Amarnath Yatra: యాత్ర కోసం 3 లక్షల మంది భక్తుల రిజిస్ట్రేషన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్ర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. మంచురూపంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఏకంగా ఇప్పటి వరకు సుమారుగా 3 లక్షల మంది వరకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు శ్రీ అమర్ నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు( ఎస్ఏఎస్బీ) వెల్లడించింది. 43 రోజుల యాత్ర కోసం యాత్రికుల నమోదును ఏప్రిల్ 11న ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు చెందిన 566 శాఖల ద్వారా రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. యాత్ర ముగిసే వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి.
రెండు మార్గాల ద్వారా యాత్ర ప్రారంభం కానుంది. దక్షిణ కాశ్మీర్ లోని పహల్గామ్ లోని 48 కిలోమీటర్ల నున్వాన్ నుంచి, సెంట్రల్ కాశ్మీర్ లోని గందర్ బాల్ లోని 14 కిలోమీటర్ల బాల్తాల్ మార్గం ద్వారా యాత్ర కొనసాగనుంది. కరోనా మహమ్మారి వల్ల గత రెండేళ్ల నుంచి అమర్ నాథ్ యాత్ర జరగలేదు. రెండేళ్ల విరామం తరువాత ఇప్పుడే మొదలైంది. 13 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారు 75 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు ఆరువారాల కన్నా ఎక్కవ గర్భం దాల్చిన స్త్రీలు యాత్రకు అనుమతించబడరు. అమర్ నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభం అయి ఆగస్టు 11న ముగియనుంది.
Also Read
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
ఇదిలా ఉంటే యాత్ర ప్రారంభం దగ్గర పడుతుండటంతో జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు హై అలర్ట్ గా ఉన్నాయి. ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉండటంతో అంతర్జాతీయ బార్డర్ ను జల్లెడ పడుతున్నారు. దీని కోసం ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సరిహద్దుల వెంబడి గస్తీని పెంచారు. యాత్ర మార్గంలో సీసీ కెమెరాలు, యాంటీ డ్రోన్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. కరోనా కన్నా ముందు 2019లో 3.42 లక్షల మంది ప్రజలు శివలింగాన్ని దర్శించుకున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
-
Jobs : AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయ్.. కానీ ఈ రంగాల్లో మాత్రం డిమాండ్ పెరుగుతోంది!
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!