సంక్రాంతి, క్రిస్మస్ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారికి గుడ్ న్యూస్ అందించింది. క్రిస్మస్, సంక్రాంతి పండగల దృష్ట్యా దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల్లో 60 రోజుల ముందుగా టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చే ప్రయాణికుల డిమాండ్ను బట్టి ప్రస్తుతానికి ఏడు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి అమలాపురానికి మూడు, కాకినాడకు రెండు,…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గంజాయిని మించిన హాట్ టాపిక్ లేదు. పోలీసుల కళ్ళు గప్పి గంజాయి విద్యాసంస్థలకు సరఫరా అవుతోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయి,కాఫ్ సిరప్,టాబ్లెట్స్ లను విద్యాసంస్థలే లక్ష్యంగా యువతకు అమ్ముతున్న ముఠా ను 29వ తేదీన 2వ పట్టణ పోలీసులు పట్టుకున్నారు. విముక్తి కాలనీ సమీపంలో ఒక పాడుబడిన హాస్పిటల్ ప్రాంగణంలో ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు. మట్టి విజయ్ కుమార్…
కాకినాడ మేయర్పై ఇటీవల అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ అవిశ్వాస తీర్మానంలో సభ్యుల విశ్వాసం కోల్పోవడంతో పావని మేయర్ పదవిని కోల్పోయారు. అయితే, ఈ అవిశ్వాస తీర్మానంపై మేయర్ గతంలో కోర్టుకు వెళ్లారు. తీర్మానం ప్రవేశ పెట్టి ఓటింగ్ జరిగినప్పటికీ, ఆ ఫలితాలను ఈనెల 22 వరకు ప్రకటించ వద్దని హైకోర్టు పేర్కొన్నది. కానీ, ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం హడావుడిగా కాకినాడ మేయర్ను తొలగిస్తూ గెజిట్ను విడుదల చేసింది. దీనిపై మండిపడ్డ పావని, కేసు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప : ది రైజ్” సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మారేడు మిల్లిలో ఈ సినిమా చివరి షెడ్యూల్ ను పూర్తి చేయాల్సి ఉంది. కానీ వర్షాల కారణంగా అక్కడ లొకేషన్ ను వదిలేసి కాకినాడకు వెళ్లారు చిత్రబృందం. ఈ క్రమంలోనే గోకవరం సమీపంలో ఉన్న ఓ చిన్న హోటల్ వద్ద ఆగి అల్పాహారం తీసుకున్నాడు అల్లు అర్జున్. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.…
అక్కడ పాగా వేయడానికి రెండేళ్లుగా ఎదురు చూస్తోంది అధికారపార్టీ. ఇప్పుడా ముహూర్తం దగ్గర పడిందా? మేయర్ పీఠాన్ని కైవశం చేసుకుంటుందా? జరుగుతున్న పరిణామాలు.. వస్తున్న సంకేతాలు.. పొలిటికల్ ఎత్తుగడలను బలపరుస్తున్నాయా? ఇంతకీ ఏంటా కార్పొరేషన్.. ఏమా కథ? 15తో నాలుగేళ్లు పూర్తికానున్న పావని మేయర్ పదవీకాలం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు లేకపోయినా.. మేయర్ పీఠంపై అధికారపార్టీ వైసీపీ గురిపెట్టడమే ఆ వేడి సెగలకు కారణం. ఈ…
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ వర్శిటీ సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాకినాడ జెఎన్టీయూ గెస్ట్ హౌజ్ లో ఏకంగా శోభనం జరిపించడం కలకలం రేపుతోంది. ఓ గది లో నూతన వధువరులకు శోభనం తంతు నిర్వహించారట. ఈ నెల 18 న యూనివర్శిటీకి చెందిన మహిళ సాధికారిత డైరెక్టర్ పేరు మీద 201 నంబర్ గల రూమ్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ…
కాకినాడ స్థానిక డైరీ ఫారం సెంటర్ వద్ద గల బిస్ఎన్ ఫిల్లింగ్ స్టేషన్ నందు విక్రయిస్తున్న పెట్రోల్ కారణంగా గత మూడు రోజులుగా అనేక వాహనాలు చెడిపోవడం తో గత మూడు రోజుల గా వాహనదారులులు నిరసనలు తెలియజేస్తున్నారు, వాహనదారులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నా ,సివిల్ సప్లై అధికారులు ఏ మాత్రం తొంగి చూడకపోవడం తో వాహనదారులు సంబంధిత అధికారులు తీరు పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.సుమారు వందకు పైగా వాహనాలు చెడిపోగా,పది వాహనాలను…
ఆపరేషన్ కాకినాడలో వైసీపీ వేగంగా పావులు కదుపుతోందా? రాజకీయ ఎత్తుగడలు.. వ్యూహాలు ఆసక్తిగా మారుతున్నాయా? త్వరలోనే టీడీపీకి మరో షాక్ ఇవ్వనుందా? కాకినాడలో కాకమీద ఉన్న రాజకీయాలు ఏం చెబుతున్నాయి? లెట్స్ వాచ్! కాకినాడ మేయర్ పీఠంపై వైసీపీ గురి! తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారపార్టీ వైసీపీ పూర్తిగా పట్టు సాధించింది. ఇటీవల జరిగిన రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీడీపీకి ఝలక్ ఇచ్చారు ఆ పార్టీ కార్పొరేటర్లు. 16 మంది టీడీపీ రెబల్…
నేటి నుంచి రాజమండ్రి – కాకినాడ నాన్స్టాప్ సర్వీసులు పునరుద్ధరణ జరిగింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తుండడంతో గత కొన్ని రోజులుగా ఈ రూటులో నాన్ స్టాప్ సర్వీసులు నిలిచిపోయాయి. కాకినాడకు రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉదయం 5.30కు తొలి సర్వీసు ప్రారంభం అయ్యింది. ఆఖరి సర్వీసు మధ్యాహ్నం 12.30కు బయలుదేరుతుంది. కాకినాడ డిపో నుంచి కూడా ఇదే సమయాల్లో రాజమండ్రికు నాన్స్టాప్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఇక ప్రతి…