కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధానకారణమైన ముఖ్యమంత్రి యడ్డియూరప్ప ఆ పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీలో 75 ఏళ్లు నిండిన వారికి ముఖ్యమైన పదవుల్లో కొనసాగే అవకాశం లేదు. అయితే, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైన యడ్డియూరప్ప విషయంలో ఇప్పటికే రెండేళ్లు ఆగింది. రెండేళ్ల క్రితం మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో యడ్డియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. రెండేళ్ల కాలంలో పార్టీలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా తన రాజకీయ అనుభవంతో…
కర్ణాటకలో నాయక్వంలో మార్పు ఉండొచ్చని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనే విషయం ఇప్పటి వరకు స్పష్టంకాలేదు. అయితే, ముఖ్యమంత్రిని మారిస్తే ఇబ్బందులు వస్తాయని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కష్టం అవుతుందని కొందరివాదన. అటు అధిష్టానం కూడా యడ్డియూరప్పను మార్చేందుకు సాహసం చేయడంలేదు. కర్ణాటక తాజా రాజకీయాలపై బీజేసీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చడం పెద్ద సాహసమే అవుతుందని, రాష్ట్రంలో తొలిసారి బీజేపి…
ప్రస్తుతం దేశాన్ని పెగాసస్ స్పైవేర్ కుదిపేస్తున్నది. దేశంలోని 300 మందికి సంబందించిన ఫోన్లపై నిఘాను ఉంచారని, ఫోన్లను ట్యాపింగ్ చేశారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ కూలిపోవడానికి కూడా స్పైవేర్ కారణమని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి స్పందించారు. గత 10-15 ఏళ్లుగా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని, ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో ప్రభుత్వాలు, ఆదాయపన్ను శాఖ ప్రజల ఫోన్లను…
దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. దేశంలోని ప్రముఖులకు చెందిన ఫోన్ నెంబర్లు ఇప్పటికే హ్యాకింగ్కు గురైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా ఇప్పుడు మరో విషయం బయటకు వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఆ పార్టీలకు చెందిన నేతల ఫోన్ నెంబర్లపై కూడా నిఘా ఉంచినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి ఇది కూడా ఒక కారణం అనే అనుమానాలు…
దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా ఉదృతి ఇంకా కోనసాగుతూనే ఉన్నది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రతో పాటు అటు ఒడిశా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. కరోనా మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న సమయంలో ప్రధాని మోడీ ఈరోజు ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాల కల్పన, ఆక్సిజన్ కొరత…
అక్రమ సంతానం విషయంలో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఈ ప్రపంచంలో అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమోగాని, అక్రమ సంతానం ఉండదని పేర్కొన్నది. తమ పుట్టుకలో పిల్లల పాత్ర ఏమీ ఉండదని కోర్టు పేర్కొన్నది. బెంగళూరు ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థ బెస్కాంలో గ్రెడ్ 2 లైన్మెన్గా పనిచేస్తున్న వ్యక్తి మరణించడంతో ఆ ఉద్యోగాన్ని ఇవ్వాలని ఆయన రెండో భార్య కుమారుడు బెస్కాంకు విజ్ఞప్తి చేయగా, బెస్కాం తిరస్కరించింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి…
ఎవరో ఓ అధికారి గ్రామంంలోకి వచ్చి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి. రోడ్లు ఎలా ఉన్నాయి, గ్రామస్తులు ఎలా ఉన్నారు అని పరిశీలించినట్టుగా ఓ మొసలి గ్రామంలోకి వచ్చి వీధులన్నీ తిరుగుతూ పరిశీలించింది. గ్రామంలోకి మొసలి రావడంతో గ్రామస్తులు పరుగులు తీశారు. మొసలి మాత్రం దర్జాగా తిరుగుతూ చుట్టూ పరిశీస్తూ వెళ్లింది. భయపడిన గ్రామస్తులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీశాఖ అధికారులు వచ్చి మొసలిని పట్టుకొని నదిలో వదిలేశారు. ఈ సంఘటన కర్ణాటకలోని కోగిల్బాన్…
కరోనా ప్రభావం అన్నిరంగాలపై పడింది. కరోనాకు ముందు కళకళలాడిన హోటల్ రంగం కోవిడ్ ఎంటర్ కావడంతో కుదేలయింది. నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు వంటి నగరాల్లో కూడా హోటల్ రంగం కుదేలయింది. బెంగళూరు నగరంలో 25 వేలకు పైగా హోటళ్లు ఉండగా 2500 హోటళ్లు అమ్మకానికి ఉన్నట్టు హోటల్ అసోసియోషన్ తెలియజేసింది. కర్ణాటక రాష్ట్రంలో దాదాపుగా 70 వేలకు పైగా రిజిస్ట్రేషన్ హోటళ్లు ఉండగా, అందులో 10వేలకు పైగా హోటళ్లు అమ్మకానికి సిద్దంగా ఉన్నట్టు సమాచారం. కరోనా…
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినా.. ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ కలవరపెడుతోంది… ఇప్పటికే భారత్లో కొత్తి వేరింట్ కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య 10 దాటేసింది… ఈ కేసులు వెలుగుచూసిన రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది కేంద్రం.. మరోవైపు.. మహారాష్ట్రలో డెల్టా కేసులు పెరుగుతున్న తరుణంలో కర్ణాటక – మహారాష్ట్ర సరిహద్దుల్లో మరిన్ని కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు.. పోలీసు, వైద్యశాఖ సంయుక్తంగా చెక్పోస్టు ఏర్పాటు చేసింది.. ఇక, మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోకి వచ్చేవారికి…
భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోకి భారతీయులకు అనుమతి ఉంటుంది. అయితే, కొన్ని చోట్లకు మాత్రం భారతీయులను అనుమతించరు. ఆయా ప్రాంతాల్లో కేవలం విదేశీయులను మాత్రమే అనుమతిస్తారట. బెంగళూరులోని శాంతినగర్ ప్రాంతంలో యూనో ఇన్ అనే హోటల్ ఉన్నది. ఈ హోటల్ లోకి కేవలం జపనీయులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. మిగతా వారిని ఈ హోటల్లోకి అనుమతించరు. Read: గుడ్డివాడి పాత్రలో ‘ఐకాన్’ స్టార్! అదే విధంగా హిమాచల్ ప్రదేశ్లోని కాసోల్ ప్రాంతంలో ఫ్రీకాసోల్ కేఫ్ ఉన్నది. ఈ…