YS Jagan: చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు.. దేవుడిపై భక్తి లేదు.. ఆలయాలపై శ్రద్ధ కూడా లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తీ లేదు, ఆలయాల నిర్వహణ పట్ల శ్రద్ధ లేదంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.. అత్యంత నిష్ఠతో, బాధ్యతతో చేయాల్సిన టీటీడీ ఛైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నియమించి ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా చేస్తున్నారని ఎక్స్ లో ట్వీట్ చేశారు.. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత.. అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత.. అలాంటి టీటీడీ ఛైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలి. కానీ, చంద్రబాబు గారు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్ఠను మంటగలిపేలా వ్యవహరించారని దుయ్యబట్టారు.. చంద్రబాబుకి భక్తీ లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు.. దేవుడిపట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైందని విమర్శించారు..
లడ్డూ నెయ్యి వివాదం
తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యి నాణ్యతపై కూడా జగన్ ఆరోపణలు చేశారు. టీటీడీ ల్యాబ్ నాణ్యత బాగోలేదని తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు మళ్లీ వేరే పేర్లతో టీటీడీకి వచ్చాయని తెలిపారు. ఈ అంశంపై సీబీఐ-సిట్ ఛార్జిషీట్లలో కూడా ప్రస్తావన ఉందని చెప్పారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి దానిని ఇతరులపై నెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. 2014-19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర రూ.278 నుండి రూ.330 మధ్యలో ఉండేదని, 2019-24 మధ్య కూడా సగటు ధర దాదాపు అంతేనని తెలిపారు. అయితే హెరిటేజ్కు చెందిన ఇందాపూర్ డెయిరీకి కిలో నెయ్యి రూ.658కి టెండర్ కేటాయించారని ఆరోపించారు. ఇది స్కాం కాదా అని ప్రశ్నించారు.
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
దేవుడి పట్ల భక్తి ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోరని, ఆలయ పవిత్రతను కాపాడే ఉద్దేశం ఉంటే ఇలాంటి నియామకాలు, కొనుగోళ్లు జరగవని జగన్ వ్యాఖ్యానించారు. ఆలయాల నిర్వహణలో భక్తి, నిష్ఠ, నిజాయితీ అవసరమని, అవి లేకపోవడం వల్లే ఈ వివాదాలు తలెత్తుతున్నాయని అన్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత, అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ ఛైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత,…
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 4, 2026
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!