Pawan Kalyan: గుర్తింపు కోసం నేను పనిచేయను.. ప్రజల కోసం మాత్రమే పనిచేస్తా!
- కూటమి ప్రభుత్వం కేంద్రానికి బలం అయ్యింది
- కార్యకర్తలకు గుర్తింపు కష్టపడితే వస్తుంది
- నాకు పదవి అలంకరణ కాదు.. ఓ బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరులో డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఏపీ వ్యాప్తంగా కొత్త డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా డీడీవో కార్యాలయాలను ప్రారంభించారు. పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి సంస్కరణలో భాగంగా రాష్ట్రంలో 77 డీడీవో ఆఫీసులను ప్రారంభించాం అని, విస్తృతంగా ప్రజలకు సేవలందించడానికి డీడీవో ఆఫీసులు ఉపయోగపడుతాయన్నారు. సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించడానికి ఈ కార్యాలయాలు ఉపయోగపడతాయి పవన్ కళ్యాణ్ చెప్పారు.
చిత్తూరు కార్యకర్తల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ‘కూటమి ప్రభుత్వం కేంద్రానికి బలం అయ్యింది. కార్యకర్తలకు గుర్తింపు కష్టపడితే వస్తుంది. గుర్తింపు కోసం నేను పనిచేయను.. ప్రజల కోసం మాత్రమే పనిచేస్తా. నాకు పదవి అలంకరణ కాదు.. ఓ బాధ్యత. ప్రభుత్వ ఉద్యోగి ఇంటిలో పదోన్నతులపై ఎంతో ఆసక్తి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులనేది చాలా కీలకం. ఉద్యోగుల పాత్ర తెలుసు కాబట్టి పదివేల మంది ఉద్యోగులకు ఒకేసారి పదోన్నతులు కల్పించాం. గోంతు లేని వారికి మనం గోంతు అవ్వాలి, వారికోసం బలంగా నిలబడాలి. జీవితంలో రిస్క్ తీసుకుంటునే విజయం సాధించగలం. అది కూటమి ప్రభుత్వం చేసి చూపించింది. 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం అధికారికంలో ఉంటుంది. గత ఇరవై సంవత్సరాలలో కోట్లాది రూపాయల ఎర్రచందనం తరలించి సోమ్ము చేసుకున్నారు. 2008 నుండి రాజకీయాల్లో ఉన్నాను.. చంద్రబాబు లాంటి వారిని కుప్పం రాకుండా అడ్డుకున్నారు. ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోకుడదు.. ప్రజలు అన్నింటిని దైర్యంగా ఎదుర్కొవాలి. కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు తీరుతాయి. జనసేన కార్యకర్తలకు పరిపాలన పరంగా అనుభవం లేకపోవచ్చు కాని సమాజం కోసం కసిగా చేస్తారు. పార్టీ పరంగా ప్రతి నియోజకవర్గంలో ఓ కమీటి ఎర్పాటు చేస్తాం’ అని అన్నారు.
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!