PVN Madhav: స్మార్ట్ గా దోచేశారు.. తిరిగిచ్చెయ్యండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. దీంతో ప్రభుత్వం తన తప్పు తెలుసుకుంది. స్మార్ట్ సిటీ ఛైర్మన్ల పదవులకు గండం ఏర్పడింది. ఈ నియామకాల్లో న్యాయపరమైన చిక్కులు తప్పేలా లేవు. దీంతో స్మార్ట్ సిటీ ఛైర్మన్ల వరుస రాజీనామాలకు తెరతీసింది ప్రభుత్వం. జీవీఎంసీ స్మార్ట్ సిటీ చైర్మన్ జీవీ రాజీనామా చేశారు.
సాంకేతికంగా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్లు నియామకాలు చెల్లవని ఆలస్యంగా గుర్తించింది రాష్ట్రప్రభుత్వం. స్మార్ట్ సిటీ కార్పోరేషన్ల ఛైర్మన్లు రాజీనామా చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. విశాఖ, తిరుపతి, కాకినాడ, ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ ల రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. స్మార్ట్ సిటీ కార్పోరేషన్ల పేరుతో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. కాకినాడలో మోడరనైజేషన్ పేరుతో భారీ మొత్తంలో ఖర్చు చేశారు. ఉపనదుల్లో డ్రెడ్జింగ్ పేరిట లెక్కా పత్రం లేకుండా నిధులు వినియోగించారు. రాజకీయ పునరావాసం కోసమే కులాల పేరిట కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
స్మార్ట్ సిటీల ఛైర్మన్ నియామకాలు చెల్లవని ప్రభుత్వానికి ఇప్పటికి తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చెంప పెట్టు అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్. తప్పు తెలుసుకుని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ల ఛైర్మన్లతో సీఎం రాజీనామా చేయించారు. టీటీడీ బోర్డును సైతం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. తిరుమలలో సామాన్య భక్తులకు దర్శనాలు దొరకని పరిస్థితి నెలకొంది. టీటీడీ నిబంధనల ప్రకారమే సభ్యులను నియమించాలి.
ప్రత్యేక ఆహ్వానితుల ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలి. టీటీడీ ఆస్తులను ప్రభుత్వం లాక్కుంది. ప్రభుత్వం తీసుకున్న ఆస్తులు తక్షణమే వెనక్కి ఇచ్చేయాలి. సీపీఎస్ పై మాట్లాడేందుకు ప్రభుత్వానికి ధైర్యం లేదు. ప్రభుత్వానికి ధైర్యముంటే సీపీఎస్ రద్దు చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!