Amarnath Yatra: యాత్ర కోసం 3 లక్షల మంది భక్తుల రిజిస్ట్రేషన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్ర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. మంచురూపంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఏకంగా ఇప్పటి వరకు సుమారుగా 3 లక్షల మంది వరకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు శ్రీ అమర్ నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు( ఎస్ఏఎస్బీ) వెల్లడించింది. 43 రోజుల యాత్ర కోసం యాత్రికుల నమోదును ఏప్రిల్ 11న ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు చెందిన 566 శాఖల ద్వారా రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. యాత్ర ముగిసే వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి.
రెండు మార్గాల ద్వారా యాత్ర ప్రారంభం కానుంది. దక్షిణ కాశ్మీర్ లోని పహల్గామ్ లోని 48 కిలోమీటర్ల నున్వాన్ నుంచి, సెంట్రల్ కాశ్మీర్ లోని గందర్ బాల్ లోని 14 కిలోమీటర్ల బాల్తాల్ మార్గం ద్వారా యాత్ర కొనసాగనుంది. కరోనా మహమ్మారి వల్ల గత రెండేళ్ల నుంచి అమర్ నాథ్ యాత్ర జరగలేదు. రెండేళ్ల విరామం తరువాత ఇప్పుడే మొదలైంది. 13 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారు 75 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు ఆరువారాల కన్నా ఎక్కవ గర్భం దాల్చిన స్త్రీలు యాత్రకు అనుమతించబడరు. అమర్ నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభం అయి ఆగస్టు 11న ముగియనుంది.
Also Read
- Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
- UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు
- Ayodhya: "వాష్రూమ్లలో డబ్బు దాచాం".. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
ఇదిలా ఉంటే యాత్ర ప్రారంభం దగ్గర పడుతుండటంతో జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు హై అలర్ట్ గా ఉన్నాయి. ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉండటంతో అంతర్జాతీయ బార్డర్ ను జల్లెడ పడుతున్నారు. దీని కోసం ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సరిహద్దుల వెంబడి గస్తీని పెంచారు. యాత్ర మార్గంలో సీసీ కెమెరాలు, యాంటీ డ్రోన్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. కరోనా కన్నా ముందు 2019లో 3.42 లక్షల మంది ప్రజలు శివలింగాన్ని దర్శించుకున్నారు.
తాజావార్తలు
-
Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
-
Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..