Pakistan Prime Minister: భారత్తో శాశ్వత శాంతి కావాలి.. యుద్ధం ఆప్షన్ కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Prime Minister: కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ఇరు దేశాలకు యుద్ధం ఓ ఆప్షన్ కాదని, చర్చల ద్వారా భారత్తో శాశ్వత శాంతి నెలకొనాలని పాకిస్థాన్ కోరుకుంటోందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శనివారం మీడియా కథనంలో పేర్కొన్నారు. హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థుల ప్రతినిధి బృందంతో మాట్లాడిన షరీఫ్.. ఈ ప్రాంతంలో సుస్థిర శాంతి, ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం కశ్మీర్ సమస్య పరిష్కారంతో ముడిపడి ఉందని కూడా చెప్పినట్లు ది న్యూస్ ఇంటర్నేషనల్ వార్తాపత్రిక నివేదించింది. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలని పాకిస్థాన్ సంకల్పించిందని ఆయన అన్నారు. రెండు దేశాలకు యుద్ధం ఎంపిక కానందున చర్చల ద్వారా భారత్తో శాశ్వత శాంతిని కోరుకుంటున్నామని ఆయన నివేదికలో పేర్కొన్నారు.
కశ్మీర్ సమస్య, పాకిస్థాన్ నుండి వెలువడుతున్న సీమాంతర ఉగ్రవాదం కారణంగా భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు తరచుగా దెబ్బతిన్నాయి. జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ దేశంలో అంతర్భాగంగానే ఉంటుందని భారత్ పదే పదే పాకిస్థాన్కు చెబుతోంది. ఉగ్రవాదం, శత్రుత్వం, హింస లేని వాతావరణంలో పాకిస్థాన్తో సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటున్నామని భారత్ పేర్కొంది.
Also Read
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
- Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Trump - Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా - ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్తో నెతన్యాహు ఫైర్!
పరస్పర చర్య సందర్భంగా పాకిస్థాన్, ఇండియా వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, వారి ప్రజల పరిస్థితులను మెరుగుపరచడంలో పోటీని కలిగి ఉండాలని షరీఫ్ సూచించారు. పాకిస్థాన్ దురాక్రమణదారు కాదని, దాని అణ్వాయుధ ఆస్తులు, శిక్షణ పొందిన సైన్యం నిరోధకమని.. ఇస్లామాబాద్ తమ సరిహద్దులను రక్షించడానికి దాని మిలిటరీపై ఖర్చు చేస్తుందని, దూకుడు కోసం కాదని ఆయన అన్నారు.
Terrorists: అల్ఖైదాతో సంబంధాలున్న ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) కార్యక్రమం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. దేశ ఆర్థిక సంక్షోభం ఇటీవలి దశాబ్దాలలో రాజకీయ అస్థిరతతో పాటు నిర్మాణ సమస్యల నుండి ఉత్పన్నమైందని అన్నారు. పాకిస్థాన్ ఆవిర్భవించినప్పటి నుంచి మొదటి కొన్ని దశాబ్దాలు ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించిందనన్నారు. అధిక ద్రవ్యోల్బణం, జారుతున్న ఫారెక్స్ నిల్వలు, విస్తరిస్తున్న కరెంట్ ఖాతా లోటు, క్షీణిస్తున్న కరెన్సీతో నగదు కొరతతో సతమతమవుతున్న పాకిస్థాన్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది.
తాజావార్తలు
-
Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!