గ్రాఫ్ పడిపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కట్ అని సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టంగా చెప్పేయడంతో.. గోదావరి జిల్లాల్లో ఆ అంశం హాట్ టాపిక్గా మారిపోయింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు టికెట్ వస్తుంది? ఎవరికి రాదు అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఏ నలుగురు వైసీపీ శ్రేణులు కలిసినా ఇదే చర్చ. దీనిని ఆసరాగా చేసుకుని ఎమ్మెల్యేలపై కొందరు వ్యతిరేక ప్రచారాలు మొదలు పెట్టేస్తున్నారట. జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో…
కాకినాడ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం దారుణహత్య చోటుచేసుకుంది. సామర్లకోటలో నడిరోడ్డుపై యువకుడి హత్య కలకలం రేపింది. తలాటం శివ అనే యువకుడిని మణి అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పుట్టినరోజు సందర్భంగా శివ అనే వ్యక్తి సామర్లకోటలోని స్థానిక విఘ్నేశ్వర థియేటర్లో సినిమా చూసేందుకు వచ్చాడు. అయితే అతడిని థియేటర్ వద్దే మణి అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. దీంతో పుట్టినరోజు నాడే శివ చనిపోయాడు. ఈ ఘటనపై…
ఎండలు మండుతున్నాయి. భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. గోదావరి జిల్లాలో తాగు నీటి సమస్య పెరుగుతోంది. ప్రధానంగా శివారు ప్రాంతాల ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు.. గోదావరి చెంతనే ఉన్నా ఈ ప్రాంతాల్లో త్రాగునీటికి చింత తప్పడంలేదు. గోదావరి వాసులు త్రాగునీటి కోసం చేస్తున్న ఫీట్లు, మహిళలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీకావు, మండుతున్న ఎండలతో గోదావరి జిల్లాల ప్రజల గొంతు ఎండుతోంది. గుక్కెడు నీళ్లు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ట్యాంకర్లు వద్ద మంచినీళ్లు పట్టుకోవడంలోనూ, సుదూర…
ఈమధ్యకాలంలో యువకులు మారణాయుధాలతో తిరుగుతూ కలకలం రేపుతున్నారు. గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఓ రాజకీయనాయకుడి బంధువు ఒకరు కత్తితో కేక్ కట్ చేసి, బర్త్ డే వేడుకల్లో హంగామా చేయడం వివాదాస్పదం అయింది. తాజాగా కాకినాడ జిల్లాలో ఓ యువకుడు పిస్టల్ పట్టుకుని హడావిడి చేశాడు. అతని ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. https://ntvtelugu.com/breaking-news-young-lady-suicide-at-esi-metro-station/ సామర్లకోట పట్టణంలో 27వ వార్డు సాయినగర్ కు చెందిన ఓ యువకుడు పిస్టల్తో ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్చల్…
ఏపీలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. దీంతో ప్రభుత్వం తన తప్పు తెలుసుకుంది. స్మార్ట్ సిటీ ఛైర్మన్ల పదవులకు గండం ఏర్పడింది. ఈ నియామకాల్లో న్యాయపరమైన చిక్కులు తప్పేలా లేవు. దీంతో స్మార్ట్ సిటీ ఛైర్మన్ల వరుస రాజీనామాలకు తెరతీసింది ప్రభుత్వం. జీవీఎంసీ స్మార్ట్ సిటీ చైర్మన్ జీవీ రాజీనామా చేశారు. సాంకేతికంగా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్లు నియామకాలు చెల్లవని ఆలస్యంగా గుర్తించింది రాష్ట్రప్రభుత్వం. స్మార్ట్ సిటీ…
జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ శ్రేణులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి… తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎక్కనుండి పోటీ చేసినా నేను ఓడిస్తానని ప్రకటించారు.. కాకినాడలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్.. కాకినాడలో కొందరు చెంచాలు చెప్పే మాటలు నమ్మి నాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.. వాస్తవాలు తెలుసుకుని నా గురించి మాట్లాడు అంటూ కౌంటర్ ఇచ్చిన ఆయన.. జనసేన నాయకులు, కార్యకర్తలకు పవన్…
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రైల్వే స్టేషన్లో రైల్వే ఎస్సై వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే… కాకినాడ రైల్వే స్టేషన్ రెండో నెంబర్ ప్లాట్ఫారంపైకి కాకినాడ-తిరుపతి రేణిగుంట ఎక్స్ప్రెస్ వచ్చింది. రైలు వెళ్ళిపోతున్న సమయంలో ఓ ప్రయాణికుడు రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. రన్నింగ్ ట్రైయిన్ కావడంతో పొరపాటున కాలు జారింది. ప్రయాణికులు రైలు, ప్లాట్ఫారం మధ్యలో ఇరుక్కుపోయాడు. రైలు అతడిని చాలా దూరం పాటు ఈడ్చుకెళ్లింది. అయితే ప్రయాణికుడిని వెంటనే గమనించిన రైల్వే ఎస్సై…
కాన్సెప్ట్ మోడల్లో వచ్చిన హోటల్స్ ఈమధ్యకాలంలో బాగా ఆకట్టుకుంటున్నాయి. వెరైటీ కాన్సెప్ట్తో వినియోగదారులకు ఆకర్షించేందుకు యువత ఉత్సాహం చూపుతున్నది. ఇందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఖైదీ బిర్యానీ పేరుతో ఓ హోటల్ను ప్రారంభించారు. జైలు వాతావరణం ఎలా ఉంటుందో అలాంటి వాతావరణాన్ని హోటల్లో ఏర్పాటు చేశారు. ఇందులో ఫుడ్ సర్వ్ చేసే వారు ఖైదీ డ్రస్సులు వేసుకొని సర్వ్ చేస్తుంటారు. ఇక ఈ హోటల్లో సాధారణ గదులకు బదులుగా గదులను జైలు గదులుగా మార్చారు. ఈ…
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వస్తుందో ఎవరికీ చెప్పలేం. సముద్రాన్ని నమ్ముకొని చేపల వేటను సాగించే మత్స్యకారులకు అప్పుడప్పుడు ఆ చేపల రూపంలోనే అదృష్టం వరిస్తుంటుంది. ఇటీవలే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లగా అతని వలకు 30 కేజీల కచ్చిడి మగచేప ఒకటి దొరికింది. ఈ చేపను ఒడ్డుకు తీసుకొచ్చి వేలం వేశారు. ఈ వేలంలో ఈ చేపను రూ. 4.30 లక్షలకు అమ్ముడుపోయింది. ఎంతపెద్దవైనా మామూలు చేపలకు ఇంత గిరాకి…
సంక్రాంతి, క్రిస్మస్ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారికి గుడ్ న్యూస్ అందించింది. క్రిస్మస్, సంక్రాంతి పండగల దృష్ట్యా దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల్లో 60 రోజుల ముందుగా టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చే ప్రయాణికుల డిమాండ్ను బట్టి ప్రస్తుతానికి ఏడు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి అమలాపురానికి మూడు, కాకినాడకు రెండు,…