కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్గాంధీ పాదయాత్ర చేపట్టారు. వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ యాత్రలో రాహుల్గాంధీ స్వల్ప విరామం తీసుకున్నారు.
Godse photo at Ganesh Visarjan: ఇటీవల మతపరమైన ఉద్రిక్తతలకు కర్ణాటక కేరాఫ్ గా మారుతోంది. వరసగా ఏదో వివాదం ఆ రాష్ట్రంలో చెలరేగుతూనే ఉంది. హిజాబ్ అంశం తరువాత, వరసగా బీజేపీ కార్యకర్తల హత్యలు, శివమొగ్గలో వీర్ సావర్కర్ పోస్టర్ వ్యవహారం ఇలా ఏదో ఒక వివాదంతో దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా మరో ఘటన కర్ణాటకలో జరిగింది. వినాయక నిమర్జన వేడుకల్లో నాథూరామ్ గాడ్సే ఫోటోలతో ర్యాలీలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. రైట్వింగ్…
విద్యార్థులను సన్మార్గంలో నడపాల్సిన ఓ ఉపాధ్యాయురాలు దాదాపు 25 ఏళ్లుగా ఒకే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. తన జీవితంలో వేలాదిమందికి విద్యాబుద్ధులు నేర్పారు. కానీ ఐదేళ్ల క్రితం ఏమైందో ఏమో..
Praveen Nettaru Case: బీజేపీ నేత ప్రవీణ్ నెట్టార మర్డర్ కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కర్ణాటకలోని పలు జిల్లాలో విస్తృతంగా సోదాలను నిర్వహించింది. మూడు జిల్లాల్లో 33 చోట్ల సోదాలు చేశారు అధికారులు. మైసూరు, కొడుగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కీలక సభ్యులుగా ఉన్న నిందితులు.. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేత ప్రవీణ్ నెట్టారును హత్య చేసినట్లు…
Karnataka Minister Umesh Katti dies of cardiac arrest: కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి మంగళవారం మరణించారు. గుండె పోటు కారణంగా బెంగళూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందారు. 61 ఏళ్ల ఉమేష్ కత్తి బస్వరాజ్ బొమ్మై మంత్రి వర్గంలో పౌరసరఫరాలు, అటవీ శాఖలను నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. హుక్కేరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్టు ఎమ్మెల్యేగా గెలిచారు ఉమేష్ కత్తి.
Bengaluru Floods: బెంగళూర్ లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం ప్రారంభం అయింది. దీంతో నగరం అంతా వరద పరిస్థితి నెలకొనడంతో పాటు భారీ వర్షాలు కురుస్తుండటంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్ర నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఎల్లో అలర్ట్…
మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మురుగ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణరును చిత్రదుర్గ సెషన్స్ కోర్టు సోమవారం సెప్టెంబర్ 14 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
Basava Siddalinga Swami: కర్ణాటక పీఠాధిపతి బసవ సిద్దిలింగ స్వామి సూసైడ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గత కొన్నిరోజులుగా పీఠాధిపతులా లైంగిక ఆరోపణలు హాట్ టాపిక్ గా మారిన విషయం విదితమే. చిత్రదుర్గ మురుగ మఠాధిపతి శివమూర్తి శరణారు ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు.. ఇక ఈ మధ్యనే లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న శివమూర్తి కస్టడీలో ఉన్నాడు. ఇక వీటినే ఇంకా మరువలేని స్థితిలో ఉండగా మరో ఘటన కర్ణాటకను ఒక ఊపు ఊపేస్తోంది. బసవ సిద్దిలింగ…