు ప్రభుత్వం గాని…
తెలంగాణ రాష్ట్రంలో ఏం సాధించారని ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.. అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్టీవీ తో జరిగిన ఇంటర్వూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. ఇందులో భాగంగా కేవలం రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపి పార్టీకి పరోక్షంగా లబ్ధి చేకూర్చేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రతిపాదన చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది. పీకల్లోతు అప్పుల్లో రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంది. ధరల పెరుగుదలతో…
కెసిఆర్ కు పూర్తి స్వేచ్ఛ ఉంది.. ఆయన పార్టీ పెట్టుకోవచ్చు అని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యంగాస్త్రం వేశారు. ఉట్టికి ఎగరనేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు కెసిఆర్ పని ఉందని ఎద్దేవ చేశారు. ప్రత్యామ్నాయ శక్తి అంటే కుటుంబ పాలన, అవినీతి నా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందని మండిపడ్డారు. మోడీనీ ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని లక్ష్మణ్ అన్నారు. బంగారు తెలంగాణ చేశాడు.. ఇక బంగారు భారత దేశాన్ని…
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడుతున్నారని జీవన్రెడ్డి చెప్పారు. గుజరాత్ సీఎంగా పనిచేసిన మోదీ.. ప్రధాని అయ్యారు. తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్.. దేశానికి ప్రధానమంత్రి అయితే తప్పేంటని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ తమిళిసై రాజ్భవన్ను రాజకీయ భవన్గా మార్చారని విమర్శించారు. గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ఎక్కడా లేని సంప్రదాయాన్ని తమిళిసై ఇక్కడ తీసుకొస్తున్నారన్నారు. అది ప్రజాదర్బార్ కాదని, పొలిటకల్ దర్బార్ అని విమర్శించారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్…