India vs Pakistan: గ్రూపులుగా మ్యాచ్ చూడొద్దు, పోస్టులు చేయొద్దు .. శ్రీనగర్ ఎన్ఐటీ ఆదేశం
India vs Pakistan T20 match .. Srinagar NIT orders: ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచు పైనే ప్రధాన చర్చ జరుగుతోంది. చాలా రోజుల తర్వాత ఆసియా కప్ లో ఇరు దేశాలు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే టీ20 మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాయంత్రం జరిగే మ్యాచ్ కోసం అభిమానులు సిద్ధం అవుతున్నారు.
ఇదిలా ఉంటే శ్రీనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( ఎన్ఐటీ) విద్యార్థులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉండటంతో కొన్ని ఆదేశాలను జారీ చేసింది. విద్యార్థులు గ్రూపులగా మ్యాచ్ చూడద్దని.. సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేయవద్దని స్టూడెంట్స్ వెల్ఫెర్ డీన్ నోటీసులు జారీ చేశారు. ఎన్ఐటీ విద్యార్థులు మ్యాచ్ సమయంలో తమకు కేటాయించిన గదుల్లోనే ఉండాలని వర్సిటీ అధికారులు కోరారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో వారి వారి గదుల్లోనే విద్యార్థులు ఉండాలని.. ఇతర విద్యార్థుల గదుల్లోకి ప్రవేశించడానికి.. గ్రూపులుగా ఏర్పడి మ్యాచ్ చూడటానికి అనుమతి లేదని ఆదేశాలు జారీ చేసింది.
Also Read
- Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..
- AI Viral Story: సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి వెయిటర్గా.. ఏఐ దెబ్బకు తలకిందులైన జీవితం..
- West Bengal Elections: మమతా బెనర్జీ నియోజకవర్గంలో మరో గందరగోళం..
- Vijay TVK Plan B: రేపు ఫలితాలు.. విజయ్ 'ప్లాన్-బి' రెడీ.. అభ్యర్థులకు దళపతి సీరియస్ వార్నింగ్!
Read Also: OTT: రూ.12,000 కోట్లకు చేరనున్న ఓటీటీ మార్కెట్.. థియేటర్లకు ఇక కష్టకాలమే..
ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే.. హస్టల్ నుంచి డిబార్ చేస్తామని.. విద్యార్థులకు రూ.5,000 చొప్పున జరిమానా విధిస్తామని ఎన్ఐటీ తెలిపింది. సోషల్ మీడియా వేదికగా మ్యాచ్ కు సంబంధించి ఎలాంటి పోస్టు చేయకూడదని విద్యార్థులను ఆదేశించారు. 2016లో టీ20 వరల్డ్ కప్ సెమీ-ఫైనల్ లో వెస్టిండీస్ తో భారత్ ఓడిపోయిన తర్వాత స్థానిక, ఇతర ప్రాంతాల విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. దీంతో ఆ సమయంలో కొన్ని రోజుల పాటు ఎన్ఐటీని మూసివేయాల్సి వచ్చింది. గ్రూపులుగా చూస్తున్న సమయంలో ఎవరైనా విద్యార్థులు ఇతర దేశాలకు మద్దతు తెలిపినా.. వారికి అనుకూలంగా నినాదాలు చేసినా.. పరిస్థితి కట్టుతప్పే అవకాశం ఉండటంతో ఎన్ఐటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
SRH vs KKR IPL 2026: అరుదైన రికార్డు సాధించిన సునీల్ నరైన్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఆటగాడిగా..
-
Donald Trump: జర్మనీకి డబుల్ షాక్ ఇచ్చిన ట్రంప్..
-
Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..
-
PV Sindhu : మ్యాజిక్ డ్రెయిన్స్తో పల్లెల్లో సరికొత్త విప్లవం
-
Dacoit OTT Release Date: అడివి శేష్ ‘డెకాయిట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!