ఇదిలా ఉంటే శ్రీనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( ఎన్ఐటీ) విద్యార్థులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉండటంతో కొన్ని ఆదేశాలను జారీ చేసింది. విద్యార్థులు గ్రూపులగా మ్యాచ్ చూడద్దని.. సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేయవద్దని స్టూడెంట్స్ వెల్ఫెర్ డీన్ నోటీసులు జారీ చేశారు. ఎన్ఐటీ విద్యార్థులు మ్యాచ్ సమయంలో తమకు కేటాయించిన గదుల్లోనే ఉండాలని వర్సిటీ అధికారులు కోరారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో…
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ 14 రోజుల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రెండు వారాల్లోనే కొత్త పార్టీ స్థాపిస్తారని.. గులాం నబీ ఆజాద్కు అత్యంత సన్నిహితుడైన జీఎం సరూరీ వెల్లడించారు.
Three Lashkar Terrorists Arrested In Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవేట కొనసాగుతోంది. తాజాగా ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు పట్టుకున్నాయి. లష్కరే తోయిబాకు వీరంతా ఓవర్ గ్రౌండ్ వర్కర్లుగా పనిచేస్తున్నారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. 22 రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ లో వీరిని పట్టుకున్నారు. సోపోర్ పోలీసులు శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమై చౌక్ వద్ద తనిఖీలు చేస్తున్న…
జమ్మూకశ్మీర్లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామాకు మద్దతుగా కాంగ్రెస్కు చెందిన ఐదుగురు నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీరుతో విసుగు చెంది పార్టీకి రాజీనామా చేసిన కశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ జమ్మూ కశ్మీర్లో కొత్తగా పార్టీ పెట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. బీజేపీలో చేరకుండా.. జమ్మూకశ్మీర్లో సొంత పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు ఆజాద్ సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.
Terrorist captured along LoC: జమ్మూ కాశ్మీర్ లో పాకిస్థాన్ ఉగ్రవాది పట్టుబడ్డాడు. సరిహద్దులు దాటి భారత సైన్యంపై దాడి చేసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కాశ్మీర్ రాజౌరీ జిల్లాలో గత రెండు మూడు రోజులుగా చొరబాటుదారుల కదలికలు ఎక్కువయ్యాయి. ఆగస్టు 21న నౌషేరాలోని ఝంగర్ సెక్టార్ లో నియంత్రణ రేఖకు సమీపంలో ఉగ్రవాదులను కదలికను సైన్యం గుర్తించింది. కంచెను కత్తెరించి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అయితే సైనికులు కాల్పుల జరపడంతో ఒకరు గాయపడ్డారు. అతన్ని భద్రతా…
BJP leader’s body found hanging from tree in jammu kashmir: జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ నేత మరణం వివాదాస్పదం అవుతోంది. కథువా జిల్లాలోని హీరానగర్ ప్రాంతంలో మంగళవారం బీజేపీ నాయకుడు అనుమానాస్పద రీతిలోొ చెట్టుకు వెలాడుతూ కనిపించాడు. బీజేపీ నాయకుడు సోమ్ రాజ్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది హత్యా.. ఆత్మహత్యా అని తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. హీరానగర్ పట్టణానికి చెందిన సోమ్ రాజ్ గత మూడు రోజుల…
కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ఇరు దేశాలకు యుద్ధం ఓ ఆప్షన్ కాదని, చర్చల ద్వారా భారత్తో శాశ్వత శాంతి నెలకొనాలని పాకిస్థాన్ కోరుకుంటోందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శనివారం మీడియా కథనంలో పేర్కొన్నారు.
జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలోని కత్రా పట్టణంలోని మాతా వైష్ణో దేవి యాత్ర ఇవాళ పున:ప్రారంభం కానుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా శనివారం సాయంత్రం నుంచి ఈ యాత్రను నిలిపివేశారు.
Congress Opposes Inclusion Of "Non-Locals" In Jammu-Kashmir Elections: జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతరులను ఓటర్లగా ఓటర్ జాబితాలో చేర్చడాన్ని కాశ్మీరీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఈ అంశంపై తమ నిరసనను తెలియజేశాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా స్థానికేతరులకు ఓటుహక్కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ అంశంపై న్యాయపరంగా పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతోంది. జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతరులు ఓటు వేసేందుకు అనుమతించడం చట్టవిరుద్ధమని కాంగ్రెస్ పార్టీ…