కర్ణాటకలోని బెంగళూరు విమానాశ్రయంలో మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన ఇథియోపియన్ పౌరుడికి మంకీపాక్స్కు బదులుగా చికెన్పాక్స్ ఉన్నట్లు నిర్ధారించబడింది. కర్ణాటక ఆరోగ్య మంత్రి కె.సుధాకర్ ప్రకారం.. ఇథియోపియన్ పౌరుడు ఈ నెల ప్రారంభంలో మంకీపాక్స్ లక్షణాలతో బెంగళూరు విమానాశ్రయంలో దిగగా.. అతనిని పరీక్షల కోసం పంపించారు.
Another youth killed in karnataka: కర్ణాటక వరస హత్యలతో అట్టుడుకుతోంది. వరసగా రోజుల వ్యవధిలో ఇరు వర్గాలకు చెందిన ఇద్దరు యువకులను దుండగులు దారుణంగా హత్య చేశారు. దీంతో కర్ణాటక వ్యాప్తంగా ఒక్కసారిగా ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే బెల్లారే ప్రాంతంలో బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టార్ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది.
కర్ణాటకలో ఓ బీజేపీ కార్యకర్త హత్య విషయంపై పార్టీలోనూ, బయటా నెలకొన్న ఒత్తిళ్ల నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో పరిస్థితులకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నామని.. ఒకవేళ పరిస్థితులుగానీ మారితే పరిస్థితులు డిమాండ్ చేస్తే కర్ణాటకలో కూడా ‘యోగి మోడల్’ ప్రభుత్వం అమలులోకి వస్తుందని వ్యాఖ్యానించారు.
BJP Worker Killed in karnataka: కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బీజేపీ యువమోర్చా కార్యకర్త దారుణహత్యతో అట్టుడికిపోతోంది. దక్షిణ కన్నడ జిల్లాలో పోలీసులు బందోబస్త్ ను పెంచారు. మంగళవారం సాయంత్రం జిల్లాలోని బెల్లారే ప్రాంతంలో బీజేపీ యువ మోర్చా ఆఫీస్ బేరర్ ప్రవీణ్ నెట్టారును దుండగులు దారుణంగా హత్య చేశారు.
Missing Pet Parrot Found in Karnataka: ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో తమ పెంపుడు చిలుక కనిపించకుండా పోవడంతో సదరు యజమాని దాన్ని పట్టించినందుకు రూ.50,000 రివార్డు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పెంపుడు చిలుక ఆచూకీ వారం రోజుల తరువాత తెలిసింది. దీంతో దీన్ని పట్టించిన వ్యక్తికి ముందుగా అనుకున్న రూ. 50,000 కన్నా ఎక్కువగా బహుమతి ఇచ్చాడు. ఏకంగా రూ.85,000 రివార్డు ఇచ్చాడు.
ఓ సీనియర్ పొలిటీషనర్ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించే సూచనలు చేశారు.. కర్ణాటక రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సంకేతాలు ఇచ్చారు.. ఇప్పటి వరకు తాను ప్రాతినథ్యం వహిస్తూ వచ్చిన శికరైపుర అసెంబ్లీ స్థానాన్ని ఖాళీ చేస్తున్నాను.. ఇకపై తన కుమారుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర అక్కడి నుంచి బరిలోకి దిగుతారని.. రానున్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి…
ఎవరిని ఎప్పుడు.. ఏ రూపంలో ప్రమాదం వెంటాడుతుందో చెప్పడం కష్టం.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్ని చిన్న సంఘటనలతోనే ప్రాణాలు పోయే సందర్భాలు ఎన్నో ఉంటాయి.. కళ్లలో పెట్టుకుని.. కడపులోని పెట్టుకునే అనే విధంగా.. తమ పిల్లలను తల్లిదండ్రులు చూసుకుంటారు.. వారి ఏది అడిగితే అది.. అన్నట్టుగా తమ స్థాయికి తగ్గట్టు కొనిస్తూనే ఉంటారు.. అయితే, ప్రేమగా కొనిపించినా చాక్లెటే ఓ చిన్నారి ప్రాణాలు తీసింది.. అదేంటి..? చాక్లెట్ ప్రాణాలు తీయడమేంటి? అనే అనుమానం వెంటనే రావొచ్చు..…
Business Flash: స్ట్రీమింగ్ మీడియా కంపెనీ నెట్ఫ్లిక్స్కి యూజర్లు తగ్గినా షేర్లు పెరగటం విశేషం. 9 లక్షల 70 మంది సబ్స్క్రైబర్ల తగ్గుతారని సెకండ్ క్వార్టర్ ఆదాయ నివేదికలో వెల్లడించింది. ఫస్ట్ క్వార్టర్లో 2 లక్షలు తగ్గొచ్చన్న అంచనాలతో పోల్చితే ఇది తక్కువే కావటం గమనార్హం.
రైలు వచ్చే కొన్ని క్షణాల ముందు పట్టాలపై జారిపడిపోయిన ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు రక్షించారు. ఈ ఘటన బెంగళూరులోని కేఆర్ పురం రైల్వే స్టేషన్లో జరిగింది. ఈ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ ట్విటర్ వేదికగా విడుదల చేసింది.