Jammu And Kashmir: ప్రత్యేక ఆపరేషన్.. నలుగురు ఉగ్రవాదులు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్ము & కశ్మీర్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్స్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారా, కుల్గాం జిల్లాల్లో ఈ ఎన్కౌంటర్స్ని నిర్వహించారు. మరణించిన ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్తాన్కు చెందినవాడని, లష్కరే తోయిబా సంస్థ కోసం పని చేస్తున్నాడని తెలిసింది. కొంతకాలం క్రితం అరెస్ట్ చేసిన షౌకత్ అహ్మద్ షేక్ అనే ఉగ్రవాది ఇచ్చిన సమాచారం ఆధారంగా.. సైన్యంతో కలిపి పోలీసులు కుప్వారా జిల్లా లోలబ్ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదుల శిబిరాల్ని గుర్తించి, చుట్టుముట్టారు. ఇది గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అందుకు ధీటుగా భద్రతా సిబ్బంది జవాబివ్వడంతో.. ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. వీరిలో ఒకరు పాకిస్తాని ఉగ్రవాది అని ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. సరిగ్గా ఇలాంటి ఎదురుకాల్పులే కుల్గాం జిల్లా దమ్హల్ హంజీపొర ప్రాంతంలోనూ జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. పారిపోయిన ఇతర ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అంతకుముందు బారాముల్లా క్రీరి ప్రాంతంలోని నాజీబాత్ వద్ద ఎన్కౌంటర్ నిర్వహించగా.. ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు కార్డర్ సెర్చ్ను ప్రారంభించాయి. ఈ సందర్భంగా ఓ పోలీస్ అధికారి కూడా అమరుడయ్యారు. హతమైన ఉగ్రవాదుల్ని జైష్-ఏ-మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా గుర్తించారు. గత నాలుగు నెలలుగా వాళ్లు యాక్టివ్గా ఉన్నారని, ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఉగ్రవాదుల్ని ఏరిపారేయాల్ని కంకణం కట్టుకున్న భద్రతా బలగాలు.. ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!