Jammu Kashmir: కాశ్మీర్ లో పట్టుబడ్డ లష్కరేతోయిబా ఉగ్రవాదులు.. ఆయుధాలు, పాక్ జెండాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Three Lashkar Terrorists Arrested In Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవేట కొనసాగుతోంది. తాజాగా ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు పట్టుకున్నాయి. లష్కరే తోయిబాకు వీరంతా ఓవర్ గ్రౌండ్ వర్కర్లుగా పనిచేస్తున్నారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. 22 రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ లో వీరిని పట్టుకున్నారు. సోపోర్ పోలీసులు శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమై చౌక్ వద్ద తనిఖీలు చేస్తున్న క్రమంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు దొరికారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దొరికిన ముగ్గురు ఉగ్రవాదులను షరీఫ్ అష్రఫ్, సక్లైన్ ముస్తాక్, తౌఫీక్ హసన్ షేక్ లుగా గుర్తించారు. తనిఖీలు చేస్తున్న సమయంలో గొరిపురా నుంచి బొమ్మై వైపు వస్తున్న ముగ్గురు వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ముగ్గురు పారిపోయేందుకు ప్రయత్నించడంతో భద్రతా బలగాలు పట్టుకున్నాయి. వీరి వద్ద నుంచి మూడు హ్యండ్ గ్రెనెడ్లు, తొమ్మిది పోస్టర్లు, 12 పాకిస్తాన్ జెండాలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్పై స్పీకర్ కీలక చర్య
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
Read Also: Munawar Faruqui: మునావర్ ఫరూఖీ షోకు అనుమతి నిరాకరించిన ఢిల్లీ పోలీసులు..
అరెస్ట్ అయిన ఉగ్రవాదులు నిషేధిక లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన వారు. వీరంతా బయట నుంచి కాశ్మీర్ ప్రాంతానికి వలస వచ్చిన కూలీలు, సాధారణ పౌరులపై, భద్రతా బలగాలపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తేలింది. ఇటీవల కాలంలో ఉగ్రవాదులు సామాన్యులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. కాశ్మీర్ హిందువులతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారిని టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల యాపిల్ తోటలో పనిచేసుకుంటున్న వ్యక్తిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అంతకు ముందు ఇలాగే కాశ్మీర్ పండిట్ రాహుల్ భట్, టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్, ఓ మహిళా ఉపాధ్యాయురాలిని, రాజస్థాన్ కు చెందిన బ్యాంక్ మేనేజర్ తో పాటు బీహార్ ప్రాంతం నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వ్యక్తులను కాల్చి చంపారు. లష్కరే తోయిబాతో పాటు దీనికి అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ దాడులకు తెగబడుతోంది.
తాజావార్తలు
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
-
Nepal Floods: నేపాల్లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
-
Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!