Kodali Nani: ప్రభుత్వ కుట్రలను అడ్డుకునేందుకు జగన్ పోరాటాన్ని మొదలుపెట్టారు..
- రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య- విద్యను అందించాలని మెడికల్ కాలేజీలను నిర్మించాం..
- కూటమి ప్రభుత్వం జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తుంది: కొడాలి నాని
Kodali Nani: సుదీర్ఘ విరామం తర్వాత.. క్రియశీల గుడివాడ రాజకీయాల్లో మాజీమంత్రి కొడాలి నాని ప్రత్యక్షమైయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమంలో మొదటిసారి పాల్గొన్నారు. ఎన్నికల్లో ఓటమి, అనారోగ్య సమస్యలతో 18 నెలలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు కొడాలి నాని. ఇక, గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందించే వినతి పత్రంలో సంతకం చేశారు. వినతి పత్రాలను జిల్లా కమిటీకి అందించే పార్టీ శ్రేణుల ర్యాలీకి జెండా ఊపి కొడాలి నాని ప్రారంభించారు.
Read Also: Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం.. ఇలా ఎందుకు జరిగిందని కేంద్రానికి ప్రశ్న
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని పార్టీ శ్రేణులతో ఉత్సాహంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య- విద్య అందాలనే మంచి సంకల్పంతో.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలో ఏర్పాటుకు పునుకున్నారు.. తమ పాలనలో ఐదు కళాశాలలు పూర్తి చేయగా.. మరో ఐదు కళాశాలల నిర్మాణం తుది దశకు చేరుకున్నాయి.. పేద ప్రజలు, విద్యార్థులకు ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, హాస్పిటల్స్ ప్రైవేటీకరణ దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వ కుట్రను అడ్డుకునేందుకు మాజీ సీఎం జగన్ ప్రజలతో కలిసి పోరాటాన్ని మొదలు పెట్టారని పేర్కొన్నారు. తాము తలపెట్టిన ఉద్యమానికి ప్రజల నుంచి చక్కటి స్పందన వచ్చింది.. ప్రజల విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.. ప్రజాభిష్టానికి అనుకూలంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరుతాము.. ఉద్యమంలో తాము సేకరించిన పత్రాలను.. వైసీపీ అధినేత జగన్ నాయకత్వంలో గవర్నర్ కు అందిస్తామని కొడాలి నాని వెల్లడించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో