Pakistan Cricket: కోచ్ టార్గెట్గా పాకిస్తాన్ క్రికెట్లో తిరుగుబాటు..
- టీ20 వరల్డ్ కప్లో పాక్ ఘోర వైఫల్యం..
- కోచ్పై ఆటగాళ్ల తిరుగుబాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Cricket: T20 ప్రపంచ కప్లో ఘోర పరాజయాలు పాకిస్తాన్ క్రికెట్లో సంక్షోభానికి కారణమవుతున్నాయి. భారత్పై ఓడిపోవడమే కాకుండా, సెమీస్కు క్వాలిఫై అవ్వకపోవడంపై పాక్ మాజీలు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, టీమ్ సభ్యులపై విరుచుకుపడుతున్నారు. పాక్ క్రికెటర్ల పేలవమైన ఆటతీరుకు గానూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) భారీ జరిమానాను వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కెప్టెన్ను తొలగించవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
Read Also: AP Crime: పేకాటలో బాకీ వివాదం.. స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు..
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
పాక్ ఘోర ఆటతీరు, పరాజయాలకు కోచ్ మైక్ హెస్సెన్పై మాజీలు విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఆటగాళ్లు కోచ్పై తిరుగుబాటు చేస్తున్నారని తెలుస్తోంది. టోర్నమెంట్ సమయంలో కోచ్ ప్రవర్తనపై ఆటగాళ్లు వ్యక్తిగతంగా పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారని అక్కడి మీడియా చెబుతోంది. అతడి కఠినమైన విధానాలు, సంప్రదింపులు లేకుండా తీసుకున్న నిర్ణయాలు డ్రెస్సింగ్ రూంలో వాతావరణాన్ని దెబ్బతీశాయని ఆరోపిస్తున్నారు. కెప్టెన్ను సంప్రదించకుండానే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని, హెస్సెన్ తరుచుగా జట్టు నిర్వహణ అంశాల్లో జోక్యం చేసుకుంటున్నారని కూడా పేర్కొన్నారు.
సీనియర్ అధికారులు ప్రస్తుతం కోచ్ హెస్సెన్ ప్రవర్తనపై సమీక్షిస్తున్నారు. కోచ్తో వివరణాత్మక చర్చలు జరిపే ముందు టూర్ నివేదికను పరిశీలించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ ప్యానెల్, కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఇద్దరూ హెస్సెన్ అధికారాన్ని సవాలు చేయలేకపోయారని, కోచ్ జట్టు వ్యవహారాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నారని తెలుస్తోంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో హెస్సెన్ ను పీసీబీ తొలగించకపోవచ్చు. అతడితో పీసీబీకి 2 ఏళ్ల ఒప్పందం ఉంది.
తాజావార్తలు
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన సౌదీ అరేబియా.. అమెరికాతో చెడిందా?
-
Jupally Krishna Rao : రూ.8.21 లక్షల కోట్ల అప్పు.. జూపల్లి బిగ్ ఛాలెంజ్.!
-
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకర దాడులు.. 15 మంది మృతి
-
CM Chandrababu Naidu: ఉక్కు కర్మాగార పనులను ప్రారంభించిన సీఎం.!
-
CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!