రైలు వచ్చే కొన్ని క్షణాల ముందు పట్టాలపై జారిపడిపోయిన ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు రక్షించారు. ఈ ఘటన బెంగళూరులోని కేఆర్ పురం రైల్వే స్టేషన్లో జరిగింది. ఈ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ ట్విటర్ వేదికగా విడుదల చేసింది.
కర్ణాటకలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కే1 కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విషాదకరంగా ముగిసింది. ప్రత్యర్థి విసిరిన పంచ్కు కిక్ బాక్సర్ నిఖిల్ సురేష్ తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ముఖంపై పంచ్ దెబ్బ గట్టిగా తగిలడంతో రింగ్లోనే కుప్పకూలిపోయాడు. నిఖిల్ సురేష్ స్వస్థలం మైసూరు. అతడి వయసు 23 ఏళ్లు. ఈ నేపథ్యంలో కిక్బాక్సింగ్ ఛాంపియన్షిప్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. Read Also: Jos Buttler: కోహ్లీపై విమర్శలు.. బట్లర్ ఘాటు వ్యాఖ్యలు కాగా రాష్ట్ర…
దేశంలో వివాదాస్పదం అయిన హిజాబ్ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు విచారణకు అంగీకరించింది. వచ్చే వారం నుంచి దీనిపై విచారణ చేపడుతామని, వచ్చేవారం లిస్ట్ చేస్తామని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. కర్ణాటక హైకోర్టు, స్కూళ్లు, కాలేజీల్లోకి హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. గతంలో అత్యవసర విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ సమయంలో సుప్రీం…
మహారాష్ట్ర, కర్ణాటకలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక మహారాష్ట్రలో గడిచిన 24 గంటల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కర్ణాటక తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటకలో వర్షాలపై సీఎం బసవరాజ్ బొమ్మై అధికారులతో సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ReadAlso: YSRCP Plenary 2022: వైసీపీ ప్లీనరీ.. భారీ…
ప్రముఖ వాస్తు శాస్త్రజ్ఙడు చంద్రశేఖర్ గురూజీ అలియాస్ చంద్రశేఖర్ అగడిని గురూజీ హత్య గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఓ ప్రెసిడెంట్ హోటల్ లో ఉన్న ఆయన్ను మంగళవారం పట్టపగలు అతి దారుణంగా హత్య చేస్తున్న సమయంలో హోటల్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. జూలై 2న తేదీన హుబ్బళిలోని ప్రెసిడెంట్ హోటల్ లో గది అద్దెకు తీసుకుని పలువురికి వాస్తు శాస్త్రం చెబుతున్నారు చంద్రశేఖర్ గురూజీ. బుధవారం హోటల్ రూమ్ ఖాళీ…
సరళ వాస్తు ఫేమ్ డాక్టర్ చంద్రశేఖర్ గురూజీ ఇవాళ ఉదయం హుబ్లీలోని ఓ హోటల్లో దారుణ హత్యకు గురయ్యాడు.. ఇద్దరు వ్యక్తులు గురూజీని కత్తితో పొడిచి హత్య చేసినట్టుగా తెలుస్తోంది..
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి నంబర్ వన్గా నిలిచింది.. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020లో ఏపీ టాప్ స్పాట్లో నిలిచి సత్తా చాటింది.. ఈ జాబితాలో టాప్ ఎచీవర్స్లో 7 రాష్ట్రాలను ప్రకటించింది కేంద్రం.