YS Jagan: చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు.. దేవుడిపై భక్తి లేదు.. ఆలయాలపై శ్రద్ధ కూడా లేదు..!
YS Jagan: ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తీ లేదు, ఆలయాల నిర్వహణ పట్ల శ్రద్ధ లేదంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.. అత్యంత నిష్ఠతో, బాధ్యతతో చేయాల్సిన టీటీడీ ఛైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నియమించి ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా చేస్తున్నారని ఎక్స్ లో ట్వీట్ చేశారు.. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత.. అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత.. అలాంటి టీటీడీ ఛైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలి. కానీ, చంద్రబాబు గారు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్ఠను మంటగలిపేలా వ్యవహరించారని దుయ్యబట్టారు.. చంద్రబాబుకి భక్తీ లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు.. దేవుడిపట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైందని విమర్శించారు..
లడ్డూ నెయ్యి వివాదం
తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యి నాణ్యతపై కూడా జగన్ ఆరోపణలు చేశారు. టీటీడీ ల్యాబ్ నాణ్యత బాగోలేదని తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు మళ్లీ వేరే పేర్లతో టీటీడీకి వచ్చాయని తెలిపారు. ఈ అంశంపై సీబీఐ-సిట్ ఛార్జిషీట్లలో కూడా ప్రస్తావన ఉందని చెప్పారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి దానిని ఇతరులపై నెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. 2014-19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర రూ.278 నుండి రూ.330 మధ్యలో ఉండేదని, 2019-24 మధ్య కూడా సగటు ధర దాదాపు అంతేనని తెలిపారు. అయితే హెరిటేజ్కు చెందిన ఇందాపూర్ డెయిరీకి కిలో నెయ్యి రూ.658కి టెండర్ కేటాయించారని ఆరోపించారు. ఇది స్కాం కాదా అని ప్రశ్నించారు.
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
- Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
- School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
- AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
దేవుడి పట్ల భక్తి ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోరని, ఆలయ పవిత్రతను కాపాడే ఉద్దేశం ఉంటే ఇలాంటి నియామకాలు, కొనుగోళ్లు జరగవని జగన్ వ్యాఖ్యానించారు. ఆలయాల నిర్వహణలో భక్తి, నిష్ఠ, నిజాయితీ అవసరమని, అవి లేకపోవడం వల్లే ఈ వివాదాలు తలెత్తుతున్నాయని అన్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత, అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ ఛైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత,…
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 4, 2026
తాజావార్తలు
-
Census 2026 Scam Alert: జాగ్రత్త! జనాభా లెక్కల పేరుతో మోసం.. ఈ వివరాలను పంచుకోవద్దు.. ఏం చేయాలో తెలుసుకోండి
-
Raashii Khanna: పోలీస్ ఆఫీసర్గా రాశీ ఖన్నా.. ‘లుఖ్కే’ వెబ్ సిరీస్ క్రేజీ అప్డేట్!
-
Kollywood: తమిళనాట నిలిచిపోయిన షూటింగ్స్.. నిర్మాతల సంచలన నిర్ణయం!
-
CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
-
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికలు.. మే 4న కేవలం 293 స్థానాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు.. కారణం ఏమిటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!