రెండు రోజుల విరామం తరువాత అమర్ నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం అయింది. ఇటీవల జరిగిన వరదల కారణంగా 16 మంది చనిపోవడంతో పాటు 40 మంది గల్లంతయ్యారు. వీరి కోసం రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఓ వైపు సహాయ చర్యలు కొనసాగుతుంటే మరోవైపు అమర్ నాథ్ యాత్రకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. మంచు శివ లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు సమాయత్తం అయ్యారు. ఈ రోజు బేస్ క్యాంపు నుంచి 12వ బ్యాచ్ అమర్ నాథ్ యాత్రకు…
జమ్మూ కాశ్మీర్ అమర్ నాథ్ లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అమర్ నాథ్ పరిసరాల్లో వరదలు సంభవించాయి. అమర్ నాథ్ గుహవద్దకు వరద నీరు చేరింది. దీంతో ఇప్పటి వరకు 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం. ఇప్పటికే ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రెస్క్యూ ఆపరేషన్ ను మొదలుపెట్టారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో అమర్ నాథ్ పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వరదలు ముంచెత్తాయి.…
జమ్మూ కాశ్మీర్ లో నెమ్మనెమ్మదిగా పరిస్థితులు మారుతున్నాయి. గతంలో టెర్రరిస్టులకు గ్రామాల్లో ఆశ్రయం కల్పించే వారు అక్కడి ప్రజలు. గ్రామాల్లో షెల్టర్ తీసుకుంటూ సైన్యం, పోలీసులు, అమాయక ప్రజలపై దాడులు చేసేవారు. అయితే తాజాగా ఆదివారం రోజు కాశ్మీర్ లోని ఓ గ్రామం ప్రజలు ఇద్దరు లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలకు పట్టించారు. రియాసి జిల్లా తుక్సాన్ గ్రామ ప్రజలు ఆయుధాలతో ఉన్న ఇద్దరు ఎల్ఈటీ ఉగ్రవాదులను పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి రెండు ఏకే రైఫిళ్లు,…
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్ర నేటి (జూన్ 30) నుంచి ప్రారంభం కానుంది. గత రెండేళ్లుగా అమర్ నాథ్ యాత్ర జరగలేదు. 2019లో జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370, 35ఏ ను ఎత్తేసింది. దీంతో భద్రతా కారణాల వల్ల అమర్ నాథ్ యాత్ర కాలపరిమితిని తగ్గించారు. 2020,2021లో కరోనా మహమ్మారి కారణంగా యాత్ర పూర్తిగా జరగలేదు. దాదాపుగా రెండేళ్ల విరామం అమర్ నాథ్ యాత్రం నేడు ప్రారంభం కానుంది. ఇప్పటికే యాత్ర…
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్ర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. మంచురూపంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఏకంగా ఇప్పటి వరకు సుమారుగా 3 లక్షల మంది వరకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు శ్రీ అమర్ నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు( ఎస్ఏఎస్బీ) వెల్లడించింది. 43 రోజుల యాత్ర కోసం యాత్రికుల నమోదును ఏప్రిల్ 11న ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు చెందిన 566…
జమ్ము & కశ్మీర్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్స్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారా, కుల్గాం జిల్లాల్లో ఈ ఎన్కౌంటర్స్ని నిర్వహించారు. మరణించిన ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్తాన్కు చెందినవాడని, లష్కరే తోయిబా సంస్థ కోసం పని చేస్తున్నాడని తెలిసింది. కొంతకాలం క్రితం అరెస్ట్ చేసిన షౌకత్ అహ్మద్ షేక్ అనే ఉగ్రవాది ఇచ్చిన సమాచారం ఆధారంగా.. సైన్యంతో కలిపి పోలీసులు కుప్వారా జిల్లా లోలబ్ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదుల శిబిరాల్ని గుర్తించి, చుట్టుముట్టారు. ఇది…
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. వరసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లలో ఉగ్రవాదులను లేపేస్తున్నాయి భద్రతా బలగాలు. ఇటీవల కాలంలో దాదాపుగా రోజు ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా కాశ్మీర్ లోని బెమీనా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి బలగాలు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులను నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఎన్ కౌంటర్ లో ఒక పోలీసుకు స్వల్పగాయాలయ్యాయి. గతంలో సోపోర్ ఎన్…
భారతదేశ సరిహద్దులు దాటొచ్చిని ముష్కరులకు భారత భద్రత దళాలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అయితే తాజాగా.. పుల్వామాలోని ద్రాబ్గామ్ ప్రాంతంలో మరో ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు హతమార్చాయి. శనివారం సాయంత్రం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైన విషయం తెలిసిందే. అయితే.. దీంతో ఈ సంఖ్య మూడుకు చేరింది. వారంతా లష్కరే తొయీబాకు చెందిన ఉగ్రవాదులని కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. వారిని ఫాజిల్ నజీర్…
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ఉద్రిక్తలకు కారణం అవుతున్నాయి. ఇదిలా ఉంటే చాలా మంది ఈ వ్యాఖ్యల వీడియోను వైరల్ చేసి భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ఇప్పటికే నుపుర్ వ్యాఖ్యలపై శుక్రవారం రోజు ఢిల్లీ, యూపీలోని ప్రయాగ్ రాజ్, షహరాన్ పూర్ తో జార్ఖండ్ రాంచీ, బెంగాల్ హౌరాలో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రయాగ్ రాజ్, హౌరాలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇదిలా ఉంటే కాశ్మీర్ కు…