Two stab man to death for not repaying loan of Rs 9k in Karnataka’s Kalaburagi: కర్ణాటకలో దారుణం జరిగింది. కేవలం రూ. 9000 కోసం ఒకరిని హత్య చేశారు ఇద్దరు వ్యక్తులు. అందరూ చూస్తుండగానే రోడ్డుపైనే కత్తితో దాడి చేసి హతమార్చాడు. అప్పుగా ఇచ్చిన మొత్తం చెల్లించకపోవడంతో హత్య చేశారు నిందితులు. ఈ ఘటన అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
తన ప్రేయసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని యువకుడు కక్షగట్టి.. ఆమెను కత్తితో 20 సార్లు పొడిచాడు. అనంతరం అతడు కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి తాలూకా అవటి గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.
రోడ్ల దుస్థితిపై వినూత్న తరహాలో నిరసనకు దిగారు నిత్యానంద అనే సామాజిక కార్యకర్త.. ఉడిపిలో రోడ్లపై ఉన్న గుంతలను నిరసిస్తూ కర్ణాటకకు చెందిన నిత్యానంద ఒలకడు అనే సామాజిక కార్యకర్త పొర్లు దండాలు పెట్టారు
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్గాంధీ పాదయాత్ర చేపట్టారు. వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ యాత్రలో రాహుల్గాంధీ స్వల్ప విరామం తీసుకున్నారు.
Godse photo at Ganesh Visarjan: ఇటీవల మతపరమైన ఉద్రిక్తతలకు కర్ణాటక కేరాఫ్ గా మారుతోంది. వరసగా ఏదో వివాదం ఆ రాష్ట్రంలో చెలరేగుతూనే ఉంది. హిజాబ్ అంశం తరువాత, వరసగా బీజేపీ కార్యకర్తల హత్యలు, శివమొగ్గలో వీర్ సావర్కర్ పోస్టర్ వ్యవహారం ఇలా ఏదో ఒక వివాదంతో దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా మరో ఘటన కర్ణాటకలో జరిగింది. వినాయక నిమర్జన వేడుకల్లో నాథూరామ్ గాడ్సే ఫోటోలతో ర్యాలీలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. రైట్వింగ్…
విద్యార్థులను సన్మార్గంలో నడపాల్సిన ఓ ఉపాధ్యాయురాలు దాదాపు 25 ఏళ్లుగా ఒకే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. తన జీవితంలో వేలాదిమందికి విద్యాబుద్ధులు నేర్పారు. కానీ ఐదేళ్ల క్రితం ఏమైందో ఏమో..
Praveen Nettaru Case: బీజేపీ నేత ప్రవీణ్ నెట్టార మర్డర్ కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కర్ణాటకలోని పలు జిల్లాలో విస్తృతంగా సోదాలను నిర్వహించింది. మూడు జిల్లాల్లో 33 చోట్ల సోదాలు చేశారు అధికారులు. మైసూరు, కొడుగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కీలక సభ్యులుగా ఉన్న నిందితులు.. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేత ప్రవీణ్ నెట్టారును హత్య చేసినట్లు…
Karnataka Minister Umesh Katti dies of cardiac arrest: కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి మంగళవారం మరణించారు. గుండె పోటు కారణంగా బెంగళూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందారు. 61 ఏళ్ల ఉమేష్ కత్తి బస్వరాజ్ బొమ్మై మంత్రి వర్గంలో పౌరసరఫరాలు, అటవీ శాఖలను నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. హుక్కేరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్టు ఎమ్మెల్యేగా గెలిచారు ఉమేష్ కత్తి.