ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్, ట్రోఫీని గెలుచుకోవడమే కాకుండా దేశంలోని ప్రతి మూల నుంచి యువ ప్రతిభను గుర్తిస్తూ తన మార్క్ ను చాటుకుంది. ముంబై ఇండియన్స్ (MI) స్కౌటింగ్ జట్టు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది టాలెంట్ ప్లేయర్స్ ను గుర్తించి అవకాశం ఇచ్చింది. ఈ ఆటగాళ్ళు ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడానికి సహాయపడటమే కాకుండా అంతర్జాతీయ క్రికెట్లో కూడా తమదైన ముద్ర వేశారు. ఐపీఎల్ 18వ సీజన్లో కూడా…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో శనివారం (మార్చి 29) జరిగే మ్యాచ్ నంబర్-9లో గుజరాత్ టైటాన్స్ (GT), ముంబై ఇండియన్స్ (MI) తలపడనున్నాయి. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ సీజన్లో గుజరాత్ తన తొలి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ (PBKS)తో 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరోవైపు, ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్…
Jasprit Bumrah: భారతీయ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన జస్ప్రీత్ బుమ్రా గాయంతో ఐపీఎల్ 2025 ప్రారంభంలో ముంబయి ఇండియన్స్కు అందుబాటులో ఉండడంలేదని ఆ జట్టు కోచ్ మహేల జయవర్ధనే తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ యార్కర్లతో ప్రత్యర్థులను కట్టడి చేసే బుమ్రా లేని లోటును ముంబయి ఇండియన్స్ ఎలా తట్టుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జస్ప్రీత్ బుమ్రా టీమిండియా బౌలింగ్ విభాగానికి వెన్నెముక. అతడు తన అద్భుతమైన బౌలింగ్తో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. 2016లో…
ముంబై ఇండియన్స్ తమ జట్టులో మార్పులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అల్లా గజన్ఫర్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నాడు. అయితే.. అతని స్థానంలో ముంబై ఇండియన్స్.. ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్ను జట్టులోకి తీసుకుంది.
అందరూ ఊహించిందే జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడడం లేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2025 చివరలో గాయపడ్డ బుమ్రా.. ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. వెన్ను గాయం వల్ల బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడని బీసీసీఐ మంగళవారం రాత్రి ఎక్స్లో తెలిపింది. అతడి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం జనవరిలో ప్రకటించిన జట్టులో జస్ప్రీత్…
2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. 8 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఐసిసి ఈవెంట్ కోసం భారత జట్టును ప్రకటించారు. అయితే, భారత జట్టులో చోటు దక్కించుకున్న స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం ఇప్పటికీ భారత జట్టుకు ఆందోళన కలిగించే అంశంగా మిగిలిపోయింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బరిలో దిగుతాడా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. మెగా టోర్నీలో బుమ్రా ఆడడంపై బీసీసీఐ మంగళవారం తుది నిర్ణయం తీసుకోనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులు చేర్పులకు నేటితో గడువు ముగుస్తుండంతో.. బుమ్రాపై ఏదో ఒక నిర్ణయం…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ కోసం ఇప్పటికే అన్ని టీమ్స్ తమ స్క్వాడ్లను ప్రకటించాయి. స్క్వాడ్లో మార్పులు చేసుకొనేందుకు అధికారికంగా ఇంకా మూడు రోజుల గడువు ఉంది. అయితే ఈ ఐసీసీ ట్రోఫీలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా? లేదా? అనేది ఇంకా తెలియరావడం లేదు. స్క్వాడ్లో మార్పులు చేసుకొనేందుకు గడువు ముగుస్తున్నా.. బుమ్రా ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ ఓ అంచనాకు రాలేకపోయింది. పేస్…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లాండ్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ నుంచి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను తొలగించారు. మంగళవారం భారత వన్డే జట్టు ప్రకటించినప్పుడు బుమ్రా పేరు జట్టులో లేదు.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు దక్కింది. ఐసీసీ అత్యున్నత పురస్కారం ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ (2024) అవార్డుకు బుమ్రా ఎంపికయ్యాడు. సర్ గ్యారిఫీల్డ్ సోబర్స్ పేరిట ఇచ్చే ఈ పురస్కారం కోసం బుమ్రాతో పాటు జో రూట్, హ్యారీ బ్రూక్, ట్రావిస్ హెడ్ పోటీ పడ్డారు. 2024లో భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో బుమ్రా అత్యంత కీలక ప్రాత పోషించాడు. మరోవైపు గతేడాది టెస్టుల్లో స్వదేశం, విదేశం అని…