దేశంలో అగ్లీ భాష ఏంటి అని గూగుల్ని అడిగితే కన్నడ అని సమాధానం రావడంతో కన్నడిగులు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కన్నడ భాషకు ప్రాచీన భాషగా గుర్తింపు ఉందని ఆగ్రహం వ్యక్తం చేయడంతో గూగుల్ క్షమాపణలు చెప్పింది. ఈ సంగటన మరువక ముందే కర్ణాటక జెండా రంగుల చిహ్నాలతో అమెజాన్ బికినీని విక్రియించింది. దీంతో మరోసారి కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ సంస్థలు కర్ణాటకను అవమానిస్తున్నాయని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి పునరావృతం…
ఇటీవల ఫేక్ నోట్లు ఎక్కువ చలామణి అవుతున్నాయని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా వెల్లడించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రూ. 500 డినామినేషన్ నోట్లు విపరీతంగా చలామణి అవుతున్నాయని తెలిపింది. రూ.500 ఫేక్ కరెన్సీ ఏకంగా 31.4 శాతం మేర పెరిగిందని చెప్పింది. ఇదిలావుంటే, తాజాగా కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో భారీగా నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దండేలీలో జరిపిన సోదాల్లో రూ.72 లక్షల దొంగ నోట్లు సహా మరో రూ.4.5 లక్షల అసలు…
పోలీసులకు ఆధారాలు దొరకకూడదనే భయంతో ఓ దొంగ 35 గ్రాముల బంగారు ఉంగరాలను మింగాడు. ఆ దొంగ మింగిన బంగారు ఉంగరాలను ఆపరేషన్ చేసి డాక్టర్లు బయటికి తీశారు. ఈ సంఘటన కర్ణాటకలోని సుళ్య పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మార్చి చివర్లో సుళ్య పాత బస్టాండు వద్ద గల నగల షాపులో చోరీ జరిగింది. ఈ ఘటనలో రూ. 7.50 లక్షల విలువ చేసే 180 గ్రాముల బంగారం ఉంగరాలు, రూ. 50 వేలు…
కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ను మరోసారి పొడిగించింది కర్ణాటక ప్రభుత్వం.. ప్రస్తుత లాక్డౌన్ గడువు ఈనెల 24తో ముగియనుండగా.. జూన్ 7వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్ప ప్రకటించారు.. రాష్ట్రంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు వ్యాపించిన నేపథ్యంలో మరో 14 రోజులు లాక్డౌన్ పొడిగించినట్టు వెల్లడించారు. మంత్రులు, అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన సీఎం.. ఆ తర్వాత లాక్డౌన్పై ప్రకటన చేశారు.. ఈ సమయంలో ఉదయం 6…
దేశంలో కరోనా కల్లోలానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. రోజు రోజుకు కేసులు, మృతుల సంఖ్య ప్రభుత్వాలకు సవాల్ విసురుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కాగా కర్ణాటకలోని విజయపుర జిల్లా తొరవి గ్రామంలో కరోనా రెండో దశ మొదలైన నాటి నుంచి 70 మంది కొవిడ్ కాటుకు బలయ్యారు. అందులో 40 మంది ఒక్క నెలలోనే కరోనాతో చనిపోవడం ఆ గ్రామాన్ని కలవరపెడుతుంది. మాజీ మంత్రి ఎమ్బీ పాటిల్…
కర్ణాటకలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో మే 24 వరకు లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. మరో ఐదు రోజుల్లో లాక్ డౌన్ ముగియనుండటంతో మరోసారి లాక్డౌన్ను పొడిగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరో రెండు రోజుల్లో లాక్డౌన్ పొడిగింపుపై కర్ణాటక సర్కార్ నిర్ణయం తీసుకోనున్నది. లాక్డౌన్ను అమలు చేస్తున్నప్పటీకి కరోనా కేసులు కంట్రోల్ కావడంలేదు. రోజువారి కేసులు 38 వేలకు పైగా నమోదవుతున్నాయి. ఒకవేళ లాక్డౌన్ను అమలు చేస్తే…
ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ల కొరతను అధిగమించడానికి కర్ణాటక ప్రభుత్వం గ్లోబల్ టెండర్ల ప్రక్రియను చేపట్టింది. గ్లోబల్ టెండర్లను పిలవడం ద్వారా రెండు కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ను సేకరించబోతోంది. దీనికోసం 843 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. అన్ని రాష్ట్రాల్లాగే- కర్ణాటక కూడా కరోనా వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటోంది. దేశంలో మహారాష్ట్ర తరువాత అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతోన్నది ఈ రాష్ట్రంలోనే. యాక్టివ్ కేసుల్లో కర్ణాటక.. దేశంలోనే మొదటి స్థానంలో ఉంటోంది…
కర్ణాటకలో ప్రస్తుతం లాక్డౌన్ కోనసాగుతోంది. ఈరోజు నుంచి మే 24 వరకు లాక్డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని దేవసుగుర్ చెక్పోస్ట్ దగ్గర కర్ణాటక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్యం,నిత్యవసర సరుకుల వాహనాలను మాత్రమే కర్ణాటకలోకి అనుమతిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కర్ణాటకలో రోజువారి కరోనా కేసులు 40 వేలకు పైగా నమోదవుతుండటంతో రెండు వారాలపాటు సంపూర్ణలాక్డౌన్ను అమలు చేస్తున్నారు. లాక్ డౌన్…
దేశంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక దక్షిణభారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో పరిస్థతి వేరుగా ఉన్నది. రోజుకు 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క బెంగళూరు నగరంలోనే ఏకంగా 25 వేలకు పైగా కేసులు, 200 లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని, లేదంటే కర్ణాటక రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు పెనుముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తెలియజేసింది.…