Amarnath Yatra: యాత్ర కోసం 3 లక్షల మంది భక్తుల రిజిస్ట్రేషన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్ర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. మంచురూపంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఏకంగా ఇప్పటి వరకు సుమారుగా 3 లక్షల మంది వరకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు శ్రీ అమర్ నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు( ఎస్ఏఎస్బీ) వెల్లడించింది. 43 రోజుల యాత్ర కోసం యాత్రికుల నమోదును ఏప్రిల్ 11న ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు చెందిన 566 శాఖల ద్వారా రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. యాత్ర ముగిసే వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి.
రెండు మార్గాల ద్వారా యాత్ర ప్రారంభం కానుంది. దక్షిణ కాశ్మీర్ లోని పహల్గామ్ లోని 48 కిలోమీటర్ల నున్వాన్ నుంచి, సెంట్రల్ కాశ్మీర్ లోని గందర్ బాల్ లోని 14 కిలోమీటర్ల బాల్తాల్ మార్గం ద్వారా యాత్ర కొనసాగనుంది. కరోనా మహమ్మారి వల్ల గత రెండేళ్ల నుంచి అమర్ నాథ్ యాత్ర జరగలేదు. రెండేళ్ల విరామం తరువాత ఇప్పుడే మొదలైంది. 13 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారు 75 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు ఆరువారాల కన్నా ఎక్కవ గర్భం దాల్చిన స్త్రీలు యాత్రకు అనుమతించబడరు. అమర్ నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభం అయి ఆగస్టు 11న ముగియనుంది.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ఇదిలా ఉంటే యాత్ర ప్రారంభం దగ్గర పడుతుండటంతో జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు హై అలర్ట్ గా ఉన్నాయి. ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉండటంతో అంతర్జాతీయ బార్డర్ ను జల్లెడ పడుతున్నారు. దీని కోసం ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సరిహద్దుల వెంబడి గస్తీని పెంచారు. యాత్ర మార్గంలో సీసీ కెమెరాలు, యాంటీ డ్రోన్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. కరోనా కన్నా ముందు 2019లో 3.42 లక్షల మంది ప్రజలు శివలింగాన్ని దర్శించుకున్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!