Bengaluru Floods: బెంగళూర్ లో మళ్లీ భారీ వర్షం.. ఎల్లో అలర్ట్ జారీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Floods: బెంగళూర్ లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం ప్రారంభం అయింది. దీంతో నగరం అంతా వరద పరిస్థితి నెలకొనడంతో పాటు భారీ వర్షాలు కురుస్తుండటంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్ర నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే వర్షాల వల్ల ఒకరు మరణించారు. నగర వ్యాప్తంగా చెరువులు పొంగిపోర్లుతున్నాయి. బెంగళూర్ లో సెప్టెంబర్ 1 మరియు 5 మధ్య సాధారణం కంటే 150 శాతం ఎక్కువ వర్షాలు పడ్డాయి. మహదేవపురం, బొమ్మనహళ్లి, కెఆర్ పురంలలో 307 శాతం అధిక వర్షపాతం నమోదైంది. గత 42 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని, బెంగళూరులోని మొత్తం 164 ట్యాంకులు పూర్తి స్థాయిలో నిండాయని సీఎం బస్వరాజ్ బొమ్మై తెలిపారు.
Read Also: IND Vs SL: కెప్టెన్ రోహిత్ శర్మ ఒంటరి పోరు.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?
Also Read
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
ఇదిలా ఉంటే రాబోయే 3 రోజుల పాటు నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఆ తర్వాత దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో రాబోయే 2 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉంటే వర్షంలో చిక్కుకున్న వారిని కష్టాలు మరింత రెట్టింపు అవుతున్నాయి. క్యాబ్ బుక్ చేసుకోవాలంటే కిలోమీటర్ కు రూ. 200 వరకు వసూలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. అత్యంత ఖరీదైన కార్లు నీట మునిగాయి. బెంగళూర్ వరదలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కారణంగానే వరదలు సంభవించాయని సీఎం బస్వరాజ్ బొమ్మై ఆరోపించారు. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్.. బీజేపీ ప్రభుత్వం, అధికారులే వరదలకు కారణం అని.. దైర్యం ఉంటే ఎన్నికలను ఎదుర్కోవాలని బీజేపీకి సవాల్ విసిరారు.
#WATCH | Heavy rain continues to lash Bengaluru, amid a 'Yellow' alert issued for today
IMD forecast shows no respite from rains for the next 2-3 days pic.twitter.com/Cv1rWvoBD7
— ANI (@ANI) September 6, 2022
తాజావార్తలు
-
Ranabaali: రణబాలి రిలీజ్పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!