దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. దేశంలోని ప్రముఖులకు చెందిన ఫోన్ నెంబర్లు ఇప్పటికే హ్యాకింగ్కు గురైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా ఇప్పుడు మరో విషయం బయటకు వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఆ పార్టీలకు చెందిన నేతల ఫోన్ నెంబర్లపై కూడా నిఘా ఉంచినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి ఇది కూడా ఒక కారణం అనే అనుమానాలు…
దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా ఉదృతి ఇంకా కోనసాగుతూనే ఉన్నది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రతో పాటు అటు ఒడిశా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. కరోనా మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న సమయంలో ప్రధాని మోడీ ఈరోజు ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాల కల్పన, ఆక్సిజన్ కొరత…
అక్రమ సంతానం విషయంలో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఈ ప్రపంచంలో అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమోగాని, అక్రమ సంతానం ఉండదని పేర్కొన్నది. తమ పుట్టుకలో పిల్లల పాత్ర ఏమీ ఉండదని కోర్టు పేర్కొన్నది. బెంగళూరు ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థ బెస్కాంలో గ్రెడ్ 2 లైన్మెన్గా పనిచేస్తున్న వ్యక్తి మరణించడంతో ఆ ఉద్యోగాన్ని ఇవ్వాలని ఆయన రెండో భార్య కుమారుడు బెస్కాంకు విజ్ఞప్తి చేయగా, బెస్కాం తిరస్కరించింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి…
ఎవరో ఓ అధికారి గ్రామంంలోకి వచ్చి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి. రోడ్లు ఎలా ఉన్నాయి, గ్రామస్తులు ఎలా ఉన్నారు అని పరిశీలించినట్టుగా ఓ మొసలి గ్రామంలోకి వచ్చి వీధులన్నీ తిరుగుతూ పరిశీలించింది. గ్రామంలోకి మొసలి రావడంతో గ్రామస్తులు పరుగులు తీశారు. మొసలి మాత్రం దర్జాగా తిరుగుతూ చుట్టూ పరిశీస్తూ వెళ్లింది. భయపడిన గ్రామస్తులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీశాఖ అధికారులు వచ్చి మొసలిని పట్టుకొని నదిలో వదిలేశారు. ఈ సంఘటన కర్ణాటకలోని కోగిల్బాన్…
కరోనా ప్రభావం అన్నిరంగాలపై పడింది. కరోనాకు ముందు కళకళలాడిన హోటల్ రంగం కోవిడ్ ఎంటర్ కావడంతో కుదేలయింది. నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు వంటి నగరాల్లో కూడా హోటల్ రంగం కుదేలయింది. బెంగళూరు నగరంలో 25 వేలకు పైగా హోటళ్లు ఉండగా 2500 హోటళ్లు అమ్మకానికి ఉన్నట్టు హోటల్ అసోసియోషన్ తెలియజేసింది. కర్ణాటక రాష్ట్రంలో దాదాపుగా 70 వేలకు పైగా రిజిస్ట్రేషన్ హోటళ్లు ఉండగా, అందులో 10వేలకు పైగా హోటళ్లు అమ్మకానికి సిద్దంగా ఉన్నట్టు సమాచారం. కరోనా…
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినా.. ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ కలవరపెడుతోంది… ఇప్పటికే భారత్లో కొత్తి వేరింట్ కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య 10 దాటేసింది… ఈ కేసులు వెలుగుచూసిన రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది కేంద్రం.. మరోవైపు.. మహారాష్ట్రలో డెల్టా కేసులు పెరుగుతున్న తరుణంలో కర్ణాటక – మహారాష్ట్ర సరిహద్దుల్లో మరిన్ని కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు.. పోలీసు, వైద్యశాఖ సంయుక్తంగా చెక్పోస్టు ఏర్పాటు చేసింది.. ఇక, మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోకి వచ్చేవారికి…
భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోకి భారతీయులకు అనుమతి ఉంటుంది. అయితే, కొన్ని చోట్లకు మాత్రం భారతీయులను అనుమతించరు. ఆయా ప్రాంతాల్లో కేవలం విదేశీయులను మాత్రమే అనుమతిస్తారట. బెంగళూరులోని శాంతినగర్ ప్రాంతంలో యూనో ఇన్ అనే హోటల్ ఉన్నది. ఈ హోటల్ లోకి కేవలం జపనీయులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. మిగతా వారిని ఈ హోటల్లోకి అనుమతించరు. Read: గుడ్డివాడి పాత్రలో ‘ఐకాన్’ స్టార్! అదే విధంగా హిమాచల్ ప్రదేశ్లోని కాసోల్ ప్రాంతంలో ఫ్రీకాసోల్ కేఫ్ ఉన్నది. ఈ…
కర్ణాటక రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. గతంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. యడ్యూరప్ప ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనపై ఇప్పుడు అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆయన్ను తొలగించి కొత్త ముఖ్యమంత్రిని ఏర్పాటు చేయాలని అదిష్టానంకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, కర్ణాటకలోని బెల్గావిలో ఓ వినూత్న ప్రదర్శన జరిగింది. బెల్గావి ఎమ్మెల్యే రమేష్ జార్కొలికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఆయన అనుచరులు ఒంటెలతో నిరసనను తెలియజేశారు.…
కర్ణాటక రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి.. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఎన్నో పరిణామాలు, మరెన్నో ట్విస్ట్ ల తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు యెడియూరప్ప.. అయితే, ఈ మధ్య.. ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నేతలు.. జాతీయ నాయకత్వం కూడా యెడియూరప్పను సీఎం చైర్ నుంచి దించేందుకు ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు కూడా గుప్పుమన్నాయి.. అయితే, అలాంటి ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చారు నేతలు. మరోవైపు.. యెడియూరప్ప సర్కార్ తీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం…
కాపలాగా ఉండాల్సిన ఓ శునకం యజమానికి తిప్పలు తెచ్చిపెట్టింది. యజమానే శునకానికి కాపలాగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. కర్ణాటకలోని కొప్పళ్ల జిల్లాలోని కారటిగి పట్టణానికి చెందిన దిలీప్ అనే వ్యక్తి ఇంటికి కాపలాగా ఉంటుందని చెప్పి 5వేలు పెట్టి ఓ శునకాన్ని తెచ్చుకున్నాడు. అయితే, ఆ శునకం ఏకంగా యజమాని బంగారం గొలుసును మింగేసింది. గొలుసు కనిపించకపోవడంతో దిలీప్ ఇళ్లంతా వెతికాడు. చివరకు కుక్కను కట్టేసిన ప్రాంతంలో చిన్నచిన్న బంగారం ముక్కలు కనిపించడంతో షాక్ అయ్యాడు. తరువాత…