AP Assembly Session: రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి… రేపు ఉదయం 9 గంటలకు శాసన సభ… 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి… సభ ఎన్ని రోజులు జరగాలి.. అనే అంశంపై బీఏసీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఉదయం 10 గంటలకు మండలి సమావేశం ప్రారంభం అవుతుంది… అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది…. అసెంబ్లీ సమావేశాలు నిర్మాణకు…
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్నారు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.. తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. భారత దేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందినా.. ఆ ఫలాలు పొందటానికి తెలంగాణ ప్రజలకు మరో 13 నెలలు సమయంపట్టిందని గుర్తుచేశారు.. నిజాం నిరంకుశ పాలనపై భారత ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో సాగిన పోలీస్ యాక్షన్ మూలంగా తెలంగాణకు స్వేచ్ఛ…
Janasena: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆదేశానుసారం మచిలీపట్నంలో చోటు చేసుకున్న పరిణామంపై అంతర్గత విచారణ ప్రారంభించనున్నట్లు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. శాసన మండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మన్, ఏపీ ఎం.ఎస్.ఐ.డి.సి. ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస రావు, మచిలీపట్నం జనసేన నాయకుడు వికృతి శ్రీనివాస్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మచిలీపట్నం నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణతోనూ మాట్లాడి…
ఇక మనం వేగం పెంచాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ మంత్రుల సమావేశంలో కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించిన ఆయన.. ఐదేళ్ల వైసీపీ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం.. ఇక మనం వేగం పెంచాల్సిన సమయం ఆసన్నమైంది.. అందుకే కొత్త టీమ్ ను ఏర్పాటు చేసుకున్నాం అన్నారు..
ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడవద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీలో జరుగుతోన్న తాజా పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. రాష్ట్రంలో అభివృద్ధి దిశగా... సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయి.
టీడీపీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే వన్ టు వన్ మీటింగ్స్తో కొందరికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక వీలున్నప్పుడల్లా నలుగురైదుగురు శాసనసభ్యులను పిలిచి క్లాస్ పీకుతున్నారు.
పవన్ కల్యాణ్పై ఫైర్ అయ్యారు వైసీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర.. రాజ్యాంగం గురించి మాట్లాడే పవన్ కల్యాణ్కు అసలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దారుణాలు కనడుతున్నాయా? అని ప్రశ్నించారు..
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ బాపట్ల జిల్లా పర్యటన రద్దైంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లాలో కూడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియరైంది. దానికి సంబంధించి సర్కార్కు పలు సూచనలు ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. మున్సిపల్, పంచాయితీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్కు సిద్ధం కావాలంటూ... ఒక షెడ్యూల్తో కూడిన వివరాలు అందజేసింది కమిషన్. వచ్చే ఏడాది జనవరిలోపు మున్సిపాలిటీలకు, ఆ తర్వాత జులైలోపు పంచాయతీలు, జడ్పిటిసి....ఎంపిటిసీలకు ఎన్నికలు జరపాలని సూచించింది.
సూపర్ సిక్స్-సూపర్ హిట్ పేరుతో విజయోత్సవ సభను ఈనెల 10న అనంతపురంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. భారీ ఎత్తున ఈ సభ జరగనున్న నేపథ్యంలో పోలీసులు కీలక సూచనలు చేశారు.. ఈనెల 10వ తేదీన అనంతపురంలో జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభ నేపథ్యంలో ఆ ఒక్కరోజు వాహనదారులు ఈకింది ఆంక్షలు పాటించి పోలీసులతో సహకరించాలని కోరారు జిల్లా ఎస్పీ పి.జగదీష్..