కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా తరువాత కొత్త సీఎం ఎవరు అనే దానిపై నిన్నటి నుంచి కసరత్తులు జరుగుతున్నాయి. నిన్నటి రోజున బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షాలు పార్లమెంట్ ఆవరణలో భేటీ ఆయ్యి చర్చించారు. అధిష్టానం ముందుకు వచ్చిన పేర్లను పరిశీలించారు. అనంతరం సీఎం అభ్యర్థి ఎవరు అని నిర్ణయించే బాధ్యతను కేంద్ర మంత్రులైన ధర్మేంద్ర ప్రదాన్, కిషన్ రెడ్డిలకు అప్పగించింది కేంద్రం. కాసేపట్లో ఈ ఇద్దరి కేంద్ర మంత్రుల…
కర్నాటక ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయడంతో.. కొత్త సీఎం ఎంపికపై కసరత్తు ప్రారంభించింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం.. యడియూరప్ప వారసుడి ఎంపిక బాధ్యతలను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్రెడ్డికి అప్పగించారు.. సీఎం ఎంపిక ప్రక్రియ ఇంచార్జీలుగా ఇద్దరు కేంద్రమంత్రులను నియమించడంతో.. ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరారు.. ఇవాళ సాయంత్రం కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపనున్నారు ఇరువురు నేతలు.. సాయంత్రం 7 గంటలకు బీజేఎల్పీ సమావేశం కానుంది. ఇక, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించిపై…
రాజీనామా వ్యవహారంపై వస్తున్న వార్తలను ఖండిస్తూనే వచ్చిన కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప.. చివరకు రాజీనామా చేశారు.. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను కలిసిన ఆయన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అయితే, కొత్త సీఎంను ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని యడియూరప్పను కోరారు గవర్నర్.. ఇక, యడియూరప్ప వారసుడు ఎవరు? కర్ణాటక సీఎం పీఠంపై కూర్చోబోతున్న కొత్త వ్యక్తి ఎవరు అనేదానిపై బీజేపీ అధిష్టానం తీవ్రమైన కసరత్తు చేస్తోంది.. ఇదే సమయంలో.. యడియూరప్పకు బీజేపీ అధిష్టానం…
యడియురప్ప.. కర్నాటకలో బీజేపీకి బలమైన నాయకుడు..! లింగాయత్ వర్గానికి చెందిన యడియురప్ప.. బీజేపీలో కీలక నాయకుడిగా ఎదిగారు. పార్టీ నుంచి బయటికి వచ్చినా.. ఆయన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అలాంటి యడియురప్పకు జులై నెల అంటే టెన్షన్ పట్టుకుంటోంది. ఆయన రెండుసార్లు ఇదే నెలలో బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008లో యడియురప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ ఆ పదవిలో ఎక్కువ సమయం ఉండలేకపోయారు. మూడేళ్లకే ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంటే 2011…
కర్నాటక రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేయడంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. వయసు నియమావళి ప్రకారం బీజేపీ యడ్యూరప్పను తప్పించిందని బీజేపీ చెబుతున్నది. అధిష్టానం తనపై ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేదని, బీజేపీ నియమావళికి కట్టుబడి రాజీనామా చేసినట్టు అటు యడ్యూరప్ప కూడా పేర్కొన్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ఈ అంశాన్ని మరోలా చూస్తున్నాయి. ముఖ్యమంత్రిని బలవంతంగా తప్పించారని సెటైర్లు వేస్తున్నాయి. అవినీతి కారణంగానే ముఖ్యమంత్రిని తొలగించి చేతులు కడుక్కోవాలని కేంద్రం చూస్తున్నట్టు కాంగ్రెస్…
కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు అయిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆయన మాట్లాడారు. రెండేళ్లపాటు విజయవంతంగా ప్రభుత్వాన్ని నడిపినట్టు యడ్యూరప్ప ప్రకటించారు. పార్టీ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అన్నారు. పార్టీ నియమావళికి కట్టుబడి రాజీనామా చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కాసేపట్టో ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన గవర్నర్ను కలిసి రాజీనామాను అందజేస్తారు. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రిని మారుస్తారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.…
కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధానకారణమైన ముఖ్యమంత్రి యడ్డియూరప్ప ఆ పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీలో 75 ఏళ్లు నిండిన వారికి ముఖ్యమైన పదవుల్లో కొనసాగే అవకాశం లేదు. అయితే, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైన యడ్డియూరప్ప విషయంలో ఇప్పటికే రెండేళ్లు ఆగింది. రెండేళ్ల క్రితం మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో యడ్డియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. రెండేళ్ల కాలంలో పార్టీలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా తన రాజకీయ అనుభవంతో…
కర్ణాటకలో నాయక్వంలో మార్పు ఉండొచ్చని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనే విషయం ఇప్పటి వరకు స్పష్టంకాలేదు. అయితే, ముఖ్యమంత్రిని మారిస్తే ఇబ్బందులు వస్తాయని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కష్టం అవుతుందని కొందరివాదన. అటు అధిష్టానం కూడా యడ్డియూరప్పను మార్చేందుకు సాహసం చేయడంలేదు. కర్ణాటక తాజా రాజకీయాలపై బీజేసీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చడం పెద్ద సాహసమే అవుతుందని, రాష్ట్రంలో తొలిసారి బీజేపి…
ప్రస్తుతం దేశాన్ని పెగాసస్ స్పైవేర్ కుదిపేస్తున్నది. దేశంలోని 300 మందికి సంబందించిన ఫోన్లపై నిఘాను ఉంచారని, ఫోన్లను ట్యాపింగ్ చేశారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ కూలిపోవడానికి కూడా స్పైవేర్ కారణమని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి స్పందించారు. గత 10-15 ఏళ్లుగా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని, ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో ప్రభుత్వాలు, ఆదాయపన్ను శాఖ ప్రజల ఫోన్లను…