PVN Madhav: స్మార్ట్ గా దోచేశారు.. తిరిగిచ్చెయ్యండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. దీంతో ప్రభుత్వం తన తప్పు తెలుసుకుంది. స్మార్ట్ సిటీ ఛైర్మన్ల పదవులకు గండం ఏర్పడింది. ఈ నియామకాల్లో న్యాయపరమైన చిక్కులు తప్పేలా లేవు. దీంతో స్మార్ట్ సిటీ ఛైర్మన్ల వరుస రాజీనామాలకు తెరతీసింది ప్రభుత్వం. జీవీఎంసీ స్మార్ట్ సిటీ చైర్మన్ జీవీ రాజీనామా చేశారు.
సాంకేతికంగా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్లు నియామకాలు చెల్లవని ఆలస్యంగా గుర్తించింది రాష్ట్రప్రభుత్వం. స్మార్ట్ సిటీ కార్పోరేషన్ల ఛైర్మన్లు రాజీనామా చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. విశాఖ, తిరుపతి, కాకినాడ, ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ ల రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. స్మార్ట్ సిటీ కార్పోరేషన్ల పేరుతో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. కాకినాడలో మోడరనైజేషన్ పేరుతో భారీ మొత్తంలో ఖర్చు చేశారు. ఉపనదుల్లో డ్రెడ్జింగ్ పేరిట లెక్కా పత్రం లేకుండా నిధులు వినియోగించారు. రాజకీయ పునరావాసం కోసమే కులాల పేరిట కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.
Also Read
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- OTR : ఉమ్మడి విశాఖ కూటమి పార్టీల్లో విచిత్ర ధోరణి
స్మార్ట్ సిటీల ఛైర్మన్ నియామకాలు చెల్లవని ప్రభుత్వానికి ఇప్పటికి తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చెంప పెట్టు అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్. తప్పు తెలుసుకుని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ల ఛైర్మన్లతో సీఎం రాజీనామా చేయించారు. టీటీడీ బోర్డును సైతం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. తిరుమలలో సామాన్య భక్తులకు దర్శనాలు దొరకని పరిస్థితి నెలకొంది. టీటీడీ నిబంధనల ప్రకారమే సభ్యులను నియమించాలి.
ప్రత్యేక ఆహ్వానితుల ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలి. టీటీడీ ఆస్తులను ప్రభుత్వం లాక్కుంది. ప్రభుత్వం తీసుకున్న ఆస్తులు తక్షణమే వెనక్కి ఇచ్చేయాలి. సీపీఎస్ పై మాట్లాడేందుకు ప్రభుత్వానికి ధైర్యం లేదు. ప్రభుత్వానికి ధైర్యముంటే సీపీఎస్ రద్దు చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Peddi : చరణ్ కోసం బాలయ్య రంగంలోకి దిగుతున్నారా?..
-
Xiaomi 17 Max: 8000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో.. షియోమీ 17 మ్యాక్స్ విడుదల
-
Sai Abhyankar: ట్రోల్స్ను ట్రెండ్గా మార్చిన సాయి అభ్యంకర్..
-
Bike Insurance: బైక్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఫైన్ మాత్రమే కాదు.. భారీ నష్టాలు కూడా
-
Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!