Supreme Court: హిజాబ్పై నిషేధంతో కర్ణాటకలో ఎంత మంది చదువు మానేశారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: కర్ణాటకలో హిజాబ్పై నిషేధం విధించడం వల్ల ఎంత మంది చదువు మానేశారో తెలియజేసే ప్రామాణిక లెక్కలు ఉన్నాయా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. వాటిని తమకు నివేదించాలని సూచించింది. కర్ణాటక విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై నిషేధాన్ని ఎత్తివేయడానికి ఆ రాష్ట్ర హైకోర్టు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వాటిపై జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియాల ధర్మాసనం బుధవారం విచారణ కొనసాగించింది.
పిటిషనర్లలో ఒకరు విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు పాఠశాలకు హాజరు కావట్లేదనే సమస్యను లేవనెత్తారు. పిటిషనర్లలో ఒకరి తరపున సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ ఒక నివేదికను ప్రస్తావించారు. దానిలో చాలా మంది విద్యార్థుల సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. “ఈ ప్రత్యేక తీర్పు తర్వాత 17,000 మంది విద్యార్థులు నిజంగా పరీక్షలకు దూరంగా ఉన్నారని నా స్నేహితుడు (న్యాయవాదులలో ఒకరు) నాకు తెలియజేసారు” అని నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరించిన కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న ధర్మాసనానికి న్యాయవాది హుజెఫా అహ్మదీ చెప్పారు. ఇన్నాళ్లూ పాఠశాలల్లో లౌకిక విద్యను అభ్యసించిన బాలికలు.. హిజాబ్పై నిషేధం కారణంగా మళ్లీ మదర్సాలకు వెళ్లే పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
SCO Summit: ఎస్సీవో శిఖరాగ్ర సదస్సు నేడే ప్రారంభం.. ఒకే వేదికపై మోదీ, పుతిన్, జిన్పింగ్
మరో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదిస్తూ.. హిజాబ్ ధరించిన వ్యక్తికి మతం, లింగం ఆధారంగా వివక్ష చూపరాదని ఈ కేసులో అత్యంత ముఖ్యమైన భాగమని వాదించారు. భారతదేశం అంతటా, మొత్తం ప్రపంచంలో, అది ఇస్లామిక్ రాజ్యమైనా లేదా మరేదైనా హిజాబ్ చెల్లుబాటు అయ్యేదిగా గుర్తించబడుతుందని న్యాయవాది రాజీవ్ ధావన్ వాదించారు. విశ్వాసం సిద్ధాంతాల ప్రకారం, ఏదైనా ఒక నిర్దిష్ట మార్గంలో జరిగితే, అది చిత్తశుద్ధితో ఉంటే, దానిని అనుసరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం సంరక్షించదగిన మతపరమైన ఆచారంలో హిజాబ్ ధరించడం ఒక భాగం కాదని మార్చి 15న హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!