Home
Jammu Kashmir
Jammu Kashmir News
-
Terrorist Attack : ఉగ్రాదాడిలో టీవీ నటి మృతి..
ఉగ్రవాదుల తూటకు ఓ టీవీ నటి బలైంది. జమ్మూకాశ్మీర్లో బుధవారం రాత్రి మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బూద్గామ్ జిల్లాలో సామాన్య పౌరుల ఇళ్లను టార్గెట్ చేసి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఓ ఇంట్లో ఉన్న టీవీ నటి అమ్రీన్ భట్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అమ్రీన్ భట్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించడంతో అమ్రీన్ భట్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఆమె పదేళ్ల మేనల్లుడు… -
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్… ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా క్రీరి ప్రాంతంలోని నాజీబాత్ వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతం అయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమచారంలో భద్రతా బలగాలు కార్డర్ సెర్చ్ ను ప్రారంభించాయి. ఇదే సమయంలో ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య కాల్పులు జరగడంతో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఎన్ కౌంటర్ లో ఒక పోలీస్ అధికారి కూడా అమరుడయ్యారు. హతమైన ఉగ్రవాదులను జైష్… -
Jammu Kashmir: సొరంగం కూలి ప్రమాదం… మొత్తం 10 మంది కూలీల దుర్మరణం
జమ్మూ కాశ్మీర్ రాంబన్ ఖూలీనలాలో నిర్మాణంలో ఉన్న సొరంగం శుక్రవారం కూలింది. జమ్మూ- శ్రీనగర్ మార్గంలో హైవే నిర్మాణ పనుల్లో భాగంగా చేపడుతున్న సొరంగం నిర్మాణం కూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న10 మంది కూలీలు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటి వరకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లో ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయింది. దీంతో అందులో పని చేస్తున్న పది మంది కూలీలు… -
Jammu Kashmir: కాశ్మీర్ పై పాక్ జాతీయ అసెంబ్లీ తీర్మానాన్ని వ్యతిరేఖించిన ఇండియా
పీకల్లోతు ఆర్థిక సమస్యలు, అంతర్గత, రాజకీయ సమస్యలతో సతమతం అవుతున్న పాకిస్తాన్ మరోసారి తన బుద్ధిని బయటపెట్టింది. జమ్మూ కాశ్మీర్ లో నియోజవర్గాల డీలిమిటేషన్ పై వ్యతిరేఖంగా పాక్ జాతీయ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేఖించింది ఇండియా. భారత దేశంలో భాగం అయిన జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కు వ్యతిరేఖంగా పాక్ చేసిన తీర్మానాన్ని హస్య తీర్మాణంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ తో పాటు భారత భూభాగాలతో… -
Jammu Kashmir: కట్రా వద్ద బస్సులో మంటలు… నలుగురు మృతి
జమ్మూలో ఘోర ప్రమాదం జరిగింది. కట్రా నుంచి జమ్మూకు వెల్లే బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 22 మంది గాయపడ్డారు. బస్సులో మంటలు చెలరేగిన వెంటనే ఇద్దరు ప్రయాణికులు సజీవ దహనం కాగా… మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంజిన్ నుంచి మంటలు రావడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన కొద్ది సమయంలోనే… -
Jammu Kashmir: కాశ్మీరీ పండిట్ ను చంపిన టెర్రరిస్టులను లేపేసిన భద్రతా బలగాలు
కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్ హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాయి భద్రతా బలగాలు. గురువారం రాహుల్ భట్ ను తన కార్యాలయంలో కాల్చి చంపిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు శుక్రవారం జరిగిని ఎన్ కౌంటర్ లో లేపేశాయి. ఒక రోజు వ్యవధిలోనే ఉగ్రవాదులను ట్రాక్ చేసి ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టారు. గురువారం బుద్గాం జిల్లా చదూరా తాహసీల్ కార్యాలయంలో రాహుల్ భట్ క్లర్క్ గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు టెర్రరిస్టులు కార్యాలయానికి వచ్చి రాహుల్… -
Jammu Kashmir: కాశ్మీర్లో పండిట్ల ఆందోళన…
జమ్మూ కాశ్మీర్ లో గురువారం ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ప్రభుత్వం ఉద్యోగి అయిన కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్ ను కార్యాలయంలోనే హత్య చేశారు. బుద్గాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చాదూరా పట్టణంలోని తహసీల్ కార్యాలయంలో అక్కడ క్లర్క్ గా పనిచేస్తున్న రాహుల్ భట్ ను దగ్గర నుంచి షూట్ చేశారు. ఉగ్రవాదాలు రాహుల్ భట్ ఎవరని ఆరా తీస్తూ… కాల్పులు జరిపారు. తాజాగా శుక్రవారం రాహుల్ భట్ అంత్యక్రియలు జరిగాయి. కాశ్మీర్ లోని పండిట్లు పెద్ద… -
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో దారుణం… కాశ్మీర్ పండిట్ ను చంపిన టెర్రరిస్టులు
జమ్మూ కాశ్మీర్ లో దారుణం చోటు చేసుకుంది. ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బుద్గాం జిల్లాలో గురువారం కాశ్మీర్ పండిట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. చదూరా ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న రాహుల్ భట్ పై కార్యాలయంలోనే దాడి చేసి హతమార్చారు. ఉగ్రవాదులు చాదూరా పట్టణంలోని తహసీల్ కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడ క్లర్క్ గా పనిచేస్తున్న రాహుల్ భట్ పై కాల్పులు జరిపారు. ఘటన అనంతరం రాహుల్ భట్ ను శ్రీనగర్ లోని శ్రీ మహారాజా హరిసింగ్… -
Jammu Kashmir: పాక్ సరిహద్దులను జల్లెడపడుతున్న భద్రతాబలగాలు
జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370, 35ఏ ఎత్తేసిన తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు చాలా వరకు తగ్గాయి. ఎప్పటికప్పుడు లష్కరే తోయిబా, జైష్ ఏ మహమ్మద్, ది రెసిస్టెంట్ ఫోర్స్ వంటి ఉగ్రవాద సంస్థలు తమ ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నా… భద్రతా బలగాలు వరసగా ఎన్ కౌంటర్లు చేసి ఉగ్రవాదులను మట్టుపెడుతున్నాయి. సరిహద్దుల వెంబడి పాక్ నుంచి వచ్చే ఉగ్రవాదుల సంఖ్య చాలా వరకు తగ్గింది. భద్రతా బలగాలు సరిహద్దుల వెంబడి నిఘా పెంచడంతో చాలా వరకు… -
PM Narendra Modi: జమ్మూ కాశ్మీర్లో రూ.20వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించాం
ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ సరిహద్దులోని సాంబా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు రూ.20వేల కోట్ల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఢిల్లీ-అమృత్ సర్-కాత్రా ఎక్స్ ప్రెస్ వేకు ఆయన శంకుస్థాపన చేశారు. పల్లీ గ్రామంలో 500 కిలోవాట్ల సౌర విద్యుత్…
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!